India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాలమూరు యూనివర్సిటీలో సౌత్ జోన్ టోర్నీలో పాల్గొనేందుకు అథ్లెటిక్స్ యోగాలో స్త్రీ, పురుషుల విభాగంలో ఆదివారం ఎంపికలు నిర్వహిస్తున్నట్లు PD శ్రీనివాసులు తెలిపారు. అథ్లెటిక్స్ విభాగంలో జంప్స్, రన్స్, త్రోస్.. యోగా విభాగంలో యోగాసనాలు, సూర్య నమస్కారాలు తదితర ఆసనాలు ఉంటాయన్నారు. ప్రస్తుతం చదువుతున్న బోనఫైడ్, టెన్త్ మెమోతో హాజరు కావాలన్నారు. PU పరిధిలోని అన్ని కళాశాలల క్రీడాకారులు పాల్గొనవచ్చని చెప్పారు.
హైదరాబాద్ సరూర్నగర్ నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రసంగించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏం ముఖం పెట్టుకొని సంబరాలు నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలు ప్రశ్నిస్తారని భయంతో రైతులను మభ్యపెట్టడానికి సోయి మరిచి సంబరాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మహబూబ్ నగర్ జిల్లాలో ఇటీవల విధులలో చేరిన 117మంది నూతన కానిస్టేబుల్స్ అభ్యర్థులలో 12 మంది అబ్బాయిలు, ఓ అమ్మాయి మొత్తం 13మంది గ్రూప్- 4 ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించిన వారిని మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి అభినందించారు. వీరంతా భవిష్యత్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు.
ఆందోల్ MLA రాజనర్సింహ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది. కాగా, ఆయనకు CM రేవంత్ వైద్య, ఆరోగ్యశాఖ కేటాయించడంతో పాటు MBNR ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్ఛార్జ్ మంత్రిగా MBNRలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ వేదికగా ఫ్రీ బస్సు పథకం ప్రారంభం, రుణమాఫీ, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పనులు పూర్తిచేస్తున్నామన్నారు. మీ కామెంట్?
రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇప్పటి వరకు ఉమ్మడి MBNRలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు, కొడంగల్లో ‘కడా’ ఏర్పాటు, కురుమూర్తి ఆలయ ఘాట్ రోడ్డు కారిడార్ నిర్మాణానికి రూ.110కోట్లతో శంకుస్థాపన, జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ప్రకటన, సహా పలు పనులు చేపట్టారు. మీ కామెంట్?
జడ్చర్ల గ్రామీణ మండలం అలావానిపల్లి గ్రామంలో గొల్లత్తగుడి 8వ శతాబ్దపు ఆలయం.1149-1162 కాలంలో చాళుక్య రాష్ట్ర కూట రాజవంశీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. వారు జైన, బౌద్ధ మతాలను ఆదరించారు. అప్పట్లోఈ గ్రామం జైనమత కేంద్రంగా వర్ధిల్లింది. జైన ఆలయం 65 అడుగులు ఉంటుంది. ఇటుక పై ఇటుక పేర్చి సిమెంటు, మట్టి ఉపయోగించకుండా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని చరిత్రాత్మక ఆలయంగా కేంద్ర పురావస్తు శాఖ గుర్తించింది.
శ్రీశైలం డ్యామ్ను ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున శుక్రవారం సందర్శించారు. మల్లన్న దర్శనార్థమై వచ్చిన ఆయన శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యలో డ్యామ్ వద్ద కాసేపు ఆగారు. జలాశయం అందాలను తిలకించారు. డ్యామ్ వద్ద ఉపాధి పొందే పలువురు ఫొటోగ్రాఫర్లు నాగార్జునతో ఫొటోలు దిగారు. అంతకుముందు నూతన వధూవరులు అక్కినేని నాగచైతన్య, శోభితతో కలిసి నాగార్జున శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు.
వనపర్తి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అనారోగ్యంతో కూతురు చనిపోగా అది తట్టుకోలేని ఆ తండ్రి గుండె ఆగిపోయింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఖిల్లా ఘనపూర్లో నివాసముంటున్న దేవరశెట్టి శ్రీనివాసులు 17ఏళ్ల కుమార్తె వైశాలి అనారోగ్యంతో గురువారం చనిపోయింది. బిడ్డ మృతిని తట్టుకోలేని విలపిస్తున్న శ్రీనివాసులు కూతురు మృతదేహంపై పడి గుండెపోటుతో మృతిచెందారు. ఒకే రోజు తండ్రీకుతూరు మృతి స్థానింకగా కలిచివేసింది.
TGPSC ద్వారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో JL గా ఎంపికైన అభ్యర్థులు తమకు వెంటనే నియామక పత్రాలు అందజేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బొందలకుంట గ్రామానికి చెందిన జయరాములు, మొల్గర గ్రామానికి చెందిన మహేశ్, చందాపురం గ్రామానికి చెందిన అనిల్ కుమార్ తెలుగు అధ్యాపకులుగా ఎంపికయ్యారు. నియామక పత్రాలు వెంటనే అందజేసి ఇంటర్ విద్యలో తమను భాగం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మెగా కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కళాకారుడు డప్పుల నాగరాజు సారథ్యంలో వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో సాయంత్రం కళా ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.