India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నేటి సమాచారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.225 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆవిరి ద్వారా 83 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 550, కుడి కాలువకు 400, మొత్తం అవుట్ఫ్లో 1,481 క్యూసెక్కులను వదులుతున్నట్లు తెలిపారు.
పేదల తిరుపతిగా ప్రసిద్దిగాంచిన ఉమ్మడి MBNR జిల్లాలోని కురుమూర్తి స్వామి ఆలయంలో ఈ నెల 11వ తేదీన గిరి ప్రదక్షణ ప్రారంభం కానుంది. అయోధ్యలో బాలరాముడి విగ్రహా ప్రతిష్ట జరిగి ఆరోజుకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వీహెచ్పీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఎంపీ డీకే అరుణ బుధవారం డెవలప్మెంట్ కమిటీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆస్పత్రుల అప్ గ్రేడ్, ఇతర అభివృద్ధి పనుల కోసం భారీగా నిధుల మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే అధికారులు పాల్గొన్నారు.
తాజ్మహల్ నిర్మాణంలో మహబూబ్నగర్ ప్రాంతంలో లభించే క్రిస్టల్ క్వార్ట్జ్ రాళ్లను(పలుగు రాళ్లు) వాడినట్లు తాజాగా వెల్లడైంది. కాలిఫోర్నియాలోని జెమోలాజికల్ లైబ్రరీ& రీసెర్చ్ సెంటర్ నుంచి రిటైర్డ్ లైబ్రేరియన్ డిర్లామ్, రీసెర్చ్ లైబ్రేరియన్ రోజర్స్, సంస్థ డైరెక్టర్ వెల్డన్ కలిసి అధ్యయనం చేపట్టారు. పర్చిన్కారి పద్ధతిలో ఈ రాళ్లను తాజ్మహల్ పాలరాతిలో అంతర్భాగంగా అమర్చినట్లు గుర్తించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మూడు సీజన్లలోనూ 1,690 ఎకరాల్లో రైతులు టమాటా సాగు చేశారు. గిట్టుబాటు ధర రాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల క్రితం కిలో రూ.25-30 పలకగా.. ప్రస్తుతం రూ.10కి పడిపోయింది. పట్టణంలోని రైతుబజార్లో రూ.10 నుంచి రూ.15లకు విక్రయిస్తున్నారు. పంట ఉత్పత్తి పెరగడం, రైతులంతా ఒకేసారి మార్కెట్లకు పంట దిగుబడులు తీసుకురావడంతో ధరలు పడిపోయాయని ఉద్యాన శాఖ అధికారి వేణుగోపాల్ తెలిపారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంగళవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దేవరకద్ర మండలంలో జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొని ఇద్దరు, జడ్చర్ల సమీపంలో రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని ఓ వ్యక్తి, మూసాపేట మండలంలోని కొమిరెడ్డిపల్లి సమీపంలో లారీ ఢీకొనడంతో స్కూటీపై వెళ్తున్న ఆర్ఎంపీ డాక్టర్ మృతి చెందారు. ఈ ఘటనల్లో తీవ్రగాయాలైనవారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలోని SC, ST, BC, జనరల్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2025-26కి 5వ తరగతి తోపాటు 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 1లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆసక్తి, అర్హత ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. పూర్తి వివరాలు https://tgcet.cgg.gov.in లో చూడొచ్చు.
యువతిపై అత్యాచార ఘటన MBNRలో చోటుచేసుకుంది. సీఐ ఇజాజుద్దీన్ వివరాల మేరకు.. స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ యువతి తనపై అత్యాచారం జరిగిందని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. డిసెంబర్ 31 వేడుకల్లో అదే ఆసుపత్రిలో పనిచేసే ఓ యువకుడు అత్యాచారం చేసినట్లు అందులో పేర్కొంది. యువతి ఇరవై రోజుల కిందట విధుల్లో చేరినట్లు తెలిసింది. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
మహబూబ్నగర్ జిల్లాలో రైల్వే పనుల మరమ్మతుల కారణంగా పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లా మీదుగా సికింద్రాబాద్ – కర్నూల్ సిటీ తుంగభద్ర రైలు కర్నూలు – గద్వాల మధ్య పట్టాల మరమ్మతుల కారణంగా ఈ రైలు గద్వాల వరకు మాత్రమే నడవనుంది. కాచిగూడ – MBNR రైలు షాద్నగర్ వరకు మాత్రమే నడవనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,227 ప్రభుత్వ పాఠశాలలుంటే 3.50 లక్షల మంది విద్యార్థులు, 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా..17,500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి జిల్లాల్లో 275 మంది PEDలు, 45 మంది PETలు మాత్రమే ఉన్నారు.250 మంది విద్యార్థులకు ఒక పీఈటీ ఉండాలన్న నిబంధన నామమాత్రమే. ప్రభుత్వం క్రీడలపై దృష్టి పెట్టి వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.