India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా సహచర మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వనపర్తి కలెక్టరేట్ కార్యాలయంలోని ఎన్ఐసీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ హాజరయ్యారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లతో పేదల కలను సాకారం చేయడం ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
ఓ బాలిక(17)ను గర్భవతిని చేశాడు ఓ యువకుడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు కొన్ని రోజులుగా అదే గ్రామానికి చెందిన బాలికను ప్రేమిస్తున్నానంటూ తిరిగేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మంచి ఆమెపై పలు సార్లు అత్యాచారం చేశారు. దీంతో బాలిక గర్భం దాల్చింది. పెళ్లి చేసుకొమని అడగగా మొహం చాటేశాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లీదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనుమానాస్పద స్థితిలో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసుల ప్రకారం.. NGKL జిల్లా కొల్లాపూర్ మండలానికి చెందిన మరియమ్మ(40) తన భర్తతో భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో ఉంటోంది. కొద్దిరోజులుగా ఆమె కనిపించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా కుళ్లిన స్థితిలో మరియమ్మ మృతదేహం కనిపించింది. భర్తే హత్య చేసి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు.
మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం జిన్నారం గ్రామానికి చెందిన గోపాల్ గౌడ్ కుమార్తె మమత నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. 2018లో పంచాయతీ కార్యదర్శిగా, 2019లో కేజీబీవీ లెక్చరర్గా, 2024లో గురుకుల జూనియర్ లెక్చరర్గా, ఇటీవల ప్రకటించిన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో ఉద్యోగం సాధించి గెజిటెడ్ పోస్ట్ను దక్కించుకుంది. భర్త సుకుమార్ గౌడ్ ప్రోత్సాహంతోనే విజయాన్ని సొంతం చేసుకున్నట్లు తెలిపారు.
విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్థమయ్యే రీతిలో బోధించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. మిడ్జిల్ మండలం బోయిన్పల్లి జెడ్పి ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి బుధవారం తనిఖీ చేశారు. జిల్లా కలెక్టర్ మధ్యాహ్న భోజనం, పాఠశాల పరిసరాలు పరిశీలించారు. బియ్యం,ఆహార పదార్థాలు పరిశీలించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతతో అందించాలని, ఎటువంటి ఫిర్యాదులు రానివ్వకూడదని సూచించారు.
✔రేపు పుష్ప-2 రిలీజ్.. మొదలైన హంగామా✔NGKL:నూతన డీఈవోగా రమేష్ కుమార్✔ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న చలి✔NGKL: బైక్కు నిప్పు పెట్టిన దుండగులు✔అడ్డాకుల: ట్రాక్టర్, డీసీఎం ఢీ.. వ్యక్తికి తీవ్ర గాయాలు✔గద్వాలలో రేపు చేనేత సంబరాలు✔కనీస వేతనం చెల్లించాలని ఆశ వర్కర్ల ధర్నా✔నియామక పత్రాలు అందుకున్న గ్రూప్-4 అభ్యర్థులు✔పలువురికి CMRF చెక్కులు అందజేత✔మధ్యాహ్న భోజనం.. తనిఖీ చేసిన ఎమ్మెల్యేలు
నగల <<14783426>>వ్యాపారి హత్య<<>> కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. వనపర్తి SP తెలిపిన వివరాలు.. గుంటూరు జిల్లాకు చెందిన శేషు(43) బంగారం, వెండి ఆభరణాలను హోల్సేల్ ధరలకు సరఫరా చేసేవాడు. బిజినేపల్లిలో గోల్డ్ షాపు నడుపుతున్న దీపక్మాలి(రాజస్థాన్)కు గత నెలలో కొన్ని నగలు ఇచ్చాడు. ఈ క్రమంలో తన అప్పు తీర్చుకునేందుకు శేషు వద్ద నగలు, డబ్బు కొట్టేయాలనుకున్నాడు. తమ్ముడితో కలిసి ప్లాన్ ప్రకారం NOV 21న శేషును హత్య చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ భూకంపం వచ్చింది. ఈరోజు ఉదయం 7.26 నుంచి 7.31 వరకు ఆయా ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే నాగర్కర్నూల్, వనపర్తి, షాద్ నగర్, మహబూబ్నగర్, అచ్చంపేట తదితర ప్రాంతాల్లో భూమి కంపించిందని పలువురు సోషల్ మీడియాలో చెబుతుండగా దీనిపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది. అయితే మీ ప్రాంతంలో భూకంపం వచ్చిందా కామెంట్ చేయండి.
భార్యాభర్తల మధ్య గొడవ జరిగడంతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన బొంరాస్పేట్ మండలం మదన్ పల్లి తండాలో జరిగింది. ఎస్ఐ రావుఫ్ తెలిపిన వివరాలు.. తండాకు చెందిన లాలిబాయి, అమినా నాయక్ ఇద్దరు దంపతులు. భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న అనుమానంతో దంపతుల మధ్య వివాదం నెలకొంది. మంగళవారం ఇద్దరు గొడవ పడగా భార్య గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. వారికి ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుర్లు ఉన్నారు.
దివ్యాంగుల సంక్షేమ కోసం ప్రభుత్వం సంక్షేమ కార్య క్రమాలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం అంబేడ్కర్ అడిటోరియంలో ప్రపంచ దివ్యాంగులదినోత్సవ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమె సమాన అవకాశాలు, గౌరవంగా జీవించేందుకు కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల హక్కుల చట్టం 2016 అమలు చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.