India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డిస్టిక్ ఎక్స్ పోర్ట్ యాక్షన్ ప్లాన్ను తయారు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులకు సూచించారు. మంగళవారం ఎక్స్పోర్ట్ యాక్షన్ ప్లాన్పై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రెడ్ ప్రిన్సిపల్ ప్రైవేట్ సెక్రటరీ శైలజ హైద్రాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లా నుంచి ఇతర దేశాలకు వరి, పత్తి, చేనేత వస్త్రాలు ఎక్స్ పోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ చెప్పారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 59 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వచ్చేనెల జరిగే ప్రయోగ పరీక్షల నిర్వహణకు ప్రతి కళాశాలకు రూ.25 వేల చొప్పున నిధులు మంజూరు చేశారు. వీటితో రసాయనాలు, పరికరాలను కొనుగోలు చేయనున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.12 వేల చొప్పున కళాశాలకు కేటాయించారు. ప్రయోగ పరీక్షలను పర్యవేక్షించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాలతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు.
నారాయణపేట మండలం పెరపళ్లకి చెందిన <<15077017>>బాలుడు<<>> ఆంజనేయులు(15) ఉరేసుకున్న విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన శ్రీనివాస్, బుగ్గమ్మ దంపతుల పెద్దకొడుకు ఆంజనేయులు 7వ తరగతి వరకు చదివి పొలం పనులు చేస్తూ, గొర్రెలు కాస్తున్నాడు. చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో ఆదివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. నిన్న ఉదయం శాసన్పల్లి శివారులో చెట్టుకు ఊరేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి తుది ఓటరు జాబితాను ఎన్నికల కమిషన్ సోమవారం విడుదల చేసింది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 34,54,354 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 17,43,276 మంది మహిళలు, 17,10.989 మంది పురుషులు ఉండగా ఇతరులు 89 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేసిన అనంతరం 13,404 మంది ఓటర్లు పెరగటం గమనార్హం.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షల కోసం ఫీజు చెల్లించని విద్యార్థుల కోసం ఇంటర్ బోర్డ్ ఈనెల 16 వరకు అవకాశం కల్పించిందని జిల్లా ఇంటర్ కార్యాలయం వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు ఇంటర్ ఫీజు చెల్లించని మొదటి, ద్వితీయ సంవత్సరం, ప్రైవేటు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కార్యాలయం సిబ్బంది పేర్కొన్నారు.
కొల్లాపూర్ మండల పరిధిలోని సింగోటంలోని గ్రామంలో రూ.40 లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులతో ఆధునీకరించిన ప్రాథమిక, జడ్పీహెచ్ఎస్ భవనాలను సోమవారం మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల్లో నాణ్యమైన విద్యా బోధన అందిస్తామని, ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి మౌలిక వసతులతో వీటిని తీర్చిదిద్దుతామని అన్నారు.
జిల్లాలోని రెసిడెన్షియల్, కేజీబీవీ పాఠశాలలు, వసతి గృహాలలో బాలికల భద్రతకు అన్నిచర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలు ఆమె మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పని చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. డైట్ చార్జీల పెంపునకు అనుగుణంగా కామన్ మెన్ అమలు చేస్తూ నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. వంట గది, పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఆమె ఆదేశించారు.
✔’జీపీ కార్మికులకు జీతాలు ఇవ్వాలి’:IFTU,PDSU
✔పిల్లలతో నిరసన తెలిపిన ఎస్ఎస్ఏ ఉద్యోగులు
✔ప్రజావాణి..సమస్యలపై ప్రత్యేక ఫోకస్
✔రైతులకు కాంగ్రెస్ మోసం చేసింది:BRS
✔ధరూర్:రేపు భగీరథ నీటి సరఫరా బంద్
✔గ్రంథాలయాల ద్వారా విజ్ఞానం: జూపల్లి
✔MBNR:గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
✔అచ్చంపేట:తమ్ముడిపై కత్తితో దాడి చేసిన అన్న
✔MBNRలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
✔ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని చెప్పి ఆశ చూపి.. ప్రజలను రేవంత్రెడ్డి నట్టేట ముంచారని బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు రూ.12 వేలకు కుదించటమేంటని ప్రశ్నించారు. మాట తప్పినందుకు సీఎం రేవంత్ రైతులకు క్షమాపణ చెప్పాలన్నారు. పాలన చేతకాకుంటే పదవి నుంచి దిగిపోవాలని పేర్కొన్నారు.
ఉమ్మడి మహబూబ్నగర్కు చెందిన ఇద్దరు వేర్వేరు కారణాలతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలిలా.. మల్దకల్కు చెందిన కుమ్మరి నర్సింహులు(42) గద్వాలలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో రుణం తీసుకున్నారు. వారు లోన్ చెల్లించాలని ఒత్తిడి తేవటంతో ఈ నెల 3న ఉరేసుకున్నారు. నందివడ్డెమాన్కి చెందిన చెన్నయ్య(45) ఆదివారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు.
Sorry, no posts matched your criteria.