India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి MBNR జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా పంచాయతీ ఎన్నికలా? ప్రాదేశిక ఎన్నికలా? అనే విషయంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఇప్పటికే ఎన్నికల కమిషన్ నుంచి ఎన్నికల సామగ్రిని జిల్లాలకు పంపించే ప్రక్రియ ప్రారంభమైంది. మరోవైపు ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా ఏ ఎన్నికలు ముందుగా వస్తాయనే విషయంపై గ్రామాల్లో చర్చ జరుగుతోంది.
నాగర్కర్నూల్ జిల్లా చారకొండలో జరిగిన <<15075870>>రోడ్డు <<>>ప్రమాదంలో ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. స్థానికుల తెలిపిన ప్రకారం.. కల్వకుర్తి మండలం తాండ్రకి చెందిన రామకోటి (32), వెల్దండ మండలం కొట్రకు చెందిన గణేశ్ (34)తో కలిసి పెళ్లి చూపుల కోసం వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో వీరి కారు లారీని బలంగా ఢీకొట్టింది. ఈఘటనలో కారు నుజ్జునుజ్జు అయి అందులో ఇరుక్కుని స్పాట్లో చనిపోయారు. కేసు నమోదైంది.
✔పాలమూరు ప్రాజెక్ట్కు జైపాల్ రెడ్డి పేరు ఎలా పెడతారు: ఎంపీ డీకే అరుణ✔వడ్డేమాన్: సంపులో పడి యువరైతు మృతి✔NGKL మాజీ ఎంపీకి జూపల్లి పరామర్శ✔ఉమ్మడి జిల్లాను వణికిస్తున్న చలి✔MBNR: పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్✔MBNR:7 నుంచి సదరం క్యాంపులు ✔రేపటి నుంచి సీసీ టీవీ కెమెరా సర్వీసింగ్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ప్రారంభం✔పలుచోట్ల పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీలు
❤️హెల్మెట్ లేకుంటే కలెక్టరేట్లోకి నో ఎంట్రీ: వనపర్తి కలెక్టర్ బాదావత్ సంతోష్.❤️జీవితంలో సైన్స్ చాలా అవసరం:నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్.❤️కాలేజీ బాత్రూమ్లో కెమెరా కలకలం: పోలీసుల అదుపులో ఓ యువకుడు.❤️బొట్టు పెట్టి చెప్తున్నాం.. పేరెంట్స్ మీటింగ్కు రండి సింగోటంలో గ్రామస్తులను ఆహ్వానించిన టీచర్లు.❤️ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం: ఎస్పీ గిరిధర్
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండల పరిధిలోని జడ్చర్ల, కోదాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మృతులు గణేశ్(30), రామకోటి(25)లుగా స్థానికులు గుర్తించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఉద్యోగ భద్రత, సమస్యల పరిష్కారం కోరుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయ జిల్లా కేంద్రాల్లో సమగ్ర శిక్షా ఉద్యోగులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఉద్యోగులు వినూత్న రీతిలో తమ నిరసన తెలిపారు. వారు తమ చేతులకు సంకెళ్లు వేసుకుని, ప్లకార్డులు పట్టుకొని ‘సంకెళ్లు తెంపండి.. రెగ్యులర్ చేయండి’ అనే నినాదంతో శిబిరంలో నినాదాలు హోరెత్తించారు. అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల బాత్రూంలో మొబైల్ ఫోన్ ఘటనపై మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం పాలిటెక్నిక్ కళాశాలకు వెళ్లి విద్యార్థినులను కలిసి వారితో మాట్లాడారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ, జిల్లా కలెక్టర్కు సూచించారు.
బిజినేపల్లి మండలం వడ్డేమాన్ గ్రామానికి చెందిన రైతు గుంటి బంగారయ్య (38) ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందాడు. రోజువారీగా పొలం దగ్గర ఉన్న సంపులో మోటారు ఆన్ చేసేందుకు వెళ్లగా మోటారు నడవలేదు. దీంతో ఆ మోటారును సరిచేసే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి సంపులో పడిపోయాడు. అతడికి ఈత రాకపోవడంతో మృతి చెందారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మంద జగన్నాథం గుండె సంబంధిత వ్యాధితో గత కొన్ని రోజులుగా HYD ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం ఆసుపత్రికి చేరుకొని మంద జగన్నాథంను పరామర్శించారు. అనంతరం ఆయన కుమారుడు మంద శ్రీనాథ్ను మంత్రి పలకరించి మాజీ ఎంపీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల బాత్ రూంలో సెల్ఫోన్ కెమెరా పెట్టిన ఘటనపై కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకీతో కలిసి కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపల్, విద్యార్థినులతో మాట్లాడారు. ఘటనపై ప్రిన్సిపల్ పోలీస్ శాఖకు సమాచారం అందించడంతో కెమెరా పెట్టిన విద్యార్థిని అరెస్ట్ చేశారు. విద్యార్థుల భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Sorry, no posts matched your criteria.