India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్నగర్ మండలం చించోడ్ గ్రామస్థులు శనివారం ప్రజల శ్రేయస్సు కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో మద్యం అమ్మితే రూ.50 వేలు, మద్యం కొంటే రూ.25 వేలు, పేకాట ఆడితే రూ.50 వేల జరిమానా విధిస్తూ ఓ ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బాలికల బాత్ రూంలో సెల్ఫోన్ కెమెరా పెట్టిన ఘటనపై జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకీతో కలిసి కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపల్, విద్యార్థినులతో మాట్లాడారు. ఘటనపై ప్రిన్సిపల్ పోలీస్ శాఖకు సమాచారం అందించడంతో కెమెరా పెట్టిన విద్యార్థిని అరెస్టు చేశారు. విద్యార్థుల భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
✔ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి
✔MBNR: గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు..నిందితుడి పై కేసు నమోదు
✔కార్మికులపై అణచివేత విధానాలు మానుకోవాలి:CITU
✔జూరాల ప్రాజెక్టులో తగ్గుతున్న నీటి సామర్థ్యం
✔’Way2News’తో శ్రీరంగాపూర్ గ్రామ సెక్రెటరీ
✔PU క్రీడాకారులు ప్రతిభ కనబరచాలి: వీసీ
✔కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
✔CMRF చెక్కుల పంపిణీ
✔పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యేలు
❤️పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్ కాలేజీ భవనాల నిర్మాణం చేపట్టండి: యెన్నం శ్రీనివాస్ రెడ్డి.❤️తెలంగాణ హైకోర్టు విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్ నోటిఫికేషన్లో తీవ్ర అన్యాయం: మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి సహదేవుడు.❤️డిండి లిఫ్ట్ నుంచి రోజుకు నుంచి టీఎంసీలు నీటిని తరలించడం తగదు: మాజీ మంత్రి నాగం ❤️పెద్దమందడి చెందిన పెంటయ్య(52) ఏపీలో అనంతపురంలో రైలు ఢీ, మృతి
BRS నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో MRPS అధినేత మందకృష్ణ మాదిగ HYDలోని ఆయన నివాసంలో శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న వేల గొంతులు.. లక్షల డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తన వంతు పాత్ర పోషించాలని ఆర్ఎస్పీని మందకృష్ణ కోరారు. అందుకు ఆర్ఎస్పీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మార్పీఎస్ వర్గాలు తెలిపారు.
గద్వాల జిల్లా మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దివంగత నటుడు శ్రీహరి సతీమణి డిస్కో శాంతి ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు దేవాలయ ఛైర్మన్ ప్రహ్లాద రావు స్వామివారి శేష వస్త్రం, చరిత్ర పుస్తకాన్ని బహూకరించారు. ఈ సందర్భంగా దేవాలయ అన్నదానానికి రూ.5,016 అందించారు. ఈ కార్యక్రమంలో సూర్య ప్రకాశ్ రెడ్డి, చంద్రశేఖరరావు, కేశవర్ధన్ రెడ్డి ఉన్నారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి మంత్రి సీతక్క షాద్నగర్ నియోజకవర్గానికి చేరుకున్నారు. పట్టణంలోని బైపాస్ కేశంపేట రోడ్డులో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళ కాంగ్రెస్ నాయకురాలు బతుకమ్మతో స్వాగతం పలికారు.
మహబూబ్నగర్ జిల్లాలోని నందిపాడు, దోరెపల్లి, గుండుమాల్ పరిసర ప్రాంతాల్లో చిరుత పులులు సంచరిస్తున్నాయని అటవీ అధికారులు తెలిపారు. కాగా.. గురువారం రాత్రి కొత్తపల్లితండా మాజీ సర్పంచ్ బెణిక్యానాయక్ పొలంలో గొర్రెల మందపై చిరుత దాడి చేసిందని కాపరులు తెలిపారు. రాత్రుళ్లు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవి జంతువుల దాడిలో పశువులు మృతిచెందితే తమకు సమాచారం అందించాలని అటవీ అధికారులు తెలిపారు.
నారాయణపేట పట్టణంలోని ఓ కాలనీలో మూడు రోజుల క్రితం ఓ ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని శుక్రవారం రిమాండ్ చేసినట్లు డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. నరేశ్ అనే వ్యక్తి మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు.
కొత్తగా విధుల్లో చేరే పోలీసులు ప్రజలకు ఉత్తమ సేవలందించి డిపార్ట్మెంట్కు మంచి పేరు తీసుకురావాలని మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ సూచించారు. హైదరాబాద్, నిజామాబాద్, ములుగు జిల్లాల నుంచి కానిస్టేబుల్స్గా ఎంపికైన వారు ఎర్రవల్లి పదో బెటాలియన్లో 9 నెలలు శిక్షణ పూర్తి చేశారు. కమాండెంట్ సాంబయ్య ఆధ్వర్యంలో పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.