Mahbubnagar

News July 12, 2024

పార్టీ తుడిచి పెట్టేయడం ఎవరి తరం కాదు: మాజీ మంత్రి

image

 పార్టీని తుడిచి పెట్టేయడం ఎవరి తరం కాదని..తెలంగాణను సాధించిన పార్టీ బీఆర్ఎస్ అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు మళ్లీ కష్టం వచ్చిందని అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ తుడిచి పెట్టేయడం ఎవరి తరం కాదన్నారు. కన్న తల్లి లాంటి పార్టీని ఎమ్మెల్యేలు వదిలి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

News July 12, 2024

ఈనెల 15న పీయూలో సెమినార్

image

పాలమూరు యూనివర్సిటీలో ఈనెల 15న ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహిస్తున్నామని విభాగపు అధిపతి అర్జున్ కుమార్ తెలిపారు. శుక్రవారం అందుకు సంబంధించిన గోడ పత్రికలను వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మన్నెమోని కృష్ణయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశ్రాంత ఆచార్యులు డాక్టర్ అచలపతి, గడ్డం నరేష్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి హాజరుకానున్నారని తెలిపారు.

News July 12, 2024

షాద్‌నగర్: ఘోర ప్రమాదం.. లారీ కిందపడి వ్యక్తి మృతి

image

షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరులోని Y జంక్షన్‌లో 3 లారీలు ఢీకొన్నాయి. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో లారీ బోల్తాపడటంతో లారీ కింద స్కూటీ ఇరుక్కుపోయింది. స్కూటీపై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడిని పెంజర్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. పోలీసుకు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News July 12, 2024

కొడంగల్: టీచర్లు రాక పాఠశాలకు తాళం

image

ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారులు చదువుకు దూరమవుతున్నారు. పాఠశాలకు హాజరుకాని విద్యార్థులను దారిలో పెట్టాల్సిన టీచర్లే విధులకు ఎగనామం పెట్టడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. శుక్రవారం కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని పాత కొడంగల్ ప్రాథమిక పాఠశాలకు తాళం ఉండడంతో టీచర్ కోసం విద్యార్థులే ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. టీచర్ల రాకపోవడంతో పిల్లలు తిరిగి ఇళ్లకు వెళ్లారు.

News July 12, 2024

వనపర్తిలో మొక్కలు నాటిన మంత్రులు

image

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంపై ఉమ్మడి పాలమూరు జిల్లా సాంస్కృతిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా కార్యాలయంలో మంత్రుల మొక్కలు నాటారు.

News July 12, 2024

WNP: మంత్రి మండలి సబ్ కమిటీ సమావేశం

image

రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంపై నియమించిన మంత్రి మండలి సబ్ కమిటీ సమావేశం శుక్రవారం డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్, రాష్ట్ర ఉన్నతాధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

News July 12, 2024

ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా కళాశాలకు అటానమస్..

image

ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు అటానమస్ హోదా దక్కిందని కళాశాల ప్రిన్సిపాల్ విజయ్ కుమార్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే మొట్టమొదట ఈ హోదా పొందిన ఘనతను సొంతం చేసుకుంది. దీంతో ప్రతి ఏటా రూ.12 లక్షల నిధులు(UGC), రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు, ప్రతి విభాగం బలోపేతం, నూతన కోర్సులు, క్షేత్ర పర్యటనలపై దృష్టి కేంద్రీకరించి ఉద్యోగావకాశాలు పెంచి మహిళా సాధికారతకు పెద్ద పీట వేయనున్నారు.

News July 12, 2024

ఉమ్మడి జిల్లాలో పదెకరాలలోపు ఉన్న రైతుల వివరాలు

image

పదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా పథకంలో ఏటా ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించాలనే అభిప్రాయాలు ఎక్కువగా వస్తుండడంతో నివేదికలు సిద్ధం చేస్తున్నారు. MBNR-2,19,500, NGKL-3,18,610, GDWL-1,72,457, NRPT-1,82,992, WNPT-1,82,073 మంది పదెకరాల్లోపు భూమి ఉన్న రైతులు ఉన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పది ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల పదిశాతం అంతకంటే తక్కువే ఉన్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.

News July 12, 2024

MBNR: గృహజ్యోతి పథకంలో లోపాలు సరి చేసేందుకు చర్యలు

image

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గృహజ్యోతి పథకంలో నెలకొన్న లోపాలను సరి చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. 200 యూనిట్ల లోపు వినియోగించిన కొంతమంది వినియోగదారులకు జీరో బిల్లు రాలేదు దీంతో వారికి అధికారులు మరో అవకాశం ఇచ్చారు. USC నెంబర్ మార్చుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు మేలు జరగనుంది.

News July 12, 2024

WNP: మానసిక వికలాంగురాలిపై అత్యాచారం

image

వరనపర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలు(14)పై గురువారం ఆత్యాచారం జరిగిందని సీఐ నాగభూషణం తెలిపారు. అదే గ్రామానికి చెందిన యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పాడ్డారని పేర్కొన్నారు. అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశామన్నారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు గ్రామస్థులు గుర్తించి దేహశుద్ధి చేశారు. బాధితురాలి మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.