Mahbubnagar

News January 2, 2025

MBNR: స్థానిక పోరు.. ఏర్పాట్లు షురూ

image

మహబూబ్ నగర్ జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికలకు వ్యాప్తంగా అధికారులు సిద్ధమవుతున్నారు. ఎన్నికల పర్యవేక్షణకు సంబంధించి 12 మంది అధికారులను నియమిస్తూ కలెక్టర్ విజయేందిర ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 441 గ్రామ పంచాయతీల్లో 3,836 వార్డులు ఉన్నాయి. నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా.. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. గ్రామీణ ఓటర్లు మొత్తం 5,27,302 మంది ఉన్నారు.

News January 2, 2025

NRPT: ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం

image

నారాయణపేటలో దారుణం జరిగింది. తన ఇంటిపై అద్దెకుంటున్న ఐదేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇంట్లో ఉన్న చిన్నారికి మాయమాటలు చెప్పి యజమాని ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక బిగ్గరగా కేకలు వేయండంతో కుటుంబ సభ్యులు గమనించి, చిన్నారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అఘాయిత్యానికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News January 2, 2025

MBNR: ఈ న్యూ ఇయర్ ‘కిక్కే వేరబ్బా’

image

న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం ఏరులై పారింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 28 నుంచి 31వరకు రూ.54.46 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 69,457 కాటన్ల బీర్లు, 52,630 కాటన్ల ఐఎంఎల్ లిక్కర్ విక్రయాలున్నాయి. దీంతో అబ్కారీశాఖకు భారీ ఆదాయం వచ్చింది. ఈ న్యూ ఇయర్ నేపథ్యంలో పోలీసులు చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో Dec 31న MBNRలో 93, WNPలో 55, GWLలో 31, NRPTలో 22, NGKLలో 6 కేసులు నమోదు చేశారు.

News January 2, 2025

ఉమ్మడి జిల్లాల్లో నేటి..TOP NEWS!!

image

✔సీఎంను కలిసిన జిల్లా ఎమ్మెల్యేలు,నేతలు✔న్యూ ఇయర్.. దైవ దర్శనం కోసం క్యూ✔గద్వాల: ‘సమగ్ర శిక్షా ‘సమగ్ర రెగ్యులరైజ్ చేయాలి’:BRS✔హమాలీల సమస్యలను చేయాలి’:BRS జల విద్యుత్ కేంద్రం జనరేటర్‌లో నీరు లీక్✔ఎస్ఎస్ఎ ఉద్యోగులను క్రమబద్దీకరించాలి: ఎంపీ డీకే అరుణ✔ఇటిక్యాల: వేప చెట్టు నుంచి కల్లు✔NRPT:రెండు బైకులు ఢీ.. నలుగురికి తీవ్రగాయాలు

News January 1, 2025

అమరచింత: జూరాల ప్రాజెక్టు నేటి సమాచారం

image

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నేటి నీటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రాజెక్టు మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు గాను ప్రస్తుతం 4.207 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్‌ఫ్లో 28 క్యూసెక్కులు రాగా.. ఎడమ కాలువకు 550, కుడి కాలువకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. 

News January 1, 2025

MBNR: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యేలు

image

సీఎం రేవంత్ రెడ్డిని ఉమ్మడి MBNR జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు బుధవారం HYD ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ప్రతినిధి వంశీచందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News January 1, 2025

MBNR: నగ్న చిత్రాలు తీసి అత్యాచారం

image

ఓ మహిళ నగ్న చిత్రాలు తీసి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన అమానవీయ ఘటన నవాబ్‌పేట మం.లో జరిగింది. SI విక్రమ్ వివరాలు.. ఓ మహిళ స్నానం చేస్తుండగా నర్సింహులు ఫొటోలు తీశాడు. సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజు రోజుకి వేధింపులు పెరగడంతో బాధితురాలు PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 1, 2025

పాలమూరు మెడికల్ కళాశాలకు వృద్ధురాలి మృతదేహం 

image

జడ్చర్ల పట్టణంలోని ఓ వృద్ధాశ్రమంలో మృతి చెందిన వృద్ధురాలు గొల్ల భీమమ్మ మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆశ్రమ నిర్వాహకులు చిత్తనూరి రామకృష్ణ మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాలకు వృద్ధురాలి మృతదేహాన్ని మంగళవారం అప్పగించారు. ఈ సందర్భంగా ఎంబీబీఎస్ మొదటి సంవత్సర చదువుతున్న విద్యార్థులు మృతదేహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఛైర్మన్ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.

News January 1, 2025

MBNR: యుజీసీ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేయాలి: కలెక్టర్

image

జనవరి 3న MBNRలో నిర్వహించే యుజీసీ నెట్ 2024 పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ విజయేంద్రబోయి ఆదేశించారు. పరీక్షలు నిర్వహించే సెంటర్‌ను మంగళవారం ఆమె పరిశీలించి మాట్లాడారు. పరీక్షలకు 185 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద శాంతి భద్రతల నిర్వహణ, నిరంతర విద్యుత్, ఫస్ట్ ఎయిడ్ కిట్ తదితర సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

News December 31, 2024

గద్వాల: ఉత్తమ సేవలతో ఉద్యోగులకు గుర్తింపు: అడిషనల్ కలెక్టర్

image

ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ తప్పనిసరి అని, వారికి తమ ఉత్తమ సేవలు గుర్తింపునిస్తాయని గద్వాల అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లో క్రీడల అధికారి ఆనంద్ పదవీ విరమణ సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లడుతూ.. జిల్లాలో క్రీడారంగం అభివృద్ధికి ఆనంద్ విశేష కృషి చేశారని కొనియాడారు. క్రీడా కార్యక్రమాల్లో ఆయన అందించిన సేవలు అభినందనీయమని ప్రశంసించారు.