Mahbubnagar

News November 29, 2024

రేవంత్‌ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా: హరీశ్ రావు

image

సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివాస్‌లో సీఎం రేవంత్ పై హరీశ్ రావు మండిపడ్డారు. ‘రేవంత్‌ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా, ఇచ్చిన తెలంగాణ ప్రకటనను కాంగ్రెస్‌ సర్కార్‌ వెనక్కి తీసుకున్నప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున మొదలైంది. అప్పుడు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్‌ చేస్తే రేవంత్ పారిపోయిండు. రేవంత్‌ మీద ఉద్యమ కేసులు లేవు కానీ.. ఓటుకు నోటు కేసు మాత్రం నమోదైంది’ అని హరీశ్ రావు అన్నారు.

News November 29, 2024

నాగర్ కర్నూల్: మధ్యాహ్న భోజనం తిని నలుగురు విద్యార్థుల అస్వస్థత

image

మరో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని గోరిట ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని శుక్రవారం నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. టమాటా రైస్, గుడ్డు తిన్న నలుగురు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు వైద్యులను పాఠశాలకు పిలిపించి అక్కడే చికిత్స అందించారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 29, 2024

బాలానగర్ సీతాఫలం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయండి: SKLTSHU

image

బాలానగర్ మండల సీతాఫలం భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ మండలంలో పుట్టిన సీతాఫలం ఇతర జిల్లాల్లో విస్తరించింది. ఈ చెట్టుకు అందమైన ఆకులు, గుండ్రని ఆకారంలో రుచికరమైన పండ్లు ఉంటాయి. ఈ సీతాఫలాలు ఇతర రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. బాలానగర్ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు వస్తే ఈ రకానికి చట్టబద్ధత రక్షణ కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

News November 29, 2024

వణికిస్తోన్న చలి.. కోస్గిలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చలి విపరీతంగా పెరిగింది. 5 రోజుల క్రితమే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీలు తగ్గినట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు చలి గాలులు వీస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అత్యల్పంగా కోస్గి, ఎల్లికల్‌లో 12.9 ఉష్ణోగ్రత నమోదయింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12.9నుంచి 18.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

News November 29, 2024

MBNR: ఆస్పత్రిలో బాలింత మృతి.. నర్సులపై వేటు

image

మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రిలో<<14731958>> బాలింత మృతి<<>> ఘటనలో ఇద్దరు నర్సులను వైద్యాధికారి సస్పెండ్ చేశారు. విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గండీడ్ మం. ఆసిరెడ్డిపల్లికి చెందిన రజిత కాన్పుకోసం బుధవారం ఆస్పత్రిలో చేరారు. రాత్రి బిడ్డకు జన్మనించిన ఆమె.. గురువారం ఉదయం చనిపోయారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. న్యాయం చేస్తామన్న హామీతో ఆందోళన విరమించారు.

News November 29, 2024

 MBNR: ఇంటర్ విద్య పరిశీలనకు విద్యా కమిషన్

image

రాష్ట్రంలో తెలంగాణ విద్యా కమిషన్ విస్తృతంగా పర్యటిస్తోంది. వచ్చే నెల 7 వరకు ఉమ్మడి MBNR జిల్లాల్లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇంటర్మీడియట్ డైరెక్టర్ కృష్ణ ఆదిత్య ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఉన్న ఇంటర్ అధికారులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్ సహకారం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News November 29, 2024

MBNR: ఉమ్మడి జిల్లా నిరుద్యోగులకు గుడ్ న్యూస్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నిరుద్యోగులకు ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ(SBRSETI) గుడ్ న్యూస్ తెలిపింది. హౌస్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. డిసెంబర్ 7 వరకు దరఖాస్తులు చేసుకోవాలని, 19 నుంచి 45 సంవత్సరాలు ఉన్నవారు అర్హులని, మిగతా వివరాల కోసం 95424 30607, 99633 69361 నంబర్లకు సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 29, 2024

MBNR: DEC నుంచి DEGREE, PG తరగతులు ప్రారంభం

image

మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ సెమిస్టర్-1,3,5, పీజీ ప్రథమ,ద్వితీయ సంవత్సరం తరగతులు వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ డాక్టర్ కె.పద్మావతి, రీజినల్ కో-ఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. హాజరయ్యే విద్యార్థులు ఐడి కార్డ్, ఫీజు చెల్లించిన రసీదులు తప్పక తీసుకురావాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 29, 2024

డాటా ఎంట్రీలో పొరపాట్లకు తావు ఇవ్వవద్దు: కలెక్టర్ సంతోష్

image

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటి సర్వే డాటా ఎంట్రీలో ఆపరేటర్లు ఎలాంటి పొరపాట్లకు తావు ఇవ్వవద్దని గద్వాల కలెక్టర్ సంతోష్ సూచించారు. గురువారం ఆయన ఛాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో సర్వే ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ పై సమీక్ష నిర్వహించారు. ఆన్‌లైన్ ఎంట్రీ సమయంలో ఎన్యుమరేటర్లు ఆపరేటర్లకు అందుబాటులో ఉండాలన్నారు. డాటా ఎంట్రీ కి అవసరమైన కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు సిద్ధం చేయాలన్నారు.

News November 29, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!!

image

✔మొదలైన రైతు పండుగ.. ప్రారంభించిన మంత్రులు
✔ఘనంగా బాపూలే వర్దంతి వేడుకలు
✔రేపు దీక్ష దివాస్.. తరలిరండి:BRS
✔NRPT:కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం
✔కొల్లాపూర్‌లో విజయ్ దేవరకొండ సందడి
✔MBNR:RTC RMగా సంతోష్ కుమార్
✔రేపు నాగర్ కర్నూల్‌కు కేటీఆర్ రాక
✔సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
✔మిడ్‌డే మీల్స్ ఏజెన్సీ సమస్యలు పరిష్కరించాలి:CITU
✔NRPT:నూతన DEOగా గోవిందరాజులు
✔రైతు సదస్సు..పాల్గొన్న MLAలు,రైతులు

error: Content is protected !!