Mahbubnagar

News July 11, 2024

MBNR: మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్-1 ఉచిత శిక్షణ

image

తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్, తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనారిటీ నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వము హైదరాబాదులో టీజీపీఎస్సీ గ్రూప్-1 ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి ఏందిరా ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఆసక్తి గలవారు ఈనెల 19లోపు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్ హైదరాబాద్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

News July 11, 2024

బొంరాస్‌పేట: అండగా ఉంటాను, అధైర్య పడకు: కేటీఆర్

image

బొంరాస్ పేట మండలం BRS పార్టీ సోషల్ మీడియా అధ్యక్షులు నెహ్రూ నాయక్ భార్య సుమిత్ర బాయి ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ద్వారా విషయం తెలుసుకున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం హైదరాబాదులోని తన నివాసానికి పిలిపించుకుని పరామర్శించారు. అధైర్య పడకండి, నేను మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మండల నాయకులు ఉన్నారు.

News July 11, 2024

దేవరకద్ర: బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎంపీకి వినతి పత్రం

image

మహబూబ్ నగర్ ఎంపీగా గెలుపొంది తొలిసారి దేవరకద్ర‌లో కృతజ్ఞత సభకు విచ్చేసిన డీకే అరుణకి కొండ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా స్వాగతం పలికి శాలువ కప్పి సన్మానం చేశారు. అనంతరం దేవరకద్ర‌లోని వ్యాపారస్తులు అందరు కలిసి రైల్వే అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఎంపీకి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో డోకూర్ పవన్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఎగ్గని నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

News July 11, 2024

MBNR: పాతాళానికి భూగర్భ జలాలు

image

ఉమ్మడి జిల్లాలో భూగర్భ జలమట్టం నానాటికీ తగ్గిపోతోంది. వర్షాకాలం ప్రారంభమైనా జిల్లాలో భూగర్భ నీటిమట్టం పెరగడం లేదు. గత నెల ఉమ్మడి జిల్లాలో సగటున 9.33 మీటర్ల లోతులోకి భూగర్భ జలాలు పడిపోయాయి. గతేడాది జూన్లో భూగర్భ జలాలు 7.09 మీటర్ల లోతులో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 2.24 మీటర్ల లోతులోకి ఇవి పడిపోయాయి. కృష్ణా పరివాహక ప్రాంతమైన GDWL, WNP, NGKL జిల్లాల్లో కూడా భూగర్భ జలాల పెరుగుదల కనిపించలేదు.

News July 11, 2024

పెరుగుతున్న పాలమూరు జిల్లా జనాభ

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏటా జనాభా పెరుగుతూనే ఉంది. 2011 సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం.. 35,26,605 ఉన్న జనాభా 2024 సంవత్సరం వచ్చేసరికి.. 41,62,093కు చేరింది.. ఈ 12 సంవత్సరాలలో.. 6,35,488 జనాభా పెరిగింది. నెలకు సగటున 50 వేల జనాభా పెరుగుతూనే ఉంది. కుటుంబ నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని, ఆపరేషన్లకు ముందుకొచ్చిన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తున్నామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ తెలిపారు.

News July 11, 2024

ఉమ్మడి జిల్లాలో నమోదైన వర్షపాత వివరాలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో 25.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నారాయణపేట జిల్లా మరికల్లో 22.0 మి.మీ, నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో 1.3 మి.మీ, వనపర్తి జిల్లా సోలిపూర్లో 1.0 మి.మీ, గద్వాల జిల్లాలో ‘0’ మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 11, 2024

MBNR: ‘ఆధారాలు ఉంటే క్రమశిక్షణ చర్యలు తప్పవు’

image

ఉమ్మడి జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల్లో స్పౌజ్ విభాగంలో ప్రత్యేక పాయింట్లు పొందిన వారి వివరాలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా చాలా మంది స్పౌజ్ పాయింట్లు ఉపయోగించుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంఈవోలు స్పౌజ్ బదిలీలను పరిశీలించి నివేదికలు అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆధారాలు ఉంటే క్రమ శిక్షణ చర్యలు తీసుకోనున్నారు.

News July 11, 2024

ఉమ్మడి జిల్లాలో గృహలక్ష్మి సంఖ్య@3,85,343

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 8,54,491 మంది గృహ విద్యుత్తు వినియోగదారులు ఉండగా.. వీరిలో 5,12,694 మంది గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 1,27,351 మందికి ‘0’బిల్లులు రావాల్సి ఉందని విద్యుత్ అధికారులు తెలిపారు. జూన్ మాసంలో 3,65,311 మంది గృహ విద్యుత్తు వినియోగదారులు ‘0’ బిల్లులు అందుకోగా, జులైలో ఈ సంఖ్య 3,85,343లకు చేరింది. ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య మరో 20 వేలకు పెరిగింది.

News July 11, 2024

మహబూబ్‌నగర్: రేపు ఉద్యోగ మేళా!

image

మహబూబ్ నగర్ పట్టణంలోని జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఈనెల 12న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి జానీపాషా తెలిపారు. SSC పాస్ లేదా ఫెయిల్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ డిప్లొమా, బీటెక్ చదివి 18 నుంచి 40 ఏళ్లలోపు వయస్సు గల అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి ఉన్నవారు విద్యార్హత ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, బయోడేటాతో శుక్రవారం ఉదయం 10.30 గంటలకు హాజరు కావాలన్నారు.

News July 11, 2024

ఉమ్మడి జిల్లాలో గృహలక్ష్మి సంఖ్య@3,85,343

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 8,54,491 మంది గృహ విద్యుత్తు వినియోగదారులు ఉండగా.. వీరిలో 5,12,694 మంది గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా 1,27,351 మందికి ‘0’బిల్లులు రావాల్సి ఉందని విద్యుత్ అధికారులు తెలిపారు. జూన్ మాసంలో 3,65,311 మంది గృహ విద్యుత్తు వినియోగదారులు ‘0’ బిల్లులు అందుకోగా, జులైలో ఈ సంఖ్య 3,85,343లకు చేరింది. ఉమ్మడి జిల్లాలో లబ్ధిదారుల సంఖ్య మరో 20 వేలకు పెరిగింది.