India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన NGKL జిల్లా బిజినేపల్లి మండలం వెలుగొండ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బీరయ్య, రాజు అన్నదమ్ములు. రాత్రి బీరయ్య నడుచుకుంటూ వెళ్తుండగా రాజు పెంపుడు కుక్క అరిచింది. భయంతో బీరయ్య రాయితో కొట్టాడు. కుక్కని కొట్టాడని అన్నదమ్ములు గొడవపడ్డారు. ఈక్రమంలో మనస్తాపంతో ఉరేసుకుని రాజు ఆత్మహత్యకు చేసుకున్నాడు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే విజయుడు పాల్గొని అలంపూర్ అభివృద్ధి గురించి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం దీనికి బుధవారం సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలంపూర్ నియోజకవర్గంలో మహిళా రెసిడెన్షియల్ స్కూల్ భవనాలు నిర్మించాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద మంగళవారం తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం 2,051 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. మంగళవారం సాయంత్రానికి 583 క్యూసెక్కులకు తగ్గిందన్నారు. ప్రాజెక్టు నుంచి 132 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నామని చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 7.740 టీఎంసీలు ఉన్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయంలో పీజీ మొదటి, రెండోవ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల యొక్క వార్షిక పరీక్షల షెడ్యూలు విడుదల చేశామని ఉమ్మడి జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ జి.సత్యనారాయణ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు వచ్చే నెల ఆగస్టు 20 నుంచి ప్రారంభం కానున్నాయని మిగతా వివరాలకు వారిని సంప్రదించగలరని పేర్కొన్నారు.
నిర్మాణంలో ఉన్న బిల్డింగ్పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన అమరచింతలోని జగన్ వాడలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన ఉప్పరి కర్రెన్న (55) నిర్మాణంలో ఉన్న భవనంలో తాపీ మేస్త్రీ వద్ద దినసరి కూలీగా పనిచేసే వాడని, బిల్డింగ్ పై ఏర్పాటు చేసిన విందులో పాల్గొనే క్రమంలో ప్రమాదవశాత్తు బిల్డింగ్పై నుంచి కిందపడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటర్ విద్యలో ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమైంది. జూనియర్ అధ్యాపకులు, ప్రిన్సిపల్, బోధనేతర సిబ్బంది బదిలీ కానున్నారు. బదిలీలకు సంబంధించిన మార్గ దర్శకాలు ఒకటి, రెండు రోజుల్లో కమిషనర్ కార్యాలయం నుండి విడుదల కానున్నాయని జిల్లా ఇంటర్ కార్యాలయం వర్గాలు తెలిపాయి. ఇంటర్ విద్యలో బదిలీలకు “జీరో సర్వీసు”ను పరిగణలోకి తీసుకోబోమని అధికారులు పేర్కొన్నారు.
కల్వకుర్తి పట్టణానికి చెందిన రైతు వసంత యాదయ్య(48) మంగళవారం పాముకాటుతో మృతి చెందారు. స్థానికుల వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన యాదయ్య రోజు మాదిరిగానే ఉదయం తన పొలానికి వెళ్లాడు. పొలం వద్ద బోరు మోటారు ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు పాము కాటేసింది. స్థానికులు గమనించి అతణ్ని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందారు. యాదయ్యకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు.
ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు MBNR, NGKL డీఈవోలు రవీందర్, గోవిందరాజులు తెలిపారు. 5 నుంచి 18 ఏళ్ల లోపు పిల్లలు అర్హులని, https://awards.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఉమ్మడి MBNR జిల్లాలోని పిల్లలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా HMలు, ఉపాధ్యాయులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, న్యూఢిల్లీలో ఈ పురస్కారాలను అందిస్తారని అన్నారు.
ప్రేమ పేరుతో ఓ యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు చేశామని ఎస్సై బి.సురేశ్ తెలిపారు. వనపర్తి జిల్లా పెద్ద మందడికి చెందిన సంతోష్ గత మూడేళ్ల నుంచి ఓ యువతిని ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. వివాహంపై ఆ యువతి ప్రశ్నించగా తప్పించుకు తిరుగుతున్నాడు. పెద్దలతో మాట్లాడినా మార్పు రాకపోవడంతో మోసం చేసిన సంతోష్తో పాటు అతని తల్లి జానకిపై మంగళవారం కేసు నమోదు అయినట్లు ఎస్సై తెలిపారు.
ప్రాజెక్ట్ కింద భూసేకరణ చెల్లింపులను తక్షణమే చేయాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సీఎం నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. జూరాల నుంచి పాలమూరు-రంగారెడ్డికి నీరు తీసుకుంటేనే PRSI పథకం పూర్తవుతుంది. NRPTలో టెక్స్టైల్ పార్కు, గద్వాలలో హ్యాండ్లూమ్ పార్కు, ఉమ్మడి MBNR జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు.
Sorry, no posts matched your criteria.