Mahbubnagar

News July 10, 2024

MBNR: మన జిల్లా బిడ్డ సీఎం అయ్యారు: మంత్రి జూపల్లి

image

MBNR జిల్లా నుంచి 70 ఏళ్ల తర్వాత మన జిల్లా బిడ్డ రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని, ఈ జిల్లాను అభివృద్ధిలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారనే నమ్మకం ఉంది అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో మొదటి సారిగా జిల్లా నుంచే సమీక్షా సమావేశాలు ప్రారంభించడం జరిగిందన్నారు. గత పాలకులు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పట్టించుకోలేదన్నారు. జిల్లాలోని ప్రాజెక్టులన్నీ అసంపూర్తిగా ఉన్నాయని అన్నారు.

News July 10, 2024

MBNR: ప్లాస్టిక్ బాటిల్ వాడినందుకు ఫైన్

image

అమ్రాబాద్ టైగర్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌ ఫారెస్ట్‌‌‌‌ను ప్లాస్టిక్ ఫ్రీగా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్లాస్టిక్‌‌‌‌ వస్తువులు అమ్మొద్దంటూ ప్రధాన రోడ్లపై ఉన్న షాప్‌లకు నోటీసులు జారీ చేశారు. ప్లాస్టిక్‌‌‌‌ కవర్లు, కూల్‌‌‌‌ డ్రిక్స్‌‌‌‌ బాటిళ్లను నిషేధించారు. తాజాగా MHకు చెందిన దినేశ్‌‌‌‌ మంగళ్‌‌‌‌‌ వద్ద ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌‌‌‌ గమనించిన ఫారెస్ట్‌‌‌‌ ఆఫీసర్లు అతడికి రూ.2వేల ఫైన్‌‌‌‌ వేశారు.

News July 10, 2024

కాంగ్రెస్, BRSపై డీకే అరుణ ఘాటు వ్యాఖ్యలు

image

దొంగలు దొంగలు ఒకటై నడిగడ్డ ప్రాంతాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని MP డీకే అరుణ BRS, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి పరీక్ష విమర్శలు చేశారు. గద్వాల విజయోత్సవ ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాకుండా అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తనను ఓడించాలని శపథాలు చేసి ఊరూరు తిరిగి ప్రచారం చేసినా ప్రజలకు తానేంటో తెలుసునని, అందుకే తనను గెలిపించాలని డీకే అరుణ అన్నారు.

News July 10, 2024

బడి పిల్లల బాధ్యత మహిళా సంఘాలదే: రేవంత్

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో బడికి వెళ్లని పిల్లలను బడికి తీసుకొచ్చే బాధ్యతను మహిళా సంఘాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేడు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విద్యాశాఖపై నిర్వహించిన రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల పరిశుభ్రత బాధ్యతను అమ్మ ఆదర్శ కమిటీలకు అప్పగించాలన్నారు. పైలట్ ప్రాజెక్టు ఇక్కడి నుంచే ఈ కార్యక్రమాలు ప్రారంభించాలని అన్నారు.

News July 10, 2024

పదేళ్ల పాలనలో గద్వాలకు చేసిందేమీ లేదు: డీకే అరుణ

image

పదేళ్ల BRS పాలనలో గద్వాల ఎలాంటి అభివృద్ధి జరగ లేదని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఫైర్ అయ్యారు. బుధవారం పట్టణంలోని ఎస్వీ ఈవెంట్ హాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఇండ్లు, ఇండ్ల పట్టాలు, రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో మిగిలిన పనులు చేయలేదన్నారు. ఇక్కడి నేతలు అధికారం కొరకు పాకులాడుతున్నారని, ఎమ్మెల్యే బండ్ల ఏం చేసేందుకు కాంగ్రెస్‌లో చేరారని ప్రశ్నించారు.

News July 9, 2024

పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైంది: రేవంత్

image

 తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో మాట్లాడారు.‘‘MLAలు,MLCలు పార్టీ మారుతున్నారని కేసీఆర్‌ మాట్లాడుతున్నారు. తన వరకు వస్తే కాని KCRకు ఆ బాధ తెలియలేదు. గత పదేళ్లలో ఎంతో మంది కాంగ్రెస్‌ MLAలను తన పార్టీలో చేర్చుకోలేదా? ఈ ప్రభుత్వం నెల రోజులలోనే కూలిపోతుందని కేసీఆర్‌ అనలేదా? అని మండిపడ్డారు.

News July 9, 2024

మహబూబ్‌నగర్: TODAY TOP NEWS

image

✒MBNRలో సమీక్షలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉమ్మడి జిల్లా MLAలు
✒త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం రేవంత్
✒మక్తల్: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు
✒గ్రామీణ విద్యార్థులకు డిజిటల్ విద్యా: సినీనటి మంచు లక్ష్మి
✒పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసిన సీఎం
✒ఫీజుల దోపిడీని అరికట్టాలి:PDSU
✒ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ వేడుకలు
✒పలుచోట్ల వర్షాలు
✒రోడ్డు ప్రమాదాలపై అవగాహన

News July 9, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి వర్షపాత వివరాలు..

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నమోదైన వర్షపాత వివరాలు ఇలా.. వనపర్తి జిల్లా దగడలో 58.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా జటప్రోలు 48.0 మి.మీ, గద్వాల జిల్లా రాజోలిలో 46.0 మి.మీ, జడ్చర్లలో 43.0 మి.మీ, నారాయణపేట జిల్లా గుండుమల్ లో 20.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News July 9, 2024

షాద్‌నగర్: అంతర్జాతీయ దొంగల అరెస్ట్

image

షాద్‌నగర్ పట్టణంలోని పలు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డ అంతర్జాతీయ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 30న అయ్యప్ప కాలనీలో నివాసముండే గాదం రమేష్ ఇంట్లో పాచి పనికి నేపాల్‌కు చెందిన ప్రసన్న బాదువాల్ వచ్చింది. ఆమె భర్త ప్రశాంత్ బదువాల్‌తో కలిసి రమేశ్ ఇంట్లో 9 తులాల బంగారు ఆభరణాలు, రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను పట్టుకున్నారు.

News July 9, 2024

ప్రతి నెల ప్రాజెక్ట్ పనులను సమీక్షిస్తాం: రేవంత్ రెడ్డి

image

MBNR జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సాగునీరు, విద్య, వైద్యం, పలు అంశాలపై చర్చించారు. ప్రతి నెల ప్రాజెక్ట్ పనులను సమీక్షిస్తామని స్పష్టం చేశారు. ఇక ప్రాజెక్ట్ పనులు ఆలస్యం కాకూడదని అన్నారు.