India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(TCC) పరీక్ష ఫీజు తేదీలు ఖరారు అయ్యాయని ఆయా జిల్లాల డీఈవోలు తెలిపారు. డ్రాయింగ్ కోర్సు-లోయర్ రూ.100, హయ్యర్ రూ.150, ఎంబ్రాయిడరింగ్, టైలరింగ్ కోర్సు-లోయర్ రూ.150, హయ్యర్ రూ.200ను ఆన్లైన్లో చెల్లించాలన్నారు. డిసెంబర్ 3 లోగా చెల్లించాలని, 10వ తరగతి చదివిన వారు అర్హులన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NRPT జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గత 5 రోజులుగా జిల్లా వ్యాప్తంగా విపరీతమైన చలి పెరగగా వాహనదారులు, వాకర్లు చలికి ఇబ్బంది పడుతున్నారు. నారాయణపేట జిల్లాలోని దామర్ గిద్ద మండలంలోని మొగల్ మడ్క గ్రామాల్లో ఆదివారం 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రతల నుంచి 17.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయాల్లో సైన్స్ & కంప్యూటర్ చదువుతున్న డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు MVS డిగ్రీ కళాశాలలో ఈనెల 27 నుంచి ప్రయోగ పరీక్షలు (సెమిస్టర్-2) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మావతి, రీజినల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్, ఫీజు చెల్లించిన రసీదు, గుర్తింపు కార్డు తప్పనిసరి అన్నారు.
మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 30న వస్తున్నట్లుదేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ ఛైర్మన్లతో మధ్యాహ్నం 12:00 గంటలకు సమీక్ష సమావేశం ఉంటుందన్నారు.
NGKL జిల్లా తెలకపల్లి మండలంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. పోలీసుల వివరాలు.. వట్టిపల్లికి చెందిన ఈశ్వరయ్యను భూమి అమ్మకం విషయమై తన భార్య ఎల్లమ్మ, బావమరిది బాలస్వామి, పెద్దకూతురు స్వాతి, పెద్దఅల్లుడు మల్లేశ్, మరదలు ఆశమ్మలు హత్య చేశారు. గొడ్డలితో దాడిచేసి, మర్మాంగాన్ని కత్తిరించి హతమార్చారు. మృతుడి చెల్లెలు నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు CI కనకయ్య గౌడ్ తెలిపారు.
ఈనెల 27, 28, 29న కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆర్ఐడీ పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 27న ప్రారంభమయ్యే స్వర్ణోత్సవాలను సినిమా హీరో విజయ్ దేవరకొండ ప్రారంభించనున్నారు. అలాగే చివరి రోజు 29న కొల్లాపూర్ పట్టణంలోని రామాపురం రహదారిలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు ఆర్టిస్టులతో కొల్లాపూర్ బిజీబిజీగా కళకళలాడనుంది.
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా తెల్లవారు జాము నుంచే దట్టమైన పొగ మంచుతో చలి గాలుల తీవ్రత పెరుగుతున్నది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు భారీగా కురవడంతో చెరువులన్నీ నీటితో నిండాయి. ఫలితంగా చెరువుల మీదుగా చలి గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. చలిగాలుల తీవ్రత పెరుగుతున్నందున వృద్ధులు, చిన్నపిల్లలు అప్రమత్తంగా ఉండాలని, స్వెటర్లు, చేతులకు గ్లౌజులు ధరిస్తే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
MBNR జిల్లా కలెక్టరేట్లో బీసీ కమిషన్ ఇవాళ నిర్వహించిన బహిరంగ విచారణలో బీసీ సంఘాలు, మైనార్టీ వర్గాల నుంచి స్వీకరించిన వినతులను ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ గోపిశెట్టి నిరంజన్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బీసీ సంఘాలు, వివిధ కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థల నుంచి 135 వినతులు ఆఫిడవిట్ రిజిస్టర్ చేసుకున్నారని ఆయన తెలిపారు.
వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన గద్వాల జిల్లా ఉండవెల్లిలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన స్వాతికి రెండేళ్ల కిందట వివాహం అయ్యింది. తరచూ కడుపు నొప్పితో బాధపడుతూ ఎన్నో ఆసుపత్రులకు వెళ్లి చూయించుకుంది. కడుపునొప్పి తగ్గకపోవడంతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై మహేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
నారాయణపేట జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో మిడ్డే మీల్స్ నిబంధనల ప్రకారం మెనూ ఎక్కడా అమలు కావడం లేదు. మెనూ అన్నం, మిక్స్ వెజిటేబుల్ కర్రీ, సాంబార్, గుడ్డు పెట్టాలి. కానీ ఎక్కడా అది అమలు కానీ పరిస్థితి నెలకొంది. వారంలో నాలుగు సార్లు మిడ్డే మీల్స్లో గుడ్డు ఇవ్వాలి. కానీ ఇది ఎక్కడా అమలు కావడం లేదు. గుడ్ల ధర పెరిగిన కారణంగా గిట్టుబాటు కావడం లేదని వంట ఏజెన్సీ వారు చెబుతున్నారు.
Sorry, no posts matched your criteria.