Mahbubnagar

News July 9, 2024

మక్తల్: రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలు.. మక్తల్ మండలం ముష్టిపల్లికి చెందిన చందు(26)కు సరిహద్దు కర్ణాటకలోని కడేచూరుకి చెందిన విజ్జుతో ఇటీవలే పెళ్లైంది. ఈ క్రమంలో భార్యతో కలిసి సోమవారం బైక్‌పై అత్తారింటికి వెళ్తుండగా సైదాపూర్ జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో చందు అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు గాయాలయ్యాయి. ఘటనపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు.

News July 9, 2024

PUలో అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం రేవంత్

image

మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించగా ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10 కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.3.25 కోట్లతో కేజీబీవీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన స్థానిక ఎమ్మెల్యేలు నాయకులు పాల్గొన్నారు.

News July 9, 2024

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌పై సీఎం కీలక ఆదేశాలు

image

కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీచేశారు. MBNR కలెక్టరేట్లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం సమీక్షించారు. డిసెంబర్ 2025లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాల్సిందేనన్నారు. ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

News July 9, 2024

వన మహోత్సవంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వన మహోత్సవం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన మహోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలా జరుగుతోందని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలన్నారు.

News July 9, 2024

మహిళా సంఘాలను బలోపేతం చేస్తాం: రేవంత్ రెడ్డి

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఇందిర మహిళా శక్తి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళా సంఘాలను అన్ని విధాల బలోపేతం చేస్తామని వెల్లడించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 3620 మహిళా సంఘాలకు రూ.334.2 కోట్ల నిధులను విడుదల చేశారు.

News July 9, 2024

ప్రియదర్శిని జూరాల UPDATES

image

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి ఇన్ ఫ్లో స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. అక్కడక్కడ కురుస్తున్న వర్షాల వల్ల ఇన్ ఫ్లో మరింత పెరిగి సోమవారం ప్రాజెక్టుకు 2,051 క్యూసెక్కుల ఇన్ ఫ్లో చేరినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆవిరి రూపంలో 132 క్యూసెక్కులతో కలిపి మొత్తం 132 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 7.701 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

News July 9, 2024

MBNR: పదవీ కాలం ముగిసినా.. అందని వేతనాలు!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల పదవీ కాలం ముగిసినప్పటికీ వారికి గౌరవ వేతనం అందలేదు. ZPTC, MPP, MPTC 8నెలల వేతనం చెల్లించాల్సి ఉంది. 2023 అక్టోబరు వరకు వేతనాలు అందాయి. ఆ తర్వాత వీరికి వేతనం అందలేదు. ఈనెల 3న MPPలు, MPTCల పదవీ కాలం ముగియగా, 4న జడ్పీ ఛైర్‌పర్సన్, ZPTCల పదవీ కాలం ముగిసింది. ZP ఛైర్‌పర్సన్‌కు నెలకు రూ. లక్ష, ZPTCలకు రూ.13 వేలు, MPTCలకు రూ.6,500 వేతనం ఉంది.

News July 9, 2024

పాలమూరు ప్రాజెక్టులకు మహర్దశ

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులకు మహర్దశ మొదలైంది. కోయిల్ సాగర్, కల్వకుర్తి, కొడంగల్-నారాయణపేట ఎత్తిపోతల, గట్టు, తుమ్మిళ్ల, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నిధులు కేటాయించేందుకు సర్కారు ప్రణాళికలు రూపొందించింది. ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేయడం ద్వారా కొత్త ఆయకట్టు పెంచేందుకు నీటిపారుదల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది.

News July 9, 2024

NGKL: హర్షసాయి పేరుతో ఘరానా మోసం

image

హర్షసాయి పేరు చెప్పి మోసానికి పాల్పడిన ఘటనపై ఉప్పనుంతలలో కేసు నమోదైంది. SIలెనిన్ వివరాలు.. NLG జిల్లాకు చెందిన హనుమంత్ NGKL జిల్లా దేవదారికుంటతండాలో ఇటుకబట్టి ప్యాపారం చేస్తున్నాడు. మే14న హర్షసాయి పేరు చెప్పి ఫోన్‌ చేసి ఆర్థికసాయం చేస్తానని నమ్మించాడు. అందుకు కొంత డబ్బు ఫోన్‌పే చేయాలనగా నమ్మిన బాధితుడు రూ.54,500 పంపించాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్ క్రైంకు ఫిర్యాదు చేశాడు.

News July 9, 2024

జిల్లాకు సీఎం.. 937 మంది పోలీసులతో బందోబస్తు

image

CM రేవంత్‌రెడ్డి నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. SP డి.జానకి నేతృత్వంలో కట్టుదిట్టమైన భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 937 మందితో పకడ్బందీగా భద్రతను చేపడుతున్నారు. SP, ఇద్దరు అదనపు SPలు, 8 మంది DSPలు, 35 మంది CIలు, 64 మంది SIలు, 98 మంది ASIలు, హెడ్ కానిస్టేబుళ్లు, 410 మంది హోంగార్డులు బందోబస్తులో పాల్గొననున్నారు.