India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాలమూరు జిల్లాలో సంతానం లేక బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జిల్లాలో ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటుచేస్తామని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ శాసనమండలిలో ప్రకటించారు. కాగా ఇప్పటివరకు హైదరాబాద్లోని గాంధీ, పేట్ల బురుజు ఆసుపత్రుల్లో మాత్రమే ఈ సేవలు అందుతుండగా ఇకపై పాలమూరులోనూ అందనున్నాయి. డబ్బు ఖర్చు చేసే స్తోమత లేని వారికి ప్రభుత్వ నిర్ణయం ఉపయోగకరం కానుంది.
మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా నూతనంగా ఏర్పడిన మండలాలతో కలిపి 16 మండలాలు ఉన్నాయి. వీటిలో 441 గ్రామ పంచాయతీలు, 3,836 వార్డులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తూ.. ఓటు వేసేందుకు ఇబ్బందులు లేకుండా గ్రామానికి దగ్గరగా ఉండే భవనాలను ఎంపిక చేశారు.గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా
సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ గ్రామీ వికాస్ బ్యాంక్ (APGVB) తెలంగాణ గ్రామీణ బ్యాంకు(TGB)లో విలీనం కానుంది. 2025 JAN1 నుంచి ప్రారంభం కానుంది. MBNR-24,NGKL-26,WNPT-11,GDWL-11,NRPT-13 బ్రాంచ్లు ఉన్నాయి. ఈనెల 28 నుంచి 31 వరకు బ్యాంకింగ్ సేవల (UPI, ATM, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, AEPS, CSP) తాత్కాలికంగా అంతరాయం ఏర్పడుతుందని, ఏవైనా సమస్యలు ఉంటే సమీపంలో ఉన్న బ్రాంచ్ను సంప్రదించాలన్నారు.
బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ప్రతిపక్షంలోకి వచ్చి ఒక్క ఏడాది అయిందనే విషయాన్ని కేటీఆర్, హరీష్ రావులు మర్చిపోయారు. ఇంకా తామే అధికారంలో ఉన్న ఊహల్లో మాట్లాడుతున్నారని ఎంపీ మల్లు రవి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. గతంలో వారు లక్ష రుణమాఫీ అని నాలుగు, ఐదు కంతుల్లో వేస్తే అవి వడ్డీలకే సరిపోయాయని విమర్శించారు.
NGKL జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు <<14947368>>స్పాట్డెడ్<<>> అయ్యారు. స్థానికుల సమాచారం.. గండీడ్ మండల వాసి ఈశ్వర్, సంగారెడ్డికి చెందిన అరవింద్(20) బైక్పై శ్రీశైలం వెళ్తున్నారు. మన్ననూరు లింగమయ్య ఆలయం వద్ద అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టారు. అరవింద్ స్పాట్లోనే చనిపోయాడు. ఈశ్వర్ తీవ్రంగా గాయపడగా అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదైంది.
బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. వెనుకబడిన t
కొడంగల్ను అభివృద్ధి చేస్తుంటే కుట్రలు చేసి అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లగచర్లలో దాడులు చేయించారన్నారు. స్థానికులను రెచ్చగొట్టి అధికారులపై ఉసిగొల్పారని మండిపడ్డారు. అధికారులు ఏం పాపం చేశారని వారిపై దాడులు చేశారని బీఆర్ఎస్ నాయకులను ఆయన ప్రశ్నించారు.
మహబూబ్నగర్ జిల్లా నవాబుపేట మండలంలో పోమాల్లో శనివారం విషాదం చోటుచేసుకుంది. పోమాల్ గ్రామానికి ఓ తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మహబూబ్నగర్ పట్టణం ఇక అప్గ్రేడ్ కానుంది. పట్టణాన్ని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేస్తన్నట్లు మంత్రి శ్రీధర్బాబు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రస్తుతం పట్టణంలో 49 వార్డుల్లో 2.88 లక్షల జనాభా ఉంది. కొత్తగా కార్పొరేషన్ ఏర్పడేందుకు 3 లక్షల జనాభా అవసరం కానుండటంతో శివారులోని జైనల్లీపూర్, దివిటిపల్లి గ్రామాలు విలీనం కానున్నాయి. ఇదిలా ఉండగా మద్దూరు, దేవరకద్ర పంచాయతీలు మున్సిపాలిటీలుగా మారనున్నాయి.
పోలీస్ అధికారులు వ్యవస్థీకృత నేరాలపై దృష్టి పెట్టాలని, నమోదైన ప్రతి కేసులో లోతైన విచారణ పారదర్శకంగా చేపట్టాలని MBNR జిల్లా ఎస్పీ జానకి అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ నిర్వహించిన నెలవారి నేర సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. సాక్షులను బ్రీఫ్ చేస్తూ మహిళలపై జరుగుతున్న నేరాలు, ఫోక్సో కేసులలో నిందితులకు పడే శిక్షల శాతాన్ని పెంచేందుకు పోలీస్ అధికారులు కృషి చేయాలని ఆమె ఆదేశించారు.
గట్టు మండల పోలీస్ స్టేషన్ను గద్వాల జిల్లా ఎస్పీ టి.శ్రీనివాసరావు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్లో రికార్డులు, కేసులు, పెండింగ్ కేసులు, సీడీ ఫైళ్లు తదితరాలను సమీక్షించారు. గ్రామ ప్రజల ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, స్టేషన్లో ఉన్న కార్యకలాపాలపై పోలీస్ సిబ్బందితో చర్చించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారికి మెరుగైన సేవలు అందించాలని పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు.
Sorry, no posts matched your criteria.