India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎయిడ్స్ బాధితులకు వైద్యం కోసం రాష్ట్రంలో కొత్తగా 16 జిల్లాల్లో 18చోట్ల యాంటీ రిట్రోవైరల్ థెరపీ(ఆర్ట్) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ బాధ్యతలను తెలంగాణ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ(టీశాక్స్)కి అప్పగించారు. మెదక్ జిల్లాలో ఏఆర్టీ సెంటర్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే ఎయిడ్స్ బాధితులకు అందుబాటులోకి రానున్నాయి.
ప్రేమ విషయం ఇంట్లో తెలియడంతో యువతి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాలు.. ములుగు మండలం కొక్కొండకు చెందిన మహేశ్వరి(22) నూజివీడు కంపెనీలో పనిచేస్తూ విజయ్ను లవ్ చేసింది. సోమవారం రాత్రి మహేశ్వరి అక్కతో విజయ్ చాట్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను ఆమెకు పంపాడు. దీంతో తమ ప్రేమ వ్యవహారం పేరెంట్స్కు తెలిసిందని మనస్తాపంతో యువతి ఉరేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
పాస్ పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు అవుతుంది ఇక సేవలు పొందడం సులువని భావించిన సంగారెడ్డి జిల్లా వాసులకు నిరీక్షణ తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలో 2వ పెద్ద పట్టణంగా పేరొందిన జహీరాబాద్లో పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు 2018లో విదేశీ వ్యవహారాల శాఖ ఉత్తర్వులిచ్చింది. ఆరేళ్లు ధాటినా సేవా కేంద్రం ఏర్పాటు ఉత్తర్వులకే పరిమితమైంది. MP షెట్కార్ దృష్టిసారిస్తే ఎదురు చూపులు ఫలించే అవకాశముంది.
ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. రేగోడ్ ఎమ్మార్వో, కస్తూర్బా పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను నిన్న తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న సేవలు, ఉద్యోగుల పనితీరుపై ఆరా తీశారు. వచ్చే నెలలో అంగన్వాడీలో పూర్వ ప్రాథమిక విద్య కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. PM విశ్వకర్మ పథకాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలియజేశారు.
టైలరింగ్, బ్యూటీ పార్లర్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయంఉపాధి శిక్షణకేంద్రం డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన 18 నుంచి 45 ఏళ్ళలోపు గల గ్రామీణ ప్రాంతాల మహిళలు అర్హులన్నారు. ఆసక్తిగలవారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సంగారెడ్డిలో తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
BRS అధినేత కేసీర్ను ఎర్రవెల్లిలోని వారి నివాసంలో మంగళవారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, కేపీ వివేకానంద, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ముఠా గోపాల్, ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, దండేవిఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేష్, రావుల శ్రీధర్ రెడ్డి కేసీఆర్ను కలిసిన వారిలో ఉన్నారు.
సిద్దిపేట పట్టణం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న రవీందర్ను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. ఇసుక లారీలు, ట్రాక్టర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లు రవీందర్పై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో చేపట్టిన విచారణలో ఆరోపణలు నిజమని నిర్ధారణ కావడంతో సస్పెండ్ చేసినట్టు సీపీ పేర్కొన్నారు.
అర్బాజ్(7) అనే బాలుడు సోమవారం సాయంత్రం సంగారెడ్డి పోలీసులకు దొరికాడు. శంకర్పల్లి ఆర్టీసీ బస్సులో వచ్చిన బాలుడు స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో దిగాడు. ఈ బాలుడిని గుర్తించిన పట్టణ పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లి కుటుంబ సభ్యుల గురించి ఆరా తీశారు. అనంతరం పట్టణంలోని బాలుర హోమ్కు తరలించారు. ఇతడి వివరాలు తెలిస్తే పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సీఐ భాస్కర్ తెలిపారు.
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా నియామకమైన E.వెంకట నరసింహారెడ్డి 1989 DSC ద్వారా జిల్లా ఫస్ట్ ర్యాంకుతో SA మ్యాథ్య్గా ఉమ్మడి జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్, జగదేవపూర్ మండలం మునిగడపలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా విధులు నిర్వహించారు. అనంతరం GROUP-1 అధికారిగా 1995లో నియామకమై 2017లో IASగా పదోన్నతి పొందారు. ప్రస్తుత ప్రభుత్వంలో పాఠశాల డైరెక్టర్గా నియమితులయ్యారు.
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు బెదిరించి రూ. 13.50 లక్షలు కాజేశారు. సైబర్ నేరగాళ్లు ముంబాయి ఇంటెలిజెన్స్, నార్కోటెక్ యాంటీ డ్రగ్ స్క్వాడ్ అధికారులమని బాధితుడి ఫోన్ చేశారు. మీరు డ్రగ్స్ ఐర్లాండ్కు చేసిన కొరియర్ పట్టుబడిందని, విచారణకు వస్తున్నామని బెదిరించారు. భయపడిన అతను వారు అడిగిన సమాచారం ఇవ్వడంతో ఖాతా నుంచి డబ్బును కాజేశారు
Sorry, no posts matched your criteria.