India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించేదుకు ముందుకు వెళ్తుంది. మెదక్ జిల్లా వ్యాప్తంగా ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు తుది జాబితా విడుదల చేసింది. 9న అభ్యంతరాల స్వీకారణ, 10న తుది జాబితా తర్వాత సర్పచ్ ఎన్నికలు నిర్వహించనుంది. జిల్లా వ్యాప్తంగా 21 మండలలు, 492 గ్రామ పంచాయతీలు, 5,23,327 ఓటర్లు, 190 ఎంపీటీసీ, 21 జడ్పీటీసీలు, బూత్లు 1052 ఉన్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూపిన ఎన్నికలపై ముచ్చటిస్తున్నారు.
CEIR పోర్టల్ ద్వారా రూ.25 లక్షల విలువగల 167 మొబైల్ ఫోన్లు రికవరి చేసి బాధితులకు ఎస్పీ డీవీ శ్రీనివాస రావు అందజేశారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రూ.1.89 కోట్ల విలువ గల మొత్తం 1264 ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా బాధితులు తమ ఫోన్లు తిరిగి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు. ఏఎస్పీ మహేందర్ ఉన్నారు.
భారీ వర్షాలు, వరద సహాయం పై సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీవీ.శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేశ్ వీసీలో పాల్గొన్నారు. వరద నష్టాలను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని, నష్టం అంచనాలను అధికారులు త్వరిత గతిన అందజేయాలని ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలన్నారు.
మెదక్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తొమ్మిది ఫిర్యాదులు స్వీకరించినట్లు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదుల సమస్యలను విని వాటికి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు
మెదక్ జిల్లాలో వినాయక చవితి సందర్భంగా గణపతి విగ్రహాల నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పీ శ్రీనివాస రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అంతటా ఉన్న అన్ని పోలీస్ అధికారులు, సీఐలు, ఎస్ఐలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అన్నారు.
మెదక్ జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ నెల 1 నుంచి 30 వరకు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్-1861 అమలులో ఉంటుందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కాలంలో జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిషేధమని హెచ్చరించారు. ఈ నిబంధనలకు సహకరించాలని ఆయన ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులను కోరారు.
ఆగస్టు నెలలో షీ టీమ్స్ కఠిన చర్యలు తీసుకుని 2 ఎఫ్ఐఆర్లు, 18 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ డీవి శ్రీనివాసరావు తెలిపారు. మహిళల భద్రత కోసం 73 మందికి కౌన్సెలింగ్ ఇచ్చామని, 47 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. ఫిర్యాదుల కోసం పోలీస్ హెల్ప్లైన్ 100 / 8712657963 అందుబాటులో ఉందని, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచబడతాయని ఎస్పీ హామీ ఇచ్చారు.
మెదక్ పట్టణంలో అర్ధరాత్రి నుంచి ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది. మెదక్ పట్టణంలో 46.3 మి.మీ., సర్ధనలో 43.3 మి.మీ., మెదక్ మండలం రాజుపల్లిలో 36.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. చేగుంటలో 16 మి.మీ.లకుపైగా వర్షం పడింది. దీంతో మెదక్, హవేలీ ఘనపూర్, రామాయంపేట, పాపన్నపేట మండలాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
తూప్రాన్ పట్టణ పరిధి ఆబోతుపల్లి శివారులో హల్దీ వాగుపై నూతనంగా రూ.4.5 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదన చేసినట్టు తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. హల్దీ వాగుపై నిర్మించిన కాజ్ వే వరదలకు కొట్టుకుపోవడంతో ఆదివారం ఆయన పరిశీలించారు. నూతన బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని తెలిపారు. కాజ్ వే దెబ్బ తినడంతో రాకపోకలకు అవకాశం లేదన్నారు.
ఆగస్టులో షీ టీమ్స్ చేపట్టిన చర్యల్లో భాగంగా మెదక్ డివిజన్లో ఈవ్టీజర్స్పై 2 ఎఫ్ఐఆర్లు, 14 ఈ-పెట్టీ కేసులు, తూప్రాన్ డివిజన్లో 4 ఈ-పెట్టీ కేసులు నమోదయ్యాయని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2 ఎఫ్ఐఆర్లు, 18 కేసులు నమోదయ్యాయన్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన 73 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.