Medak

News December 22, 2024

మెదక్ జిల్లాకు రానున్న ప్రముఖులు

image

మెదక్ జిల్లాలో నేడు గవర్నర్ విష్ణుదేవ్ శర్మ,  25న ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్, సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మెదక్ చర్చి 100 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో వీరు శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఈనెల 25న ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ కౌడిపల్లి మండలం ఐసీఏఆర్ కృషి విజ్ఞాన కేంద్రాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి సేంద్రియ రైతులతో సమావేశం అవుతారు.

News December 22, 2024

మెదక్: నేడు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన ఇలా..

image

మెదక్ జిల్లాలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆదివారం పర్యటించనున్నారు. రాజ్ భవన్ నుంచి రోడ్డు మార్గంలో మెదక్ కలెక్టరేట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మెదక్ చర్చి వందేళ్ల ఉత్సవంలో పాల్గొంటారు. అనంతరం కుల్చారం రెసిడెన్షియల్ పాఠశాల, కళాశాల సందర్శించి విద్యార్థులతో ముఖాముఖిలో పాల్గొంటారు. నర్సాపూర్‌లో గల బీవీఆర్ఐటి కళాశాల సందర్శించి, రోడ్డు మార్గంలో రాజ్ భవన్ చేరుకుంటారు.

News December 21, 2024

సీఎం రేవంత్ పర్యటన, ఏడుపాయలలోనే అభివృద్ధి పనులకు శంకస్థాపన

image

ఈనెల 25న మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ముందుగా ఏడుపాయలలో వన దుర్గా మాతను దర్శించుకుంటారు. అనంతరం మెడికల్ కళాశాల భవనం, ఏడుపాయల, చర్చి అభివృద్ధికి నిధులు రూ.350 కోట్ల విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపనలు చేస్తారు. అక్కడి నుంచి మెదక్ చర్చి సందర్శించి వందేళ్ల పండుగ, ప్రార్థనల్లో పాల్గొంటారని సమాచారం.

News December 20, 2024

మెదక్: ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి

image

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎట్‌ హోం నిర్వహించారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి గౌరవ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, పంచాయతీ రాజ్ శాఖ సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News December 20, 2024

 రేపు ఉమ్మడి జిల్లా హాకీ పోటీలు

image

రేపు ఉమ్మడి జిల్లా హాకీ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అధికారి ఖాసిం బేగ్ మీద తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీహెచ్ఈఎల్ లోని హాకీ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుందని, ఎంపికైన క్రీడాకారులు ఈనెల 27 నుంచి సీఎం కప్ హాకీ క్రీడా పోటీలో పాల్గొంటారని పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News December 20, 2024

సిద్దిపేట: ‘కట్నం కోసమే చంపేశారు’

image

జగదేవ్‌పూర్ మండలం పీర్లపల్లిలో ఫోక్ సింగర్ <<14919941>>శ్రుతి ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, కట్నం కోసమే తన కుమార్తెను భర్త దయాకర్‌తో పాటు కుటుంబీకులు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని శ్రుతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెలలో వారి పెళ్లి కాగా ఆ రోజు నుంచే అత్తింటివారు కట్నం కోసం వేధించేవారని శ్రుతి తమకు చెప్పినట్లు తల్లి శ్యామల తెలిపారు. తిమ్మాపూర్‌లో శ్రుతి అంత్యక్రియలు నిర్వహించారు.

News December 19, 2024

సిద్దిపేట: పెళ్లైన 22 రోజులకే ఫోక్ సింగర్ ఆత్మహత్య

image

సిద్దిపేట జిల్లాలో ఫోక్ <<14917574>>సింగర్ శ్రుతి<<>>(26) నిన్న అనుమానాస్పద రీతిలో సూసైడ్ చేసుకుంది. NZB జిల్లాకు చెందిన శ్రుతి, పీర్లపల్లికి చెందిన దయాకర్‌ 22 రోజుల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నారు. నిన్న అత్తగారి ఇంట్లో సూసైడ్ చేసుకోగా ఆమె 4నెలల గర్భిణి. అయితే కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకుందని దయాకర్‌ కుటుంబీకులు చెప్పగా తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శ్రుతి తల్లిదండ్రులు ఆరోపించారు.

News December 19, 2024

మెదక్: PG వన్ టైం ఛాన్స్ పరీక్షలు!

image

ఉమ్మడి మెదక్ విద్యార్థులకు అలర్ట్. OU పరిధిలోని అన్ని పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ పరీక్షల టెంటేటీవ్(తాత్కాలిక) తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. M.SC, MA, M.COM, MSW, BLIBSC, BCJ, M.LIBISC, MJ&MC, M.COM(IS) అన్ని సెమిస్టర్ల వన్ టైం చాన్స్ బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చే నెల 17 నుంచి నిర్వహించనున్నామని చెప్పారు. కాగా, పరీక్ష తేదీలకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

News December 18, 2024

సదాశివపేట: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

image

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన సదాశివపేట మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని నిజాంపూర్ గ్రామంలో విద్యుత్ స్తంభంపై బల్బు అమర్చడానికి స్తంభం ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు షాక్ తగలడంతో విద్యుత్ స్తంభంపైన మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News December 17, 2024

వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పాస్ అవుతుంది: రఘునందన్ రావు

image

వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పాస్ అవుతుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశారు. దేశంలో జమిలి ఎన్నికలు జరగడం ఖాయమన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు లోక్‌సభ ముందుకు రానుందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను అమలు చేయడమే మోడీ సర్కార్ లక్ష్యమన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై ప్రతిపక్షాలు ఎలా సంధిస్తాయో వేచి చూడాలని ఎంపీ రఘునందన్ అన్నారు.