Medak

News March 19, 2024

మెదక్‌: విషాదం.. చేపల వేటకు వెళ్లి మృతి

image

మెదక్ జిల్లా నార్సింగి మండలం సంకాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బీరయ్య అనే వ్యక్తి మరికొందరితో కలిసి మైసమ్మ కుంట చెరువులో చేపలు పట్టడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలికి వల చుట్టుకోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 19, 2024

ర్యాలీలు, ధర్నాలకు అనుమతులు తప్పనిసరి: సిద్దిపేట సీపీ

image

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ధర్నాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ సూచించారు. ఈ నెల 19 నుంచి వచ్చే నెల 3 తేదీ వరకు కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ధర్నాలు, ర్యాలీలు, బహిరంగసభలకు తప్పనిసరిగా ఆయా పోలీస్ స్టేషన్లలో అనుమతులు తీసుకోవాలని సూచించారు.

News March 18, 2024

ఎన్నికల నిబంధనలు పాటించాలి: సిద్దిపేట కలెక్టర్

image

రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి మిక్కిలినేని మను చౌదరి అన్నారు. సోమవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చాయన్నారు. ఎన్నికల ప్రక్రియలో వివిధ అనుమతులను సువిధ యాప్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు.

News March 18, 2024

కంది: సిగరెట్ కోసం గొడవ.. యువకుడి మృతి

image

సిగరెట్ కోసం ఇద్దరు స్నేహితులు గొడవపడి ఒకరు మృతి చెందిన సంఘటన సోమవారం కంది మండలం ఇంద్రకరణ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై విజయ్ కుమార్ కథనం ప్రకారం బిహార్‌కు చెందిన అంకిత్, రోషన్ గ్రామ సమీపంలోని ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. సిగరెట్ కోసం రోషన్ అంకిత్ మధ్య గొడవ జరిగింది. దీంతో రోషన్(21)ను భవనం పైనుంచి కిందకు తోశారని వెల్లడించారు. తీవ్ర గాయాలైన రోషన్ ఆసుపత్రికి తరలించేలోపే మరణించారన్నారు.

News March 18, 2024

మెదక్: ప్రజావాణిలో 73 వినతులు

image

సమస్యల పరిష్కారానికి నేరుగా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి చెప్పుకోవాలని అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి 73 ఆర్జీలు వచ్చినట్టు వివరించారు. ప్రతి సోమవారం ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవాలన్నారు. కానీ ఇతరుల మీద ఆధారపడరాదని సూచించారు.

News March 18, 2024

ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు

image

ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం వేలాది మంది తరలిరాగా సోమవారం కూడా భక్తులు భారీగా సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారికి అభిషేకం చేసి సుందరంగా అలంకరించారు. సహస్రనామార్చన కుంకుమార్చన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. పలువురు బోనాలు, ఒడిబియ్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కిక్కిరిసిపోయారు.

News March 18, 2024

MDK: హరీశ్‌రావు వ్యూహం.. BRS గెలుస్తుందా?

image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాల్లో BRS జెండా ఎగరేసేందుకు ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఈసారి గెలుపే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్నట్లు శ్రేణులు చెబుతున్నాయి. మరి హరీశ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా చూడాలి.

News March 18, 2024

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షం వివరాలు..

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏడబ్ల్యూఎస్ స్టేషన్‌లో ఉ. 8:30 గంటలకు నమోదైన వర్షపాతం వివరాలు.. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో నాగల్ గిద్ద, సత్వార్ 34.5, ముక్తార్ 32.8, కంగ్టి 22.8, మొగుడంపల్లి 10.8, మనూర్ 8.5, సిద్దిపేట జిల్లాలో వెంకట్రావుపేట 5.8, కోహెడ 2.5, గండిపల్లి 2.0, మెదక్ జిల్లాలో కౌడిపల్లి 1.8, రేగోడ్ 1.5, పాతూరు 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News March 18, 2024

MDK: యువకుడి సూసైడ్ 

image

ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కొప్పులపల్లికి చెందిన బాలగౌని శేఖర్ గౌడ్ (25) శనివారం సాయంత్రం పురుగు మందు తాగాడు. చికిత్స నిమిత్తం అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న శేఖర్ గౌడ్ ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. అయితే అతడికి మతిస్థిమితం సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు.

News March 18, 2024

సిద్దిపేట: ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి: హరీశ్ రావు

image

10వ తరగతి పరీక్షలు ఆత్మవిశ్వాసంతో రాయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆకాంక్షించారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఒక ప్రకటనలో శుభాశీస్సులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. కష్టపడి చదివిన అంశాలను రాయాలని ఉత్తమ ఫలితాలతో ముందంజలో నిలవాలన్నారు.