Medak

News March 18, 2024

మెదక్: ప్రజావాణిలో 73 వినతులు

image

సమస్యల పరిష్కారానికి నేరుగా ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి చెప్పుకోవాలని అదనపు కలెక్టర్ రమేష్ సూచించారు. ప్రజావాణి కార్యక్రమానికి 73 ఆర్జీలు వచ్చినట్టు వివరించారు. ప్రతి సోమవారం ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి చెప్పుకోవాలన్నారు. కానీ ఇతరుల మీద ఆధారపడరాదని సూచించారు.

News March 18, 2024

ఏడుపాయలకు పోటెత్తిన భక్తులు

image

ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గా మాత ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం వేలాది మంది తరలిరాగా సోమవారం కూడా భక్తులు భారీగా సంఖ్యలో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారికి అభిషేకం చేసి సుందరంగా అలంకరించారు. సహస్రనామార్చన కుంకుమార్చన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. పలువురు బోనాలు, ఒడిబియ్యం సమర్పించి తమ మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు కిక్కిరిసిపోయారు.

News March 18, 2024

MDK: హరీశ్‌రావు వ్యూహం.. BRS గెలుస్తుందా?

image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని 2 పార్లమెంట్ స్థానాల్లో BRS జెండా ఎగరేసేందుకు ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఈమేరకు ఇప్పటికే క్షేత్రస్థాయిలో నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో ఈసారి గెలుపే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తున్నట్లు శ్రేణులు చెబుతున్నాయి. మరి హరీశ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా చూడాలి.

News March 18, 2024

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షం వివరాలు..

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏడబ్ల్యూఎస్ స్టేషన్‌లో ఉ. 8:30 గంటలకు నమోదైన వర్షపాతం వివరాలు.. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో నాగల్ గిద్ద, సత్వార్ 34.5, ముక్తార్ 32.8, కంగ్టి 22.8, మొగుడంపల్లి 10.8, మనూర్ 8.5, సిద్దిపేట జిల్లాలో వెంకట్రావుపేట 5.8, కోహెడ 2.5, గండిపల్లి 2.0, మెదక్ జిల్లాలో కౌడిపల్లి 1.8, రేగోడ్ 1.5, పాతూరు 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

News March 18, 2024

MDK: యువకుడి సూసైడ్ 

image

ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం కొప్పులపల్లికి చెందిన బాలగౌని శేఖర్ గౌడ్ (25) శనివారం సాయంత్రం పురుగు మందు తాగాడు. చికిత్స నిమిత్తం అతడిని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న శేఖర్ గౌడ్ ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు. అయితే అతడికి మతిస్థిమితం సరిగా లేదని స్థానికులు చెబుతున్నారు.

News March 18, 2024

సిద్దిపేట: ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయండి: హరీశ్ రావు

image

10వ తరగతి పరీక్షలు ఆత్మవిశ్వాసంతో రాయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆకాంక్షించారు. పరీక్ష రాసే విద్యార్థులకు ఒక ప్రకటనలో శుభాశీస్సులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. కష్టపడి చదివిన అంశాలను రాయాలని ఉత్తమ ఫలితాలతో ముందంజలో నిలవాలన్నారు.  

News March 18, 2024

మెదక్: 10th విద్యార్థులకు ఆల్ ది బెస్ట్: రఘునందన్ రావు 

image

నేటి నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని, విద్యార్థులకు మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు సోషల్ మీడియా ద్వారా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. ఏకాగ్రతతో పరీక్షలు రాసి అద్భుతమైన ఫలితాలు సాధించాలని పేర్కొన్నారు. చదువును కష్టపడి కాకుండా ఇష్టంతో చదివితే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు.

News March 18, 2024

కొమురవెల్లి బ్రహ్మోత్సవంలో ముగిసిన తొమ్మిదో వారం

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న తరుణంలో తొమ్మిదో ఆదివారం మల్లన్న క్షేత్రానికి భక్తులు భారీగా తరలివచ్చారు. జానపదుల జాతరకు పెట్టింది పేరు కొమురవెల్లి మల్లన్న జాతర కాగా పట్నాలు, బోనాలు, డోలు చప్పుళ్లు, ఢమరుక నాదాలు, శివసత్తుల శిగాలు, పోతరాజుల విన్యాసాలు జాతరలో భక్తులను ఆకట్టుకున్నాయి. 

News March 18, 2024

MDK: భార్యతో గొడవ.. ఇంట్లోంచి వెళ్లి ఆత్మహత్య

image

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన మర్రి స్వామి(45) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాలతో అతడు అప్పుడప్పుడు ఇంట్లోంచి వెళ్లిపోతుండే వాడని, అలాగే ఈనెల 11న భార్య జ్యోతితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడన్నారు. ఈ క్రమంలో ఘనపూర్ గ్రామ శివారులో ఉరేసుకుని అతడు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆదివారం రాత్రి స్థానికులు గుర్తించారన్నారు. మృతదేహం కుళ్లిపోయిందన్నారు.

News March 18, 2024

MDK: పోటీ పరీక్షలకు సిద్ధమవుతోన్న నిరుద్యోగులు

image

రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే తపనతో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. గ్రూప్‌-2, గ్రూప్‌-3, డీఎస్సీ, టెట్‌, హాస్టల్‌ వార్డెన్‌ నోటిఫికేషన్లు రావడంతో అర్హత కలిగిన అభ్యర్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో డిగ్రీ, పీజీ, బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారు సుమారు 7లక్షల మంది ఉన్నట్లు సమాచారం.