India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతులలో ప్రవేశం పొందేందుకు నేడే ఆఖరి తేదీ అని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ శోభారాణి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఓపెన్ స్కూల్లో ప్రవేశం పొందేందుకు ఇది చివరి అవకాశమన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రములో సంప్రదించాలని సూచించారు.
గ్రూప్-2 పరీక్ష అభ్యర్థులు ప్రశాంతమైన వాతావరణంలో రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారి, రూట్ అధికారులు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 37 కేంద్రాల్లో 13,714 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు.
మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 లోపు సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో తెలియజేయాలన్నారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ రాజకీయ పార్టీలకు తెలిపారు.
3నెలలకు ఒకసారి ఈవీఎంలను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. మంగళవారం పాత డీఆర్డీఏలోని ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించినట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్లో సీసీ కెమెరాలు, విద్యుత్ లైట్లు, తదితర సౌకర్యాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈవీఎంలకు పోలీసుల భద్రత కల్పించినట్లు చెప్పారు.
పటాన్చెరులో 1971-72లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 55ఏళ్లకు ఆత్మీయ అపూర్వ సమ్మేళనం నిర్వహించుకున్నారు. మాజీ కార్పొరేటర్ సపాన్ దేవ్ ఆధ్వర్యంలో పూర్వ స్నేహితులు (విద్యార్థులు) కలుసుకొని ఒకరినొకరు పలకరించుకొని ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయాలని అనుకున్నట్లు వివరించారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ పోటీలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఫుల్బాల్ అసోసియేషన్ పర్యవేక్షణలో క్రీడాకారుల ఎంపికలు డిసెంబ 19న నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి డి వై ఎస్ ఓ జయదేవ్ ఆర్యా, సిద్దిపేట ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కోచ్ అక్బర్ నవాబ్ తెలిపారు. ఎంపికలకు క్రీడాకారులు ఆధార్ కార్డుతో హాజరు కావాలన్నారు.
పెళ్లి కావట్లేదని మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నంగునూరు మండలం సిద్ధన్నపేటకు సంగు భాస్కర్(36) కారు డ్రైవర్. ఆదివారం రాత్రి డ్రైవింగ్కు వెళ్లి వచ్చిన భాస్కర్.. ఉదయం చూడగా ఇంట్లో ఊరేసుకున్నాడు. పెండ్లి కావట్లేదని మనస్తాపంలో సూసైడ్ చేసుకున్నట్లు తండ్రి అంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆసిఫ్ తెలిపారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్లోని తెలంగాణభవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.
నేటి నుంచి జరుగబోయే అసెంబ్లీ సమావేశాలకు KCR వస్తారో.. రారో.. మీరే చూస్తారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. BRS MLAలు, MLCలతో పార్టీ అధినేత KCR ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో సమావేశమయ్యారు. గురుకులాల బాట ద్వారా అధ్యయనం చేసిన నివేదికను RS ప్రవీణ్కుమార్, BRSV విభాగం అందజేసింది. నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై KCR ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంయుక్త సమావేశం పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం జరగనున్నది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.
Sorry, no posts matched your criteria.