India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. వివరాలిలా.. హవేళిఘణాపూర్ మండలం సుల్తానాపూర్కు చెందిన నీల(40) మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి ఔరంగాబాద్ శివాలరులో మృతదేహం లభ్యమైంది. గజ్వేల్ పానీపూరి బండి నడుపుతున్న వ్యక్తి కరెంట్ షాక్తో మృతిచెందాడు. బెజ్జంకికి చెందిన ఉపాధ్యాయుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా బుధవారం తోటపల్లి చెరువు వద్ద అనుమానాస్పందగా మృతిచెందాడు.
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో క్వారీ గుంతలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. జీఎంఆర్ కాలనీకి చెందిన చిట్యాల రఘు, చిట్యాల రవి స్నానం చేయడానికి క్వారీకి వెళ్లారు. ప్రమాదవశాత్తు రవి నీటి గుంతలో పడి మునిగిపోయాడు. గజ ఈతగాల్లతో వెతకించినా ఆచూకీ లభించలేదు. కేసు నమోదైంది.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందదిరా క్రాంతి పథకం రుణాలపై బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల రుణాలను త్వరగా ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఆర్బీఐ మేనేజర్ తాన్య, నాబార్డ్ డే కృష్ణ తేజ, లేట్ బ్యాంకు మేనేజర్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలుచోట్ల భూకంపం సంభవించింది. సంగారెడ్డి, సిద్దిపేట, హుస్నాబాద్, జగదేవ్పూర్, జోగిపేట, గజ్వేల్, కొమ్మేపల్లి, పొట్టపల్లి ప్రాంతాల్లో భూమి కంపించిందని పలువురు సోషల్ మీడియాలో పేర్కొనా, దీనిపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఉ.7:25 నుంచి 7:30ల మధ్య భూమి కంపించింది. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. అయితే మీ ప్రాంతంలో వస్తే కామెంట్ చేయండి.
సంగారెడ్డి జిల్లాలో 101 పాఠశాలలో బుధవారం NAS పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పరీక్ష నిర్వహించడానికి 101 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లను నియమించామని, ప్రతి పాఠశాలకు ఒక అబ్జర్వర్ ఉంటారని పేర్కొన్నారు. పాఠశాల హెచ్ఎంలు పరీక్ష ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని కోరారు.
సంగారెడ్డిలో బుధవారం ఏక సభ్య కమిషన్ చైర్మన్ శమీమ్ అత్తర్ సభ్యులు సంగారెడ్డికి వస్తున్నారని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎస్సీ కుల సంఘాల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన దళిత సంఘాల నాయకులు తమ వినతి పత్రాలను సమర్పించాలని చెప్పారు.
సంగారెడ్డి మండలంలోని 11 గ్రామ పంచాయతీలో ఈ నెల 6 నుంచి నిర్వహించిన కులగణన సర్వేకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం పూర్తయ్యిందని సంగారెడ్డి మండల పరిషత్తు అభివృద్ధి అధికారి యాదగిరి రెడ్డి మంగళవారం తెలిపారు. దీనికి సంబంధించిన నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపించడం జరిగిందని పేర్కొన్నారు.
ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని సిద్దిపేట మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మినిస్టర్ క్వార్టర్స్లో తెలంగాణ ఆటో, ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ ఐక్య కార్యాచరణ సమితి నాయకులు మంగళవారం మంత్రిని కలిశారు. ఆటో కార్మికుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
మహా సహస్ర అవధాని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.గరికపాటి నరసింహ రావు ఈనెల 8న మెదక్ పట్టణానికి రానున్నారు. శ్రీ సాయి బాలాజీ గార్డెన్స్లో ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా శ్రీ ఫ్యాక్టరీ హనుమాన్ దేవాలయంలో ఉదయం నుంచి చందన నిర్మాల్య విసర్జన తదుపరి పునః శ్రీ చందనోత్సవం, మహాకుంభాభిషేకం ఉన్నట్లు ఆలయ పూజారి కరణం ప్రభాకర్ శర్మ తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మక్తక్యాసారంలో సోమవారం భర్తను భార్య హత్య చేసింది. సీఐ వివరాల ప్రకారం.. శంషాబాద్కు చెందిన సంపత్(39) మక్తక్యాసారంకి చెందిన మంజుల దంపతులు. సంపత్ ప్రతిరోజు మద్యంతాగి గొడవపడే వాడు. సోమవారం మద్యం తాగి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి సంపత్ తలపై కట్టెతో కొట్టి వరండాలోకి పడేయంతో అతడి తలకి గచ్చుబండ తాకింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.