Medak

News December 3, 2024

మెదక్: ప్రజా ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి పొన్నం

image

ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని బీసీ రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజల ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనేక సంస్కరణలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆరోగ్యశ్రీని 5 లక్షలకు ఉన్న పరిమితి 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఎంత ఖర్చైనా వెనకాడమన్నారు.

News December 2, 2024

అందోల్: అంబులెన్స్‌లు ప్రారంభించిన మంత్రి దామోదర్

image

హైదరాబాదులోని ఎన్టీఆర్ మార్గ్‌లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం విక్రమార్కతో కలిసి మంత్రి దామోదర్ రాజనర్సింహ అంబులెన్స్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ఆరోగ్య సబ్ సెంటర్లు, PHC, ఏరియా హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలకు రూ.500 కోట్ల విడుదల చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే అని ఆయన అన్నారు. పేదవాని వైద్యం, విద్య మా బాధ్యతగా భావించేది కాంగ్రెస్ అని తెలిపారు.

News December 2, 2024

అందోల్: వైద్యం వ్యాపార పరం కావొద్దు: మంత్రి రాజనర్సింహ

image

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని మంత్రి రాజనర్సింహ అన్నారు. పాలనకు ఏడాది పూర్తవుతున్న వేళ ఆరోగ్య ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. వైద్యం వ్యాపార పరం కావొద్దని, ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించేలా కృషి చేస్తున్నామన్నారు. ఎక్కడా మందుల కొరత లేకుండా చేశామని తెలిపారు. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

News December 2, 2024

సిద్దిపేట: కోకకోలా ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం

image

ములుగు మండలంలోని బండ తిమ్మాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన హిందుస్తాన్ కోకకోలా బేవరేజెస్ పరిశ్రమకు చెందిన కోకకోలా ఫ్యాక్టరీని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈకార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ఛైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి నర్సారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News December 2, 2024

సిద్దిపేట: కోకా కోలా ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం

image

సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్లో HCCB – కోకా కోలా ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులకు వందల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్లో రూ.1000 కోట్లతో కోకా కోలా కంపెనీని నిర్మించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించడం ఇదే తొలిసారి.

News December 2, 2024

గజ్వేల్: KCR ఇలాకాలో రేవంత్ రెడ్డి మాట ఇదే!

image

సిద్దిపేట జిల్లాలో నేడు <<14764463>>CM రేవంత్ రెడ్డి పర్యటన<<>> విషయం తెలిసిందే. గజ్వేల్ పరిధి బండ తిమ్మాపూర్‌లో హిందుస్థాన్ కోకాకోలా కంపెనీని సీఎం ప్రారంభించనున్నారు. కాగా ఏడాది క్రితం కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన గజ్వేల్ ప్రజలకు పరిశ్రమలు తెస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు CM హోదాలో పరిశ్రమలు ప్రారంభించనున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

News December 2, 2024

సిద్దిపేట జిల్లాలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

image

సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండతిమ్మాపూర్ గ్రామానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. స్థానిక హిందుస్థాన్ కోకాకోలా కంపెనీని సీఎం ప్రారంభించనున్నారు. బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బండతిమ్మాపూర్ చేరుకుంటారు. 3 గంటలకు తిరిగి సీఎం బేగంపేట వెళ్తారని సీఎం పర్సనల్ సెక్రటరీ నర్మల శ్రీనివాస్ తెలిపారు. రూ.వెయ్యి కోట్లతో ఈ గ్రీన్ ఫీల్డ్ ప్లాంటును నిర్మించారు.

News December 2, 2024

సిద్దిపేట: నేడు సీఎం పర్యటన షెడ్యూల్

image

సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్ గ్రామానికి సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. బండ తిమ్మాపూర్‌లో హిందుస్థాన్ కోకాకోలా కంపెనీని సీఎం ప్రారంభించనున్నారు. హెలికాప్టర్‌లో బేగంపేట నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బండ తిమ్మాపూర్ చేరుకుంటారు. 3 గంటలకు తిరిగి సీఎం బేగంపేట వెళ్తారని సీఎం పర్సనల్ సెక్రటరీ నర్మల శ్రీనివాస్ ఒక ప్రకటనలో వివరించారు.

News December 2, 2024

MDK: నేడు సీఎం రేవంత్ రెడ్డి రాక

image

సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్‌లో నూతనంగా నిర్మించిన హిందూస్తాన్ లీవర్ కోకాకోలా బేవరేజెస్ ఫాక్టరీని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి శనివారం కోకాకోలా ఫ్యాక్టరీని సందర్శించి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఫ్యాక్టరీ అధికారులతో చర్చించారు.

News December 1, 2024

రాంచంద్రంపురం: జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌లతో సమావేశం

image

హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఆదివారం జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్‌లతో సమావేశం నిర్వహించారు. ప్రజా పాలన విజయోత్సవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈనెల 7,8,9 డివిజన్, నియోజకవర్గాలు, రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి తదితరులు ఉన్నారు.