Medak

News May 20, 2024

జూన్ 7 నుంచి యధావిధిగా ప్రజావాణి: రాహుల్ రాజ్

image

మెదక్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించే రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పరిపాలన పరమైన కారణాలు, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రద్దు చేస్తున్నట్లు వివరించారు. విషయాన్ని ప్రజలు గమనించి రేపటి ప్రజావాణి కార్యక్రమానికి రావద్దని సూచించారు. జూన్ 7 నుంచి ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు

News May 20, 2024

సంగారెడ్డి: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో TGని వాడాలి’

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి TG అనే అక్షరాన్ని మాత్రమే వాడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం తెలిపారు. ప్రభుత్వం ఈ మేరకు అధికారికంగా ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. మే 31వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయంలోని బోర్డులు, వెబ్ సైట్‌లలో టీజీ అక్షరాలుగా మార్చాలని సూచించారు.

News May 19, 2024

UPDATE.. తూప్రాన్: పెళ్లింట విషాదం.. పెళ్లికొడుకు అన్న మృతి

image

తూప్రాన్ మండలం యావపూర్ వద్ద జరిగిన <<13277126>>రోడ్డు ప్రమాదం<<>>లో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అనంతగిరిపల్లికి చెందిన కర్రె నర్సింలు(40) మృతి చెందాడు. నరసింహులు తమ్ముడి వివాహం రేపు జరగాల్సి ఉండగా ఏర్పాట్లలో ఉన్నారు. నర్సింలు, బంధువు పోచయ్య ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళ్తున్నారు. తమిళనాడుకు చెందిన సతీష్ కుమార్, మోహన్ సైతం బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన వాహనం ఢీ కొట్టగా, తీవ్రంగా గాయపడ్డారు.

News May 19, 2024

సంగారెడ్డి: రెండు చోట్ల ఓటేశారు !

image

నాగల్‌గిద్ద, కంగ్టి, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాల్లోని సుమారు 40 గ్రామాలు కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. ఇక్కడ కర్ణాటక సరిహద్దు గ్రామస్థులు సైతం ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈనెల 7న కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఓటేసి వీరు, తిరిగి తెలంగాణ MP ఎన్నికల్లోనూ ఓటేశారు. ఇలా ఆయా గ్రామాల్లో 75 శాతం పోలింగ్‌ నమోదైంది. నాగల్‌గిద్ద(M) ఏస్గి గ్రామంలో 150 మంది, గౌడ్‌గామ్‌జనవాడకు చెందిన 100 మంది 2చోట్ల ఓచేసినట్లు టాక్.

News May 19, 2024

మెదక్: ఆర్టీసీకి ఎన్నికల్లో సమకూర్చిన ఆదాయం

image

మెదక్ రీజియన్ పరిధిలో మే11 నుంచి 14 వరకు వివిధ ప్రాంతాలకు 887బస్సు సర్వీసులు నడిపించగా ఈ నాలుగు రోజుల్లో ఆర్టీసీకి రూ.4.29 కోట్ల ఆదాయం సమకూరిందని మెదక్ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ ప్రభులత తెలిపారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల నుంచి స్వస్థలాలకు ఓటు వేయడానికి వచ్చే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నిత్యం నడిపే బస్సులతో పాటు ఆధారంగా సర్వీసులకు నడిపించారన్నారు. సిబ్బంది కూడా కష్టపడి పని చేశారన్నారు.

News May 19, 2024

సిద్దిపేట: మద్యం మత్తులో లారీ డ్రైవర్ బీభత్సం

image

మద్యం మత్తులో అతివేగంతో ఓ లారీ డ్రైవర్ బీభత్సం సృష్టించిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడకు చెందిన లారీ డ్రైవర్ శనివారం సరుకులు దింపి తిరిగి వెళుతున్న క్రమంలో సిద్దిపేటలోని బీజేఆర్ చౌరస్తాలో లారీ అదుపు తప్పింది. చౌరస్తాలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహంకు వద్ద ఫౌంటేన్‌లోకి లారీని ఎక్కించాడు. పోలీసులు డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

News May 19, 2024

మెదక్: ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ ఆత్మహత్య

image

మనస్తాపం చెందిన ఓ మహిళ ఇంట్లో నుంచి వెళ్లి మృతదేహంగా లభ్యమైంది. కొల్చారం ఎస్ఐ మహ్మద్‌గౌస్ తెలిపిన వివరాలు.. మెదక్ పట్టణం నవాబుపేటకు చెందిన మల్లయ్య, రాజమ్మ దంపతులకు ఒక్క కుమార్తె సుజాతను రాజయ్య అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈనెల 16న తల్లి రాజమ్మ, సుజాతలకు గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మంజీరా నదిలో శవం లభ్యమైంది. భర్త రాజయ్య ఫిర్యాదుతో కేసు నమోదైందని ఎస్సై తెలిపారు.

News May 19, 2024

దుబ్బాక: అప్పులు చేసి ఆన్‌లైన్‌ గేమ్స్‌

image

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో యువత ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబాలకు తీరని మనోవ్యధకు మిగులుస్తోంది. ఈ విషపు క్రీడ గ్రామాల్లోకి పాకింది. గ్రామీణ యువకులు కూడా ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్‌లు కాస్తూ అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో నెలకు సుమారు 15 వరకు ఆత్మహత్యల కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో సుమారు 22 శాతం మంది యువత ఆన్‌లైన్‌ గేమింగ్‌కు బానిసలవుతున్నట్లు ఇటీవల జరిగిన ఓ సర్వేలో తేలింది.

News May 19, 2024

మెదక్: ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం

image

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇప్పటి వరకు 44,685 మంది రైతుల నుంచి 1,94,666 టన్నులు సేకరించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 34 బాయిల్డ్, 23రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించినట్లు తెలిపారు. కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు సిద్దిపేట జిల్లాకు 10 వేల టన్నులు పంపినట్లు తెలిపారు. రానున్న 5 రోజులు వర్షాలు ఉన్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News May 19, 2024

సిద్దిపేట: గ్రూప్-1 అభ్యర్థులకు గ్రాండ్ టెస్టులు

image

సిద్దిపేటలోని BC స్టడీ సర్కిల్ కేంద్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సన్నద్ధం అయ్యే అభ్యర్థులకు గ్రాండ్ టెస్టులను చేపట్టనున్నట్లు డైరెక్టర్ కృష్ణ దయాసాగర్ పేర్కొన్నారు. గ్రూప్-1కి సంబంధించిన పరీక్షలు ఈ నెల 18న ప్రారంభమై 20, 22, 25, 27, 29, 31 జూన్ 1, 3వ తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. శిక్షణార్థులు మినహాయిస్తే మిగిలిన అభ్యర్థులు WWW.tsbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.