India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్రంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నియంత్రణపై వైద్యా,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలోనీ ప్రాథమిక ఆసుపత్రిలో అందిస్తున్న సేవల బలోపేతంపై మంత్రి చర్చించారు. సీజనల్ వ్యాధులు విస్తరించకుండా ప్రాథమిక ఆసుపత్రులలో అవసరమైన సిబ్బంది, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
సంగారెడ్డి కలెక్టరేట్లో డిసెంబర్ 4న ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ షమీమ్ అత్తర్ బహిరంగ విచారణకు హాజరవుతారని కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ఎస్సీ కుల సంఘాల నాయకులు బహిరంగ విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.
వయునాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందిన ప్రియాంక గాంధీని శుక్రవారం జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షేట్కార్ కలిసి పుష్పగుచ్చాన్ని ఇచ్చారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. తన గెలుపుకు కృషి చేసిన కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు అన్ని సహాయ సహకారాలు అందజేస్తుందని ఆమె పేర్కొన్నారు.
సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివాస్లో సీఎం రేవంత్ పై హరీశ్ రావు మండిపడ్డారు. ‘రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా, ఇచ్చిన తెలంగాణ ప్రకటనను కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తీసుకున్నప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున మొదలైంది. అప్పుడు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తే రేవంత్ పారిపోయిండు. రేవంత్ మీద ఉద్యమ కేసులు లేవు కానీ.. ఓటుకు నోటు కేసు మాత్రం నమోదైంది’ అని హరీశ్ రావు అన్నారు.
తెలంగాణ కోసం 2009 NOV29న దీక్ష చేపట్టిన KCR.. సిద్దిపేటలోని రంగధాంపల్లి దీక్షా శిబిరానికి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఈ క్రమంలో దీక్షా స్థలంలో అలజడి మొదలు కాగా వెంటనే హరీశ్ రావు, పద్మాదేవేందర్ రెడ్డి, సోలిపేట ఇతర నాయకులు దీక్ష చేపట్టారు. సిద్దిపేట, రంగధాంపల్లి దీక్షలు యావత్ తెలంగాణను కదిలించాయి. సిద్దిపేట, పాలమూకుల దీక్షలు ఏకంగా 1,531 రోజులపాటు కొనసాగాయి.
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కానీ మలిదశ ఉద్యమంలో భాగంగా KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమానికి ఊపిరి పోసింది. 29 నవంబర్ 2009లో కరీంనగర్లోని తెలంగాణ భవన్ నుంచి దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. నాటి కేసీఆర్ దీక్షతో తెలంగాణ సుభిక్షం అయింది.
ఉమ్మడి మెదక్ జిల్లాను తీవ్ర చలి వణికిస్తోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం అత్యల్పంగా మెదక్ జిల్లా శివంపేటలో 8.9డిగ్రీలు నమోదు కాగా.. సంగారెడ్డి జిల్లా నల్లవెళ్లిలో 9.2, సిద్దిపేట జిల్లా కొండపాక 11.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచే చలి మొదలై ఉదయం 9 గం. దాటినా తగ్గడం లేదు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
తెలంగాణలోని గురుకులాలు, హాస్టళ్ల పర్యవేక్షణ కోసం కమిటీ వేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలను మంత్రి తనిఖీ చేసి మాట్లాడారు. గురుకులాలు, హాస్టళ్లలో గతం కంటే మెరుగైన వసతులున్నాయని చెప్పారు. గురుకులాలు, హాస్టళ్ల పర్యవేక్షణ కోసం కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, శాఖల అధికారులతో కమిటీ వేస్తున్నామని చెప్పారు.
వ్యవసాయమంటే దండగ కాదు పండుగని నిరూపించిన ఘనత కాంగ్రెస్ దక్కుతుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సిమన్నారు. మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్లో నిర్వహించిన రైతు పండుగ సదస్సులో సహచర మంత్రులతో కలిసి పాల్గొన్నారు. అయనా మాట్లాడుతూ.. “వరి వేస్తే ఉరి కాదు సిరి” అని తమ ప్రభుత్వం నిరూపించిందన్నారు. సాగుకు సాంకేతికత జోడించి రైతులకు ఆదాయం పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పాపన్నపేట మండలం కొత్తపల్లి ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ విద్యార్థులను ప్రశ్నలు అడిగారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజన శాలను, మూత్రశాలలను పరిశీలించి ఉన్నత పాఠశాల HM దత్తు రెడ్డికి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.