Medak

News May 18, 2024

TS స్థానంలో TGగా మార్చాలి: కలెక్టర్

image

TS స్థానంలో TGగా మార్చాలని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వివిధ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, ఏజెన్సీలు పేర్లలో TS బదులుగా TGగా మార్చాలని, ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రియేషన్స్ సూచించే TS స్థానంలో TGని వినియోగించేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ ఇచ్చిన నేపథ్యంలో టీజీగా మార్చాలన్నారు.

News May 18, 2024

MDK: TS స్థానంలో TGగా మార్చాలి: కలెక్టర్

image

ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలు పేర్లలో TS బదులుగా TGగా మార్చాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రియేషన్స్ సూచించే TS స్థానంలో TGని వినియోగించేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ జారీ చేసినట్లు తెలిపారు. మార్చి నెలలో వాహనాల రిజిస్ట్రేషన్‌కు అనుమతులు రాగా, తాజాగా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో TGని వినియోగించేందుకు అనుమతి లభించిందన్నారు.

News May 18, 2024

ఇంటి నుండి వెళ్లి.. శవమైన మౌనిక

image

నిజాంపేట మండలం కొత్తపల్లి శివారు పంట పొలంలో మహిళా మృతదేహాన్ని శనివారం పోలీసులు గుర్తించారు. కల్హేర్ పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని బాచేపల్లి చెందిన కురుమ మౌనికగా గుర్తించారు. ఈనెల 10న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి లచ్చవ్వ ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పంట పొలాల్లో మౌనిక మృతదేహం లభ్యం పట్ల పోలీసులు అనుమానిస్తూ హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

News May 18, 2024

మెదక్‌లో 4 పాలిసెట్ పరీక్ష కేంద్రాలు

image

పాలిసెట్- 2024 ప్రవేశ పరీక్ష ఈనెల 24న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మెదక్ జిల్లా కేంద్రంలో 4 పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సువర్ణలత తెలిపారు. ప్రభుత్వ బాలికల పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్ధార్థ ఆదర్శ జూనియర్ కళాశాల, సిద్ధార్థ మోడల్ హై స్కూల్‌లో ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు సమయానికి హాజరు కావాలని సూచించారు.

News May 18, 2024

నర్సాపూర్: అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి

image

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం అహ్మద్ నగర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లేశం, మంజుల దంపతుల కుమార్తె నీరుడి హిందూ అనే 5 సంవత్సరాల బాలిక ఇంట్లో గత రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే పాఠశాల సమీపంలో ఆడుకుంటున్న క్రమంలో పాము కాటు వేసి ఉంటుందని బంధువులు అనుమానిస్తున్నారు. పాము కాటు వల్లే హిందూ మృతి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు.

News May 18, 2024

మెదక్ జిల్లాలో వడ్ల నిల్వకు జాగా ఏది..?

image

అకాల వర్షాలకు రైతులు కంటిమీద కునుకు లేకుండా పోయింది. ధాన్యం దిగుబడులు పెరుగుతున్న పంట విక్రయించే సమయానికి అగచాట్లు పడాల్సి వస్తోంది. దిగుబడికి రైస్ మిల్లుల సామర్ధ్యానికి పొంతన లేక పోవడంతో తూకం వేసిన ధాన్యం నిలువలు పెరిగిపోయి ఎక్కడ నిల్వ ఉంచాలో అర్థం కాని పరిస్థితి ఉంది. జిల్లాలో 4.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నా.. ఆ మేరకు మిల్లుల సామర్థ్యం లేదు.

News May 18, 2024

హత్నూర: నీటి తొట్టెలో పడి 15 నెలల బాలిక మృతి

image

ఇంట్లో ఆడుకుంటూ వెళ్లి ఒక బాలిక నీటి తొట్టెలో పడి మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రైతు నరేశ్ కుమార్తె హరి చందన (15 నెలలు) గత రాత్రి ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి తొట్టెలో పడి ఊపిరాడక అందులోనే మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News May 18, 2024

హత్నూర: బైక్‌ను ఢీ కొట్టిన డీసీఎం.. వ్యక్తి మృతి

image

హత్నూర మండలం సిరిపుర గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రియా తాండకు చెందిన గుగులోత్ పప్యా తన బైక్‌పై పని నిమిత్తం సంగారెడ్డికి వెళ్తుండగా, సిరిపురం గ్రామ శివారులో వెనక నుండి వచ్చిన డీసీఎం బైకును ఢీ కొట్టింది. దీంతో పప్యా తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య శ్యామల ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 18, 2024

చిన్నకోడూరు: తండ్రిని కొట్టిన మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య

image

తండ్రిపై చేసి చేసుకుని మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో చోటుచేసుకుంది. వల్లెపు యాదవ్వ-మల్లయ్యలకు ఇద్దరు కూతుళ్లు, కొడుకు శేఖర్‌(24) ఉన్నారు. ఈనెల 11న తల్లిదండ్రులతో గొడవ జరగగా, కోపంతో శేఖర్ తండ్రిపై చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో తప్పు తెలుసుకుని మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేయాల్సి ఉండగా చేయకపోవడంతో ఆఖరి సమయంలో పోలీసులు ఆపారు

News May 18, 2024

గజ్వేల్: ‘తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం’

image

తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని సిద్దిపేట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తనూజ తెలిపారు. గజ్వేల్‌ మండల పరిధిలోని జాలిగామ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని, ప్రతి గింజను కొనుగోలు చేస్తామని తెలిపారు.