Medak

News November 26, 2024

శైలజ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే: హరీశ్ రావు

image

ఫుడ్ పాయిజన్తో చనిపోయిన వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న నేతలను అడ్డుకోవడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అన్నారు. ప్రభుత్వం తమ తప్పేం లేదన్నట్లు వ్యవహరించినంత మాత్రాన విద్యార్థిని ప్రాణం తీసిన పాపం ఊరికే పోదన్నారు.

News November 26, 2024

గజ్వేల్: ఆవాలతో అంబేద్కర్ చిత్రం అదుర్స్

image

రాజ్యాంగం అమోదించి 75సంవత్సరాలు పూర్తైన సందర్భంగా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ చిత్రాన్ని గజ్వేల్ కు చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు సేవ రత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆవాలతో చిత్రించి అంబేద్కర్‌పై ఉన్న గౌరవాన్ని చాటాడు. రామకోటి రామరాజు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణం అన్నారు. అంబేద్కర్ చిత్రాన్ని ఆవాలతో ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు.

News November 26, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో చికెన్ ధరలు పెరిగాయి. కార్తీకమాస చివరి సోమవారం ముగియడంతో‌ KGపైన రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచారు. గతవారం కిలో స్కిన్‌లెస్‌ రూ. 185 నుంచి రూ. 200 మధ్య అమ్మారు. మంగళవారం స్కిన్‌లెస్ రూ. 213 నుంచి రూ. 230 వరకు విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 187 నుంచి రూ. 200గా వ్యాపారులు ధరలు నిర్ణయించారు. మరి మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి. కామెంట్ చేయండి.

News November 25, 2024

దొమ్మాట మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మృతి

image

కొండపాక వాస్తవ్యులు దొమ్మాట (ప్రస్తుతం దుబ్బాక) నియోజకవర్గం మాజీఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మృతిచెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌ని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. కేసీఆర్‌కు రాజకీయ సమకాలికులు. ఆయన మృతిపట్ల మాజీ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తంచేశారు. 1983-88లో అప్పటి దొమ్మాట ఎమ్మెల్యేగా ఎంతో నిబద్ధతతో ప్రజా సేవలో ఉన్న ఆయన సేవలు నేటితరం వారికి స్ఫూర్తి అని కొనియాడారు.

News November 25, 2024

మెదక్: నేడు ప్రజావాణి కార్యక్రమం

image

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. సమస్యలను అక్కడికి అక్కడే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News November 24, 2024

మెదక్: కాంగ్రెస్ హామీలు.. నీటి మీద రాతలు: హరీష్ రావు

image

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంకలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి పర్యటించారు. స్వాగతం పలికిన మహిళలతో హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మహిళలకు ఇస్తానన్న రూ.2500, తులం బంగారం అందుతున్నాయా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాటలు నీటి మీద రాతలన్నారు.

News November 23, 2024

MDK: మహరాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ గ్యారంటీలను నమ్మలేదు: హరీశ్‌రావు 

image

మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు నమ్మలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారని, ఇక్కడ మహిళలకు రూ.2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ.3,000 ఇస్తామనడం.. రైతు భరోసా ఎగ్గొట్టడం.. ఆసరా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్రలో ప్రభావం చూపాయన్నారు.

News November 23, 2024

సంగారెడ్డి: ఫైర్ సేఫ్టీ నిబంధనలపై ఆరోగ్య శాఖ మంత్రి సమీక్ష 

image

ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈరోజు టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఓ దవాఖానలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి పిల్లలు చనిపోయిన ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు బాధాకరం అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్‌ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

News November 23, 2024

మెదక్: నర్సింగ్ కళాశాల మంజూరుకు ఉత్తర్వులు జారీ

image

మెదక్ మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల కూడా మంజూరైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా 13 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల స్థాపనకు వైద్య శాఖ పరిపాలన మంజూరు చేసింది. సివిల్ వర్క్స్ నిర్మాణం, పరికరాలు, ఫర్నిచర్ సేకరణకు ఒక్కో కళాశాలకు రూ.26 కోట్లు మంజూరు చేస్తూ TOMSIDCకి అప్పగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ సెక్రటరీ చోంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు.

News November 22, 2024

మెదక్: ‘డేటా ఎంట్రీ పారదర్శకంగా నిర్వహించాలి’

image

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీపై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 91.31% సర్వే పూర్తయిందని తెలిపారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.