India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD OU పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరిస్తున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ కే.శశికాంత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల రెండో సెమిస్టర్ మెయిన్, మొదటి, మూడో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును సంబంధిత కళాశాలల్లో ఈ నెల 25వ తేదీ లోపు చెల్లించాలని అన్నారు. అపరాధ రుసుము రూ.500తో 28వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నేడు జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ తెలిపారు. అండర్-8, 10, 12 విభాగాల్లో బాలబాలికలకు పరుగు పందెం, త్రో, జంప్స్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 9:00లోపు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 99630 05540 నంబరుకు సంప్రదించాలన్నారు.
ఐలాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా గతంలో పనిచేసిన సచిన్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మల్లేష్ అనే వ్యక్తికి ఇంటి నంబర్ ఇచ్చేందుకు రూ.30వేలు డిమాండ్ చేసి, రూ.25 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. 10వేలు తీసుకుంటుండగా వీడియో తీసిన మల్లేష్ సెప్టెంబర్ నెలలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ విచారణలో లంచం తీసుకున్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు.
మెదక్ జిల్లాలో సమగ్ర సర్వే నిన్నటి వరకు 86 శాతం పూర్తయిందని అడిషనల్ కలెక్టర్ మెంచు నగేశ్ తెలిపారు. డేటా ఎంట్రీకోసం 516 మందిఆపరేటర్లను నియమించినట్లు పేర్కొన్నారు. 20 మంది ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు 04, ఎంపీ ఎస్వోలు-19లు ఈ డేటా ఎంట్రీలో పాల్గొంటారన్నారు. సామాజిక ఆర్థిక, విద్య, రాజకీయ కుల సర్వే కంప్యూటర్ ఆపరేటర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో ఎంపికై విధుల్లో చేరబోతున్న 8,047 కానిస్టేబుళ్లకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సోషల్ మీడియా వేదికగా ఈరోజు అభినందనలు తెలిపారు. నీతి, నిజాయతీతో వ్యవహరిస్తూ శాంతి భద్రతలు కాపాడాలని సూచించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఈ పోస్టులను భర్తీ చేశారని, వీటిని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదం అని అన్నారు.
మేనకోడలిపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి మెదక్ జిల్లా కోర్టు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.20వేల జరిమానా విధించింది. SP ఉదయ్ కుమార్ వివరాలు.. మెదక్కు చెందిన ఓ బాలిక తల్లి చనిపోవడంతో అమ్మమ్మతో కలిసి ఉంటోంది. అదే ఇంట్లో ఉంటున్న మేనమామ శ్రీనివాస్(40) బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా నేరం రుజువైంది. దీంతో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాల పీజీ సెంటర్లో మిగిలిన పీజీ సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు ప్రిన్సిపల్ రత్నప్రసాద్ తెలిపారు.దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 20 చివరి తేదీ అని పేర్కొన్నారు. పీజీ వివిధ విభాగాల్లో మిగిలిన సీట్లలో అడ్మిషన్లు పొందేందుకు డిగ్రీ టీసీతో పాటు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెండు ఫొటోలు, ఒక జిరాక్స్ సెట్తో కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
డిల్లీలో తీవ్ర కాలుష్యంతో పాఠశాలలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడిందని, అలాంటి పరిస్థితి తెలంగాణలో రావద్దనే ఈవీ పాలసీ తెచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు X వేదికగా పేర్కొన్నారు. తెలంగాణ ఎలక్ట్రిక్ వాహనాలను విసృతంగా ప్రజలు వాడేలా ఈ పాలసీ ఉందన్నారు. ఈవీ వాహనాలపై రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు 100 శాతం మినహాయింపు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామన్నారు.
కేసీఆర్ అంటే ఒక చరిత్ర అని.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అద్భుతంగా అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. రాత్రి కేసీఆర్ ఫ్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్ధి చూసి హీరో రజనీకాంత్ న్యూయార్క్లో ఉన్నానా.. ఇండియాలో ఉన్నానా అన్నాడన్నారు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా KCR అభివృద్ధి చేశాడన్నారు.
వాహనం అదుపుతప్పి ఒకరు మృతి చెందిన ఘటన పాపన్నపేట మండలంలో జరిగింది. ఏఎస్ఐ సంగన్న తెలిపిన వివరాలు.. కొత్తపల్లి గ్రామానికి చెందిన బైండ్ల జశ్వంత్(19) అదే గ్రామానికి చెందిన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి బైక్పై పాపన్నపేటకు వెళ్లారు. తిరిగి వస్తుండగా యూసుఫ్ పేట గ్రామ శివారులో వాహనం అదుపుతప్పి కింద పడ్డారు. జశ్వంత్ మృతి చెందగా మరోకరికి గాయాలయ్యాయి. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.