India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కౌడిపల్లి మండల పరిధిలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను, పలు రైస్ మిల్లులను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కొనుగోలు పరిశీలించి పలు రికార్డులను తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సిబ్బందికి సూచించారు. రైస్ మిల్లు వద్ద లారీలను వెంటనే దిగుమతి చేసుకొని తిరిగి పంపించాలని సిబ్బందికి సూచించారు.
తెలంగాణ మాజీ డిజిటల్ డైరెక్టర్ కొణతం దిలీప్ను పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చిన దిలీప్ కొణతంను అరెస్టు చేసిన పోలీసులు తెలిపారు. కొణతం దిలీప్ అరెస్టును హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత, ప్రతీకార చర్యలను మానుకోవాలని అన్నారు. దిలీప్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత, ప్రతీకార చర్యలను మానుకోవాలని మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు. ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ.. అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సిగ్గు చేటని, తెలంగాణ ఉద్యమకారుడు కొణతం దిలీప్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నారాయణఖేడ్ మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన రైతుకు చెందిన గేదె రెండు తల దూడకు జన్మనిచ్చింది. అనంతసాగర్ గ్రామానికి చెందిన రైతు సాయిరెడ్డికి చెందిన ఇదే ఆదివారం ఈనింది. ఈతలో రెండు తలలతో కూడిన దూడను జన్మనిచ్చింది. తలభాగం రెండు తలలుగా, వెనక భాగం ఒకే దగ్గర ఆతుక్కొని జన్మించింది. దూడ గంట పాటు బతికే ఉన్న తర్వాత మృతి చెందినట్లు సాయిరెడ్డి తెలిపారు.
ఇందిరా గాంధీ ప్రతిభా పురస్కారం అవార్డుకు జోగిపేటకు చెందిన దీపికా రెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 19న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నారు. తనను ఇందిరా గాంధీ ప్రతిభ పురస్కారానికి ఎంపిక చేసినందుకు ప్రభుత్వానికి దీపికా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
సర్వే చేస్తున్న ఉపాధ్యాయులను కొందరు అధికారులు ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు, స్వేచ్ఛనివ్వాలని పిఆర్టీయూ అసోసియేట్ అధ్యక్షులు ఎల్.మల్లారెడ్డి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కులగణన సర్వేలో ఉపాధ్యాయులు ఎంతో ప్రయాస పడి ఒకవైపు పాఠశాలను, మరొక పక్క సర్వేను సమర్థ వంతంగా నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులతో సమన్వయంగా పని చేయించుకోవాలని సూచించారు.
ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పే వారి మాటలు నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరుగుతుందన్నారు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 11 నెలల్లోనే 7 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేశామని మంత్రి గుర్తు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మెదక్ పట్టణంలో సోమవారం నిర్వహించే ప్రజా పాలన విజయోత్సవాలు-2024 అనివార్య కారణాలవల్ల వాయిదా వేయడం జరిగిందని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం రాత్రి 10 గంటలకు తెలిపారు. తదుపరి కార్యక్రమాల తేదీని త్వరలో తెలియజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ముందుగా సోమవారం సాయంత్రం ఐదు గంటలకు విజయోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
దశాబ్ద కాలం తరువాత రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. మిడ్ మానేరు నిర్వాసితులు 4696 మందికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఇందిరమ్మ పాలనకు నిదర్శనం అన్నారు. దశాబ్ద కాలంగా మిడ్ మానేరు పునరవాసం కింద ఇండ్లను మంజూరు చేయాలని ఎన్నో పోరాటలు, నిరసనలు గతంలో చేశామని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో న్యాయం జరుగుతుందన్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఏం జరుగుతుందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ‘X’ వేదికగా ప్రశ్నించారు. ఐపీ, ఓపి విభాగాలో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని. X-ray తీయించుకోవడానికి 2,3 రోజులు పడిగాపులు పడాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం గాంధీ ఆస్పత్రిలో పరిస్థితి అన్నారు. ఆరోగ్య శాఖ పనితీరు ఇదేనా..? అని X వేదికగా ఎంపీ నిలదీశారు.
Sorry, no posts matched your criteria.