Medak

News May 13, 2024

GREAT.. ఓటు వేయడానికి అమెరికా నుంచి వచ్చాడు..!

image

సిద్దిపేట జిల్లా యువకుడు ఓటు వేయడానికి అమెరికా నుంచి వచ్చాడు. రాయపోలు మండలం వడ్డేపల్లికి చెందిన బచ్చు శ్రావణ్‌ కుమార్‌ ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లాడు. తాజా ఎంపీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకోవాలన్న సంకల్పంతో శనివారం స్వగ్రామానికి వచ్చారు. ‘ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చానని, అన్ని విధాల ఆలోచించి మంచి వారికి ఓటేస్తా’ అని శ్రావణ్ అంటున్నారు.

News May 13, 2024

ఓటింగ్ సమాచారం త్వరితగతిన అందించాలి: కలెక్టర్ రాహుల్

image

పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సమాచారం త్వరితగతిన అందించాలని సిబ్బందికి కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం సిబ్బందితో మాట్లాడుతూ..  పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ శాతం, ఓటర్ల హాజరు సమాచారం త్వరిత గతిన ఉన్నతస్థాయి అధికారులకు అందించాలని, ప్రతి రెండు గంటలకు ఒకసారి ఓటర్ల హాజరు, పోలింగ్ శాతం అందించి పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు.

News May 13, 2024

సిద్దిపేట: ప్రజా సేవకులను ఎన్నుకోండి

image

భారత రాజ్యాంగం మనకు కల్పించిన అమూల్యమైన, అతి ముఖ్యమైన హక్కు “ఓటు”. కుల, మత విభేదాలు లేకుండా ధనిక పేద తేడాలేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడు ఓటు హక్కును కలిగి ఉంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొని నిజమైన ప్రజా సేవకులను నాయకులుగా ఎన్నుకోవాలి.

News May 13, 2024

MDK: కేంద్రాలకు రండి.. ఓటేయండి: కలెక్టర్లు

image

మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఓటర్లందరూ నేడు ఓటేసేందుకు రావాలని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌, సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి, సిద్దిపేట కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి పిలుపునిచ్చారు. ఈసారి ఓటింగ్ శాతం పెంచేలా చర్యలు తీసుకున్నామని, అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఓటర్ల కోసం మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. నిర్భయంగా వచ్చి ఓటేయాలని, యువత చొరవ చూపి అందరూ ఓటేసేలా చూడాలన్నారు.

News May 13, 2024

MDK: ఓటేద్దాం.. ప్రశ్నిద్దాం..!

image

ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు లేదని నానుడి. మనల్ని పాలించే వారిని మనమే ఎన్నుకునేందుకు నేడు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మెదక్ లోక్ సభ స్థానంలో 71.75 శాతం పోలింగ్ నమోదవగా.. జహీరాబాద్ పరిధిలో 69.70 శాతం నమోదైంది. కాగా ఈసారి గతం కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదయ్యేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులు కోరారు.

News May 12, 2024

పిడుగుపాటుతో తాత, మనుమడు మృతి.. కలెక్టర్ రాహుల్‌రాజ్ దిగ్భ్రాంతి

image

మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లి గ్రామంలో పిడుగుపాటుతో తాత, మనుమడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటనపై కలెక్టర్ రాహుల్ రాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వర్షం కురువడంతో వరి ధాన్యంపై కవర్ కప్పేందుకు వెళ్లిన శ్రీరాములు(43), శివరాజ్(విశాల్)(13) పిడుగుపాటుతో చనిపోయిన విషయం తెలిసిందే. కాగా రైతు కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన సాయాన్ని ఈసీ నిబంధనల మేరకు త్వరలో అందిస్తామని చెప్పారు.

News May 12, 2024

పిడుగుపాటుతో తాత, మనుమడు మృతి.. కలెక్టర్ రాహుల్ రాజ్ దిగ్బ్రాంతి

image

మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లి గ్రామంలో పిడుగుపాటుతో తాత, మనుమడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటనపై కలెక్టర్ రాహుల్ రాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వర్షం కురువడంతో వరి ధాన్యంపై కవర్ కప్పేందుకు వెళ్లిన శ్రీరాములు(43), శివరాజ్(విశాల్)(13) పిడుగుపాటుతో చనిపోయిన విషయం తెలిసిందే. కాగా రైతు కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన అన్ని సహాయక సహకారాలను త్వరలో అందిస్తామని చెప్పారు.

News May 12, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓటు వేయనున్న ప్రముఖులు

image

ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేపు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సిద్దిపేట రూరల్ మండలం చింతమడకలో ఉదయం 11 గంటలకు మాజీ సీఎం కేసీఆర్ ఓటు వేయనున్నారు. అలాగే సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మంత్రి దామోదర రాజనర్సింహ, సంగారెడ్డిలో జగ్గారెడ్డి, సిద్దిపేట భరత్ నగర్‌లో మాజీ మంత్రి హరీశ్ రావు, దుబ్బాక మండలం పోతారంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

News May 12, 2024

MBNR: పదండి.. సగర్వంగా ఓటేద్దాం..!

image

ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎన్నికల సంఘం ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఓటరు చైతన్యం కోసం వినూత్న ప్రచారం చేసిన ఈసీ రెండు రోజులుగా మెసేజ్‌లు పంపుతూ ఫోన్లు చేస్తోంది. ‘మీ ఓటు మీ స్వరం. పదండి.. ఈ ఎన్నికల్లో సగర్వంగా ఓటేద్దాం. దేశం కోసం మీ వంతు బాధ్యత మర్చిపోకండి. ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’. పనులుంటే వాయిదా వేసుకోండి. సాకులు చెప్పకుండా వెళ్లి ఓటు వేయండి’ అంటూ సందేశానిస్తుంది.
-GO VOTE.

News May 12, 2024

ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగంచుకోవాలి: కలెక్టర్ క్రాంతి

image

ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఓటు వేసే అవకాశాన్ని వదులుకోవద్దని కోరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.