Medak

News November 17, 2024

మెదక్: రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం ఎన్నిక

image

మెదక్ జిల్లా రిటైర్డ్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా కానుగు రాజశేఖర్ ఎన్నికయ్యారు. ఆదివారం మెదక్ లో ఎన్నికలు నిర్వహించారు. జనరల్ సెక్రెటరీగా విద్యాసాగర్, ట్రెజరర్‌గా రాజు, వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్‌గా జాయింట్ సెక్రటరీలుగా బి. కిషన్, పి అశోక్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా అస్లాం ఖాన్, పోచయ్య, గౌరవాధ్యక్షుడిగా పి. శెట్టయ్య, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా బాలకిషన్, యాదగిరి, అనిల్ ఎన్నికయ్యారు.

News November 17, 2024

ఝరాసంగం: పాము కాటుతో విద్యార్థి మృతి

image

పాముకాటుతో బాలుడు మృతి చెందిన ఘటన ఝరాసంగం మండల మంచునూర్‌లో చోటు చేసుకుంది. గ్రామస్థుల వివరాలు.. ధనసిరి బాబు, మీనా దంపతుల కుమారుడు భాను ప్రసాద్ (12) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. పొలం వద్ద పత్తి చేనులో పాము కాటుకు గురయ్యాడు. జహీరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News November 17, 2024

మెదక్: డబ్బుల విషయంలో గొడవ.. వ్యక్తి హత్య

image

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామంలో డబ్బుల విషయంలో మేస్త్రీల మధ్య గొడవ జరిగి ఒకరు హత్యకు గురయ్యారు. పోలీసుల వివరాలు.. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రమోద్ (40), బిట్టు మేస్త్రిలుగా పనిచేస్తున్నారు. ప్రమోద్ వద్ద పని చేస్తున్న బిట్టు రాత్రి మద్యం తాగిన సమయంలో డబ్బుల విషయంలో గొడవ పడ్డారు. బిట్టు కట్టెతో దాడి చేయగా ప్రమోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

News November 17, 2024

UPDATE: జహీరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

image

జహీరాబాద్‌లోని బైపాస్ వద్ద <<14625689>>రోడ్డు ప్రమాదం<<>>లో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదర్శనగర్ మలుపు వద్ద కారు కల్వర్టును ఢీకొట్టగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో NZB జిల్లా డిచ్పల్లికి చెందిన సురేశ్, కుత్బుల్లాపూర్‌కు చెందిన నరసింహారావు స్పాట్‌లో మృతి చెందారు. తీవ్రగాయాలైన శివకుమార్ సంగారెడ్డిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కర్ణాటకలోని గానుగపూర్‌‌కి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.

News November 17, 2024

MDK: గ్రూప్‌-3 పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

image

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గ్రూప్‌-3 పరీక్ష నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేశారు. MDK జిల్లాలో 5,867 మంది అభ్యర్థులు, 19 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లాలో 13,401 మంది అభ్యర్థులు, 37 కేంద్రాల్లో గ్రూప్-3 పరీక్షకు హాజరుకానున్నారు. సంగారెడ్డి జిల్లాలో 15,123 మంది అభ్యర్థులు 49 పరీక్ష కేంద్రాల్లో హాజరు కానున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేశారు.

News November 16, 2024

గజ్వేల్: ‘రేణుకది ఆత్మహత్య కాదు… హత్యే!’

image

కులాంతర వివాహం చేసుకున్న దళిత యువతి మైసని రేణుకది ఆత్మహత్య కాదని హత్య చేశారనే అనుమానం ఉందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, డిబిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామిలు ఆరోపించారు. రేణుక మరణ విషయం తెలుసుకున్న డీబీఎఫ్ బృందం బాధిత కుటుంబ సభ్యులను శనివారం పరామర్శించారు. రేణుక మృతిపై నిష్పాక్షిక విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

News November 16, 2024

BREAKING.. జహీరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదర్శనగర్ మలుపు వద్ద కారు కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో కుత్బుల్లాపూర్‌కు చెందిన సురేశ్, నరసింహారావు స్పాట్‌లో మృతిచెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మహారాష్ట్రలోని గానుగాపూర్‌ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 16, 2024

సంగారెడ్డి: ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

image

సంగారెడ్డి మండలం కొత్లాపూర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల 9వ తరగతి విద్యార్థిని స్వాతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఇవాళ ఉదయం జరిగింది. వెంటనే స్పందించిన సిబ్బంది సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. విద్యార్థిని మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

News November 16, 2024

వర్గల్: పెళ్లైనా నాలుగు నెలలకే సూసైడ్

image

మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట వర్గల్ మండలానికి చెందిన భాను, మాదారానికి చెందిన రేణుక(22)ను నాలుగు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. కాగా, వీరి మధ్యలో కొన్నిరోజులుగా గొడవలు జరుతున్నాయి. ఈనెల 14న భాను కుటుంబ సభ్యులకు చనిపోతున్నానంటూ సెల్ఫీ వీడియోను పంపిచారు. దీంతో మనస్తాపం చెందిన రేణుక ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. కేసు నమోదైంది.

News November 16, 2024

రామాయంపేట: 6 నెలల్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు

image

రామాయంపేట మండలం కాట్రియల్ గ్రామానికి చెందిన మద్ది రాజాసాబ్ మూడో కుమారుడు  శరత్ కుమార్ 6 నెలల్లోనే 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఎలాంటి కోచింగ్ లేకుండా ఇంటి వద్దే చదువుకొని ఉద్యోగాలు సాధించడంతో పలువురు అభినందించారు. గతంలో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వగా గురువారం వెలువడిన గ్రూప్- 4 ఫలితాల్లో సెలెక్ట్ అయ్యారు.