Medak

News May 12, 2024

మెదక్: ఓటు వేయాలంటే గుర్తింపు కార్డు తీసుకెళ్లాల్సిందే..!

image

పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నందున ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లేటప్పుడు ఓటర్ స్లిప్పుతో పాటు కచ్చితంగా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని జిల్లా అధికారులు సూచిస్తున్నారు. ఓటర్ ఐడి, ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, జాబ్ కార్డ్, ఉపాధి హామీ కార్డ్, పాస్ పోర్ట్, బ్యాంకు, పాస్ బుక్ తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచిస్తున్నారు.

News May 12, 2024

ఎంపీ ఎన్నికలు.. ఆకుపై ఓటు చిత్రం అదుర్స్

image

ఓటు వజ్రాయుధం, ఓటును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని నారాయణఖేడ్‌కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ అన్నారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో అశ్వత్థ పత్రంపై ఓటు సింబల్ గీసి గిశారు. రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని, మన ఓటుతో సుస్థిర, సమర్థవంతమైన భారత దేశాన్ని నిర్మిద్దామని ఆర్టిస్ట్ ఆకాంక్షించారు. ‘మై ఓటు ఈస్ మై ఫ్యూచర్, పవర్ అఫ్ వన్’ ఓటు అని అన్నారు.

News May 12, 2024

మెదక్ జిల్లాలో తీవ్ర విషాదం.. పిడుగుపాటుతో ఇద్దరు మృతి

image

మెదక్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పెద్ద శంకరంపేట మండలం రామోజీపల్లి శివారులో ధాన్యం కుప్పల వద్ద పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు పాలంచ శ్రీ రాములు, విశాల్‌గా గుర్తించారు. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఒక్కసారి వాతావరణ మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు పిడుగు పడింది. దీంతో ఆ ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదం నెలకొంది.

News May 12, 2024

కల్హేర్: దూడను చంపిన చిరుత

image

నాగధర్- సంజీవర్‌రావుపేట్ శివారులో పోలంలో దూడను చిరుత చంపేసింది. రైతు గోపాల్‌రెడ్డి వివరాలిలా.. గోపాల్‌రెడ్డి పొలంలో పశువులను మేపుతున్నారు. భోజనానికి ఇంటికి వెళ్లగా.. చిరుత దాడిచేసి దూడను చంపినట్లు తెలిపారు. ఈ విషయాన్ని అటవీశాఖ, పశువైద్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని నాగదర్ FBO శ్రీకాంత్ సందర్శించి, పంచనామా నిర్వహించారు.

News May 12, 2024

సిద్దిపేట: ‘ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి’

image

లోక్ సభ ఎన్నికల్లో జిల్లాలోని ఓటర్లందరూ తప్పకుండా ఓటు వేసి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఈనెల 13వ తేదీన ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు లోక్ సభ ఎన్నికల పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందన్నారు.

News May 11, 2024

MDK: ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో జరిగింది. స్థానికుల వివరాలు.. చెన్నయిపల్లి గ్రామానికి చెందిన చిన్నోళ్ల శ్రీశైలం(23) ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన శ్రీశైలం గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన  ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 11, 2024

MDK: ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులు తాళలేక యువకుడి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజాంపేట మండల పరిధిలోని నగరం తాండ గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నగరం తండా గ్రామానికి చెందిన కేతావత్ స్వామి అనే వ్యక్తికి ఒక సంవత్సరం క్రితం వివాహం జరిగింది. అతని తాత ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రిలో ఖర్చులు, అతని పెళ్లి ఖర్చులతో అప్పు కావడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

News May 11, 2024

MDK: ముగిసిన ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్, జహీరాబాద్ లోక్ సభ ఎన్నికల ప్రచారం కొన్ని గంటల్లో తెరపడనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం బంద్ చేయాలని ఆయా పార్టీలను ఎలక్షన్ కమిషనర్ ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అటు ప్రధాన పార్టీల అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

News May 11, 2024

MDK: రిజర్వేషన్ల రద్దుకు BJP కుట్ర: CM రేవంత్‌రెడ్డి

image

దేశం సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలనే లక్ష్యంతో బీజేపీ ఈ ఎన్నికల్లో ముందుకెళ్తోందని ఆరోపించారు. రిజర్వేషన్ల రద్దు ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. శనివారం HYD పటాన్‌చెరులో కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. 50 వేల మెజారిటీతో నీలం మధును గెలిపించాలని కోరారు.

News May 11, 2024

MDK: కాసేపట్లో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తెర..!

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో మెదక్, జహీరాబాద్ లోక్ సభ ఎన్నికల ప్రచారం కొన్ని గంటల్లో తెరపడనుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారం బంద్ చేయాలని ఆయా పార్టీలను ఎలక్షన్ కమిషనర్ ఆదేశించింది. దీంతో ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. అటు ప్రధాన పార్టీల అభ్యర్థులు వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు.