Medak

News May 11, 2024

మెదక్: జిల్లాలో 144 సెక్షన్ అమలు

image

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా సా.6 గంటల నుండి 14న 6 గంటల వరకు జిల్లాలో 144 CrPC సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డాక్టర్ బాలస్వామి పేర్కొన్నారు. జిల్లాలో ఎవరు కూడా నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులు గుంపులుగా తిరగవద్దని, జిల్లాలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం ఉంటుందని పేర్కొన్నారు.

News May 11, 2024

MDK: RTC బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి

image

నారాయణఖేడ్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న RTC బస్సులో ఓ వ్యక్తి గుండె పోటుతో మృతి చెందాడు. నాగధర్ గ్రామానికి చెందిన వడ్ల అంజయ్య సికింద్రాబాద్ బస్సు ఎక్కగా.. పెద్ద శంకరంపేట మండల పరిధిలోని కోలపల్లి శివారులో గుండెపోటు రాగా బస్సు సీటులోనే మృతి చెందాడు. డ్రైవర్ బస్సును నిలిపివేసి అధికారులకు సమాచారం ఇచ్చారు.

News May 11, 2024

మెదక్: మరికొన్ని గంటల్లో మూగబోనున్న మైకులు

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఇవాళ సా.6 గం.కు మైకులు మూగబోనున్నాయి. మరో 48 గంటల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. గత 57 రోజుల నుండి ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ప్రధాన పార్టీలైన BRS, కాంగ్రెస్, బిజెపి పార్టీల ముఖ్య నేతలు మెదక్ గడ్డపై తమ పార్టీ జెండా ఎగర వెయ్యాలని ప్రచారం నిర్వహించారు. మరోవైపు సాయంత్రం ప్రచారం ముగియనుండడంతో ప్రలోభాల పర్వం మొదలయ్యే అవకాశం ఉంది.

News May 10, 2024

మాయ మాటలు నమ్మి మోసపోవద్దు: కొండా సురేఖ

image

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటేస్తే ఎంపీలను అమ్ముకుంటారని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ, శాఖ మంత్రి, కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ కొండా సురేఖ విమర్శించారు. సిద్దిపేటలోని ఎన్సాన్ పల్లి, పుల్లూరు, నారాయణరావు పేట గ్రామాల్లో కార్నర్ మీటింగ్‌లో మంత్రి మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌ను ప్రజలు గద్దె దింపినా కూడా మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని బూతులు తిడుతూ రెచ్చగొడుతున్నారని అన్నారు.

News May 10, 2024

రేపు పటాన్ చెరుకు సీఎం రేవంత్ రెడ్డి

image

రేపు పటాన్‌‌‌చెరుకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా పటాన్‌చెరు పట్టణంలో రోడ్ షో నిర్వహించి, అంబేడ్కర్ విగ్రహాం వద్ద కార్నర్ మీటింగ్‌లో మాట్లాడనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్‌ను పటాన్‌చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ రోడ్ షోను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

News May 10, 2024

మెదక్: తుదిదశకు ప్రచారం.. ఓట్ల వేటలో నాయకులు

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపటితో ప్రచారం పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తిరగని ప్రాంతాలను గుర్తించి షెడ్యూల్‌ రూపొందిస్తున్నారు. ముఖ్యంగా మెదక్ స్థానంపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టి గెలుపు కోసం ఇంటింటికి తిరుగుతూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.

News May 10, 2024

72ఏళ్లు మెదక్‌లో ముగ్గురే మహిళా ఎంపీలు

image

అన్నిరంగాల్లో ముందడుగు వేస్తున్న మహిళలు చట్టసభల్లో అతంతగానే రాణిస్తున్నారు. మెదక్ లోక్‌సభ ఏర్పడి 72ఏళ్లు అవుతున్నా ఇక్కడి నుంచి కేవలం ముగ్గురు మహిళలే MPలుగా ఎన్నికయ్యారు. 1967 ఎన్నికల్లో సంగం లక్ష్మీబాయి(కాంగ్రెస్), 1980లో ఇందిరాగాంధీ, 2009లో విజయశాంతి(BRS) గెలిచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. జహీరాబాద్‌ నుంచి ఇప్పటివరకు ఒక్కరూ లేరు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మహిళా ఎమ్మెల్యే సునీతారెడ్డి ఒక్కరే.

News May 10, 2024

మెదక్: 343 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు

image

మెదక్ లోక్ సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లల్లో 343 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. మొత్తం 2,124 పోలింగ్ కేంద్రాలు ఉండగా అందులో 343 పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా తేల్చారు. గజ్వేల్ పరిధిలో అత్యధికంగా 69 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అతి తక్కువ సిద్దిపేటలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అటు ఓటర్లను ఆకట్టుకునేందుకు మొత్తం 30 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.

News May 10, 2024

MDK: ఇందిరమ్మ గెలిచిన చోట రాహుల్‌ జన జాతర

image

ఇందిరాగాంధీ గతంలో గెలిచిన మెదక్‌‌లో ఆమె మనవడు రాహుల్‌గాంధీ నిర్వహించిన జనజాతరకు అపూర్వ స్పందన వచ్చింది. నర్సాపూర్‌ వేదికగా ఆయన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై నిప్పులు చెరిగారు. ఇందిరా విజయాన్ని పునరావృతం చేసే దిశగా ప్రచారం నిర్వహించారు. BJP, BRS పాలనలో అభివృద్ధి దూరమైందని రేవంత్ అన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఢిల్లీలో సైనికుడిలా పనిచేస్తానని రాహుల్ చెప్పారు. దీంతో కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది.

News May 10, 2024

కామారెడ్డిలో చెల్లని కేసీఆర్‌.. రాష్ట్రానికి ఎలా చెల్లుతారు: రఘునందన్‌

image

దేశానికి ప్రధాని మోదీయే శ్రీరామరక్ష అని, దేశంలో 400 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని బీజేపీ మెదక్‌ పార్లమెంట్‌ అభ్యర్థి మాధవనేని రఘునందన్‌రావు ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాకలో తాను చెల్లని రూపాయిని అయితే కామారెడ్డిలో చెల్లని మాజీ సీఎం కేసీఆర్‌ రాష్ట్రానికి ఎలా చెల్లుతారని ప్రశ్నించారు. దుబ్బాక అభివృద్ధి కోసం తాను అహర్నిశలు కృషి చేశానని తెలిపారు. మీరు చేసే ఉడత బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదన్నారు.