Medak

News November 13, 2024

సిద్దిపేట: ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలి

image

వరిధాన్యం కొనుగోలు రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సూచించారు. హైదరాబాద్ సచివాలయం నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లతో ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లు సాఫీగా సాగేలా చూడాలని, సామాజిక, ఆర్థిక, కుల గణనను పూర్తి చేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ మనూచౌదరి, అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు.

News November 13, 2024

మెదక్: భార్య డెలివరీ.. యాక్సిడెంట్‌లో భర్త మృతి

image

మనోహరాబాద్ మండలం దండుపల్లి వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కూచారం గ్రామానికి చెందిన మజ్జతి విజయ్(30) మృతి చెందాడు. సోమవారం అతడి భార్య మౌనిక తూప్రాన్ ఆసుపత్రిలో ప్రసవమైంది. గ్రామానికి చెందిన బోయిని ప్రేమ్ చంద్‌తో కలిసి బైక్ పై వెళ్లి బిడ్డను తిరిగి వస్తుండగా డీసీఎం ఢీకొని విజయ్ మృతి చెందాడు. భార్య డెలివరీ అయి ఆసుపత్రిలో ఉండగా.. అదే ఆసుపత్రి మార్చురీకి భర్త మృతదేహం వెళ్లడం విషాదకరం.

News November 13, 2024

కాళోజీ సేవలను స్మరించుకున్న కేసీఆర్

image

ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్మరించుకున్నారు. మహోన్నతమైన తెలంగాణ అస్తిత్వాన్ని, సాహిత్య సాంస్కృతిక గరిమన ప్రపంచానికి చాటిన గొప్ప కవి అని, కవిగా తన కలాన్ని, గళాన్ని, జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన కాళోజీ కృషి చిరస్మరణీయమని కొనియాడారు.

News November 13, 2024

KCR పాలనలో అవినీతిపై విచారణ జరిపించాలి: TRS

image

మాజీ సీఎం KCR పాలనలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం CBIతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సమితి(TRS) చీఫ్ నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. HYD బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్, కరెంట్ అగ్రిమెంట్, ల్యాండ్ ట్రాన్సఫర్మేషన్‌‌లో KCR రూ.వేల కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. KCR అవినీతి తెలియజేసేందుకు DEC 6 నుంచి భద్రాచలం-చిలుకూరు బాలాజీ టెంపుల్‌కు పాదయాత్ర చేస్తామన్నారు.

News November 13, 2024

సిద్దిపేట: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతిచెందారు. పోలీసుల వివరాలు.. దుబ్బాక మం. రామక్కపేటకు చెందిన పెంబర్తి నవీన్‌(38) కోహెడ PSలో కానిస్టేబుల్. భార్య, పిల్లలతో కలిసి సిద్దిపేటలో ఉంటున్న నవీన్.. మంగళవారం రాత్రి విధులు ముగించుకొని కారులో సిద్దిపేటకు వెళ్తున్నారు. చిన్నకోడూరు మం. ఇబ్రహీంనగర్‌ వద్ద కారును బస్సు ఢీకొట్టడంతో నవీన్ స్పాట్‌లోనే మృతిచెందారు. మృతదేహన్ని పోలీసులు సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు.

News November 13, 2024

మెడికల్ హాల్స్, ఫార్మసీల్లో తనిఖీలు: రాజనర్సింహ

image

నకిలీ మెడిసిన్ తయారు చేసే వారిపై, వాటిని అమ్మేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ (డీసీఏ) అధికారులను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు‌. ఫార్మా ఇండస్ట్రీస్, డ్రగ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్, మెడికల్ హాల్స్, ఫార్మసీలో మరింత విస్తృతంగా తనిఖీలు చేయాలని సూచించారు. ఫార్మా సంస్థలు ఉన్న చోట అదనంగా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లను నియమించాలన్నారు.

News November 13, 2024

సిద్దిపేట: చెరువు, కుంటల సంరక్షణ చర్యలు వేగవంతం చేయాలి: హెచ్ఎండీఏ కమిషనర్

image

చెరువు, కుంటల సంరక్షణ చర్యలు వేగవంతం చేయాలని హెచ్ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ అధికారులకు సూచించారు. హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. హెచ్ఎండీఏ పరిధిలో సర్వే చేసి గుర్తించిన చెరువులు, కుంటల భూవిస్తీర్ణం ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి, ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ పాల్గొన్నారు.

News November 12, 2024

హుస్నాబాద్: మంత్రిని కలిసిన టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లారెడ్డి

image

హుస్నాబాద్‌లో ఈరోజు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఉమ్మడి మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి జగ్గు మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. ప్రైవేట్ పాఠశాలలో నెలకొన్న సమస్యలను తీర్చాలని మంత్రికి విజ్ఞప్తి చేయగా సానుకూలంగా స్పందించారన్నారు. గంగర వేణి రవి, జేరిపోతుల జనార్ధన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

News November 12, 2024

సిద్దిపేట: శతాబ్దాల చరిత్ర గల ఆలయం.. అభివృద్ధి చేస్తే మేలు

image

అక్బర్‌పేట భూంపల్లి మండలంలోని గాజులపల్లి, వీరారెడ్డిపల్లి, జంగాపల్లి శివారులో దాదాపుగా వెయ్యి ఎకరాలను మించిన రాతిబండపై వెలిసిన బండ మల్లన్న ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి సంక్రాంతి రోజున ఎడ్ల బండ్లు కట్టి మల్లన్న ఆలయం చుట్టు భక్తులు ప్రదక్షిణలు చేసి వారి భక్తిని చాటుకుంటారు. ఇంతటి విశిష్టత కలిగిన గుడిని ప్రభుత్వం ఆర్థిక వనరులతో అభివృద్ధి చేయాలని ఇక్కడి ప్రాంత ప్రజల ఆకాంక్షిస్తున్నారు.

News November 12, 2024

వయా జహీరాబాద్.. ముంబై- HYD బుల్లెట్ ట్రైన్

image

ముంబై- హైదరాబాద్ వయా జహీరాబాద్ బుల్లెట్ రైల్వే ప్రాజెక్ట్ కోసం డీపీఆర్(సమగ్ర ప్రాజెక్టు నివేదిక)ను సిద్ధం చేసి రైల్వే మంత్రిత్వశాఖకు సమర్పించినట్లు అధికారులు తెలిపారు. నేషనల్ హై స్పీడ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్) ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును 2051 వరకు పూర్తి చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. కొత్త లైన్ నిర్మాణానికి అధికారులు పలు ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు.