Medak

News May 9, 2024

నేడు నర్సాపూర్ రానున్న రాహుల్ గాంధీ

image

నర్సాపూర్ పట్టణానికి నేడు సాయంత్రం 4 గంటలకు ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సాపూర్లో జరిగే బహిరంగ సభలో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు. నర్సాపూర్ పట్టణ సమీపంలోని వెల్దుర్తి మార్గంలోని ఖాళీ ప్రదేశంలో సభకు ఏర్పాట్లు చేశారు. సభా ఏర్పాట్లను మంత్రి కొండ సురేఖ, ఏఐసీసీ ఇన్‌ఛార్జీ సురేశ్ తదితరులు పరిశీలించారు. భారీగా జనసమీకరణకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేశారు.

News May 9, 2024

“కొకపేటలో భూములు కొనడానికి డబ్బులు ఎక్కడివి “

image

మోదీతోనే దేశం సుభిక్షంగా ఉంటుందని, ప్రజలు కారుకు పంక్చర్ చేయడంతో పాటు కాళేశ్వరంలో ముంచారని మెదక్ ఎంపీ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు బుధవారం వర్గల్ మండల కేంద్రంలో రోడ్ షో అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రజలను వంచించి కోట్లు కొల్లగొట్టారని బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి కొకపేటలో రూ.వంద కోట్లకుపైగా ఖర్చు పెట్టి భూములు కొనడానికి డబ్బు ఎక్కడివని ప్రశ్నించారు.

News May 8, 2024

కామారెడ్డి‌లో ఓడిన కేసీఆర్.. ఎంపీలను ఎలా గెలిపిస్తాడు.?: రఘునందన్ రావు

image

కామారెడ్డిలో ఓడిన మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఎలక్షన్లలో ఏ మొఖం పెట్టుకుని ప్రచారం చేస్తున్నాడని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్‌రావు విమర్శించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రఘునందన్‌రావు మాట్లాడుతూ.. నిన్న కేసీఆర్ దుబ్బాకలో చెల్లని నోటు మెదక్‌లో చెల్లుతుందా అని చేసిన వాక్యలపై ఆయన మండిపడ్డారు. బీజేపీ చేతిలో ఓడిన కేసీఆర్ BRS ఎంపీలను ఎట్లా గెలిపిస్తాడని ప్రశ్నించారు.

News May 8, 2024

సిద్దిపేట: పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు

image

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ అనురాధ తెలిపారు. ఈనెల 13న లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రత్యేక బలగాల అధికారులతో సిద్దిపేట పోలీస్ కమిషనర్ తన కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహన తనిఖీలు చేసే సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News May 8, 2024

దుబ్బాక: ఇంటి గోడలకు నీళ్లు కొడుతుండగా.. కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

image

నూతనంగా నిర్మించుకుంటున్న ఇంటికి నీరు పడుతున్న క్రమంలో కరెంట్ షాక్‌తో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన దుబ్బాక మండలం పెద్దచీకోడ్ గ్రామంలో జరిగింది. దుబ్బాక ఎస్సై గంగరాజు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన రాములు కొత్త ఇళ్లు కట్టుకుంటున్నారు. ఈ క్రమంలో గోడలకు నీళ్లు కొడుతుండగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 8, 2024

మోదీని ఓడించి భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం: ఆకునూరి మురళీ

image

భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోదీని గద్దె దింపుదామని మాజీ ఐఏఎస్ అధికారి, జాగో తెలంగాణ కన్వీనర్ ఆకునూరి మురళీ అన్నారు. ఓటర్ల చైతన్య బస్సు యాత్ర బుధవారం గజ్వేల్ పట్టణానికి చేరుకుంది. ప్రజా సంక్షేమాన్ని, సుస్థిర అభివృద్ధిని గాలికి వదిలి అధికారం కొరకు విద్వేషాలు రెచ్చగొడుతూ, సమాజాన్ని విచ్చిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్న మోదీని ఓడించాలన్నారు.

News May 8, 2024

సంగారెడ్డి: ఇద్దరు పిల్లలతో వివాహిత అదృశ్యం

image

ఆసుపత్రికి వెళుతున్నానని చెప్పి ఓ వివాహిత ఇద్దరు పిల్లలతో అదృశ్యమైన ఘటన BDL పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బిహార్‌కు చెందిన వివాహిత, భర్త, మూడేళ్ల కుమారుడు, ఏడాది వయసున్న కుమార్తెతో కలిసి పటాన్ చెరు మండలం పాటి గ్రామంలో ఉంటున్నారు. ఈనెల 2న ఆసుపత్రికి అని ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లి తిరిగి రాలేదు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదైంది.

News May 8, 2024

దుబ్బాకలో చెల్లని నోటు.. మెదక్‌ పార్లమెంట్‌లో చెల్లుతదా: కేసీఆర్‌

image

వెంకట్రామిరెడ్డికి మద్దతుగా మెదక్‌లో KCR రోడ్‌షో ఆ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజం నింపింది. మెదక్‌ జిల్లా, ప్రభుత్వ వైద్యకళాశాల, రామాయంపేట రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటును గుర్తుచేసిన KCR.. కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్త హామీలు ఇవ్వకపోగా BRS మంజూరు చేసిన వాటిని రద్దు చేస్తోందని విమర్శించారు. ‘BJP అభ్యర్థి రఘునందన్ మాట్లాడేవన్ని అబద్ధాలే. దుబ్బాకలో చెల్లని నోటు మెదక్‌లో చెల్లుతదా’ అని ప్రశ్నించారు.

News May 8, 2024

ఆందోల్: పిడుగుపాటుతో వ్యక్తి మృతి

image

పిడుగు పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆందోల్ మండలం ఎర్రారం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థుల సమాచారం.. గ్రామానికి చెందిన బోయిని పాపయ్య(50) గ్రామ శివారులో పశువులను మేపుతున్నారు. సాయంత్రం తిరిగి వస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో పిడుగు పడటంతో పాపయయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.

News May 8, 2024

మెదక్ : రైతులు జాగ్రత్తలు వహించాలి: అదనపు కలెక్టర్

image

రానున్న 3 రోజుల అకాల వర్షాలు ఉన్నాయన్న నేపథ్యంలో రైతులు ధాన్యం రాశులు తడవకుండా భద్రపరచాలని మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా రైతులు టార్ఫాలిన్లతో కప్పి ఉంచాలన్నారు. అనంతరం పీపీసీ కేంద్రాల ఇన్‌ఛార్జ్‌లకు, రైతులకు ధాన్యం తడవకుండా చేపట్టాల్సిన చర్యలపై పలుసూచనలు చేశారు.