India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రేగోడు మండలం పట్టిపొలం తాండాకు చెందిన నేనావత్ వెంకట్(19) అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఉప్పల్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వెంకట్ దసరా సెలవులకు ఇంటికి వచ్చి గత నెల 13న రూ.10 వేలు తీసుకొని కళాశాలకు వెళ్ళాడు. దసరా నుంచి కళాశాలకు రాలేదని ప్రిన్సిపల్ 6న ఫోను చేసి సమాచారమిచ్చాడు. వెంకట్ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుండడంతో తండ్రి చందర్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వృద్ధులకు రూ.4,000 వికలాంగులకు రూ.6,000 పెన్షన్ పెంచుతాననని గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు ఇంకెప్పుడు పెంచుతావని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. 11నెలల పరిపాలనలో పేదవాళ్లకు ఒక్క ఇల్లు అయినా కట్టించావా అని నిలదీశారు. CM చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదన్నారు.
రాయికోడ్ మండలం మార్టూరు గ్రామంలో రూ. 250 కోట్ల వ్యయంతో నిర్మించిన గోదావరి గంగా ఆగ్రో ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ చక్కర ఫ్యాక్టరీని మంత్రి దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. చక్కర కార్మాగారం ప్రారంభంతో ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎంపీ సురేశ్ షెట్కార్, గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ అంజయ్య, ఏఎంసీ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి, ఆర్డిఓ రాంరెడ్డి పాల్గొన్నారు.
వృద్ధులకు రూ.4,000 వికలాంగులకు రూ.6,000 పెన్షన్ పెంచుతాననని గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు ఇంకెప్పుడు పెంచుతావని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. 11నెలల పరిపాలనలో పేదవాళ్లకు ఒక్క ఇల్లు అయినా కట్టించావా అని నిలదీశారు. CM చెప్పే మాటలకు చేసే పనులకు పొంతనే లేదన్నారు.
మెదక్ డీఈవో కార్యాలయంలో డిఈవో రాధా కిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. వితౌట్ ప్రిపరేషన్ టీచర్స్ పాఠ్యాంశాలు బోధించడం, ప్లాన్ ప్రకారం తరగతిలో టీచర్లు బోధించే విధంగా కృషి చేయాలని నిర్దేశం చేశారు. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో అందరు విద్యార్థులు, ముఖ్యంగా స్లో లెర్నర్లు పాల్గొనే విధంగా చూడాలని తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ, కేజీబీవీ, ఆదర్శ, గురుకుల, ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 18లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఇతర వివరాలకు సంబంధిత పాఠశాలలోని ప్రధానోపాద్యాయులు సంప్రదించాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని నువ్వు.. సీఎం స్థాయి దిగజారి మాట్లాడుతున్నావ్ అంటూ రేవంత్ రెడ్డిపై హరీశ్రావు నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ.. సుమతీ శతకానికి సంబంధించిన పద్యాన్ని హరీశ్రావు ట్వీట్ చేశారు.
ప్రయాణికుల సౌకర్యార్థం సమయానికి బస్సులు నడపాలని మెదక్ రీజినల్ మేనేజర్ ప్రభు లత అన్నారు. శుక్రవారం ఖేడ్ ఆర్టీసీ డిపోను ఆమె సందర్శించి తనిఖీ చేశారు. డిపో మేనేజర్ మల్లేశం, అసిస్టెంట్ మేనేజర్ నరసింహులతో సమావేశమై డిపో ఆదాయం వివరాలపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈనెల 13న అరుణాచలం ప్రత్యేక సూపర్ డీలక్స్ బస్సులు నడపాలని DMకు సూచించారు. ఇందులో ఆఫీస్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు లింగయ్య, భూపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అరెస్టులను ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. హౌస్ అరెస్టులు చేసి చేపట్టే పాదయాత్రకు ప్రజల నుంచి మద్దతు లభించదన్నారు. మూసీ మురికికి 50ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణం కాదా అని ప్రశ్నించారు. పాదయాత్రకు ప్రజల మద్దతు ఉంటే అక్రమ అరెస్టులెందుకుని.. దమ్ముంటే పేదల ఇళ్లు కూల్చిన హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు లింగయ్య, భూపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి అరెస్టులను ఎమ్మెల్యే హరీశ్ రావు ఖండించారు. హౌస్ అరెస్టులు చేసి చేపట్టే పాదయాత్రకు ప్రజల నుంచి మద్దతు లభించదన్నారు. మూసీ మురికికి 50ఏళ్ల కాంగ్రెస్ పాలన కారణం కాదా అని ప్రశ్నించారు. పాదయాత్రకు ప్రజల మద్దతు ఉంటే అక్రమ అరెస్టులెందుకుని.. దమ్ముంటే పేదల ఇళ్లు కూల్చిన హైదరాబాద్ నుంచి పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు.
Sorry, no posts matched your criteria.