India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఇంటర్ బోర్డు ప్రకటించిందని సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందరామ్ తెలిపారు. ఈనెల 6 నుంచి 26 వరకు ఫీజులు చెల్లించేందుకు అవకాశం ఉందిని, రూ.1000 అపరాద రుసుంతో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4 వరకు చెల్లించవచ్చు పేర్కొన్నారు. ఫస్టియర్, సెకెండియర్ జనరల్ విద్యార్థులు రూ.520, ఒకేషనల్ విద్యార్థులు రూ.750 చెల్లించాలన్నారు.
విద్యార్థులకు అన్ని చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ రత్న ప్రసాద్, అధ్యాపకులు పాల్గొన్నారు.
మునిపల్లి మండలం బుదేరా సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల ప్రిన్సిపల్ అర్చన(36) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బుధవారం రోడ్డు ప్రమాదానికి గురైన అర్చనకు గుండెపోటు వచ్చింది. వెంటనే లింగంపల్లిలోని ప్రైవేట్ చికిత్సకి తరలిచంగా చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. ఆమె స్వస్థలం HYD మలక్ పేటలోని అజంతా కాలనీ. అర్చన భర్త ప్రవీణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్ఐ రాజేష్ నాయక్ తెలిపారు.
బీజేపీ తెలంగాణ సంస్థాగత ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలను సిద్ధం చేయడానికి కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన సికింద్రాబాద్ రాజరాజేశ్వరి గార్డెన్స్లో గురువారం సంస్థాగత ఎన్నికల పర్వం-2024 రాష్ట్రస్థాయి కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు గోదావరి అంజిరెడ్డి, బీజేపీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న డీఎస్సీ-2008 సెలెక్టెడ్ అభ్యర్థుల కల నెరవేరబోతోంది. వీరిని కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సెప్టెంబర్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 292 మంది సెలెక్టెడ్ లిస్టులో ఉన్నప్పటికీ 180 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరయ్యారు. వెరిఫికేషన్ ఫైనలైజేషన్ రేపటిలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
మెదక్ జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. వివరాలిలా.. కాగజ్ నగర్, మద్దూరుకు చెందిన రాములు(43), నర్సింహులు(32) రాయరావు చెరువు కల్వర్టులో పడి మృతి చెందగా.. వర్గల్లో విధులు ముగించుకుని వస్తున్న కిషన్ గౌడ్(35) చెట్టుకు ఢీకొని మృతి చెందాడు. తూప్రాన్కు చెందిన దేవయ్య(62) టిప్పర్ ఢీకొని మృతి చెందగా, శివ్వంపేటలో నిలిపిన లారీని ఢీకొని నర్సాపూర్కి చెందిన శ్రీనివాస్(42) మరణించాడు.
కులగణన తర్వాత గ్రామ పంచాయతీ జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం 2,3 నెలలు పట్టనుండగా గ్రామాల్లో ఆశావహులు అప్పుడే ఎన్నికల సన్నాహాల్లో మునిగి తేలుతున్నారు. కులాలు, కాలనీల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాల్లో గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఫోన్లు చేసి మామ, బాబాయ్, అల్లుడు అంటూ వరుసలు కలుపుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు.
బ్యూటీ పార్లర్ ఉచిత శిక్షణ కోసం సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలు దరఖాస్తు చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ బుధవారం తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లలోపు మహిళలు అర్హులని చెప్పారు. బైపాస్ రహదారిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని చెప్పారు.
ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ఇండ్ల వద్దకు వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఆందోల్- జోగిపేట మున్సిపాలిటీ పరిది పోచమ్మగల్లి, ముదిరాజ్ గల్లిలో సర్వేను మంత్రి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వేకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సర్వేలో సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.
మెదక్ జిల్లాలో ఓ మహిళా ఉపాధ్యాయురాలిపై వేధింపులకు పాల్పడ్డ కానిస్టేబుల్పై కేసు నమోదైంది. నర్సాపూర్ పోలీసులు తెలిపిన వివరాలు.. మెదక్ సీసీఎస్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాము కొంత కాలంగా ఓ ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తున్నాడు. నిన్న రాత్రి సైతం ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టారని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో రాముపై 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.