India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బైక్ బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన నర్సాపూర్లో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలా శివారులోని రాయరావు చెరువు కట్ట కాల్వలో బైక్ బోల్తా పడి మంగళవారం రాత్రి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదయం మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతులు కాగజ్ మద్దూర్ గ్రామానికి చెందిన రాములు, వ్యాపారి నరసింహులుగా గుర్తించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టనుంది. ప్రతి ఇంటికి వెళ్లి 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది సర్వే చేయనున్నారు. కుటుంబ యజమాని, సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు, వారు చేసే పని, తీసుకున్న రుణాలు, ఆస్తులు వంటి వివరాలను నమోదు చేసి సర్వే పూర్తయిన ఇంటికి స్టిక్కర్ వెయ్యనున్నారు. ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు కుకునూరుపల్లి మండలంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన 7వ తరగతి విద్యార్థి ఎండి అబ్దుల్ రహమాన్ ఎంపికయ్యారు. హుస్నాబాద్లో జరిగిన ఎస్జీఎఫ్ ఉమ్మడి మెదక్ జిల్లా హ్యాండ్ బాల్ అండర్-14 విభాగంలో జిల్లాస్థాయిలో సత్తా చాటి, రాష్ట్రస్థాయికి ఎంపిక అయ్యారు. ఈ సందర్భంగా ఎంఈఓ బచ్చల సత్తయ్య, పీడీ రాజ్ కుమార్ విద్యార్థి అబ్దుల్ రెహ్మాన్ను అభినందించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి సర్వే రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 56 ప్రధాన, 19 అనుబంధం కలిపి మొత్తం 75 ప్రశ్నలుంటాయి. ఆధార్ కార్డులు, రైతులయితే అదనంగా ధరణి పాసుపుస్తకాలు, రేషన్ కార్డు, ఇంటి పన్ను దగ్గర పెట్టుకుంటే ఎన్యూమరేటర్లు వచ్చినపుడు సర్వే సులువుగా పూర్తవుతుంది. సర్వే సందర్భంగా ఎలాంటి ఫొటోలూ తీయరు. పత్రాలు తీసుకోరు. ఇచ్చిన సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.
పటాన్చెరులోని ఐడీఏ బొల్లారం PS పరిధిలో <<14531325>>ఇంటర్ విద్యార్థిని<<>> ఉరివేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. వరంగల్ జిల్లా ఐనవోలుకు చెందిన విద్యార్థిని(16) బొల్లారంలోని నారాయణ కాలేజీలో ఫస్టియర్ చేస్తుంది. సోమవారం స్టడీ హవర్కు రాలేదని వెళ్లి చూడగా సెకండ్ఫ్లోర్లోని హాస్టల్లో ఉరేసుకొని కనిపించింది. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయిందని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
దుబ్బాక మండలం పెద్ద చీకొడు గ్రామంలో ఘోర ప్రమాదం జరిగింది. కమ్మర్పల్లి గ్రామానికి చెందిన పిల్లలతో దుబ్బాకకు వెళ్తున్న ఆటో చికోడు వద్ద చెట్టుకు ఢీ కొట్టింది. ప్రమాదంలో పది మంది విద్యార్థులకు గాయాలు కాగా దుబ్బాక ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని సిద్దిపేట ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. కాగా ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సింది.
సిద్దిపేట జిల్లాకు చెందిన వేముల యశస్విని కమర్షియల్ పైలట్గా ఎంపికైంది. గజ్వేల్ మండలం దాచారం గ్రామానికి చెందిన వేముల మురళీ-వసుంధర దంపతుల కుమార్తె యశస్విని ఇటీవల మహారాష్ట్రలోని పూణేలో శిక్షణను పూర్తి చేసుకుంది. అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఇండిగో ఎయిర్ లైన్స్లో పైలెట్గా ఎంపికైంది. దీంతో కుటుంబీకులు, గ్రామస్థులు ఆమెను అభిందించారు.
–
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. రైస్ మిల్లర్స్ అండర్ టేకింగ్ త్వరితగతిన అందజేయాలని సూచించారు. కొనుగోలు సమస్యలతో రైతులు రోడ్లమీదకు రావద్దన్నారు. సోమవారం మెదక్లో ధాన్యం కొనుగోలు, మిల్లర్స్ అండర్ టేకింగ్, డిఫాల్ట్ మిల్లుల సమస్యలపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు పరిధిలోని ఐడీఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని వైష్ణవి హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెప్పారు. దీంతో కళాశాల యాజమాన్యం అప్రమత్తమై విద్యార్థిని మృతదేహాన్ని బాచుపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మాజీ సర్పంచ్ల అరెస్టులను, అక్రమ నిర్బంధాలను మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్కు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికమని అన్నారు.
Sorry, no posts matched your criteria.