India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం రాత్రి మెదక్ పట్టణంలో నిర్వహించే ర్యాలీ, స్ట్రీట్ కార్నర్ మీటింగ్లో పాల్గొంటారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. మాజీమంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు, మెదక్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం.పద్మదేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, శశిధర్ రెడ్డిలు పాల్గొంటారు.
సిద్దిపేట వన్ టౌన్ సిఐ లక్ష్మీబాబు తన సిబ్బందితో కలిసి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆకస్మిక వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టణానికి చెందిన యం.రమేష్ తన మోటార్ సైకిల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకొని వెళుతున్న రూ.8,62,000/- సీజ్ చేశారు. చౌడారం గ్రామానికి చెందిన రాములు తన వాహనంలో ఎలాంటి ఆధారాలు లేకుండా రూ.6 లక్షలు తీసుకువెళ్తుండగా వాటిని సీజ్ చేసినట్లు సీఐ లక్ష్మీబాబు తెలిపారు.
మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతన శెట్టిపల్లి గ్రామశివారులోని మంజీరానది నీటికుంటలో పడి సోమవారం బాలుడు మృతిచెందారు. కోడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామానికి చెందిన ఒక కుటుంబం నీటికుంటలో స్నానం చేసేందుకు దిగారు. ఈ క్రమంలో దుర్గేష్ (16) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికలు ఈనెల 13న జరగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని వినూత్నంగా ప్రచారం చేపట్టారు. ఇన్విటేషన్ రూపంలో ముద్రించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇన్విటేషన్ పేరుతో ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ పేరుతో ముద్రించారు. ప్రస్తుతం ఆకర్షణగా మారి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.
మెదక్ జిల్లా నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు జన జాతర సభ నిర్వహించనున్నారు. ఈ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించనున్నారు. రేపు నర్సాపూర్లో జరగనున్న ఏఐసీసీ నేత ప్రియాంక గాంధీ పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జన జాతర సభను నిర్వహించనున్నారు. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరలు అన్ని విపరీతంగా పెరిగిపోయాయని, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీమంత్రి హరీష్ రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డితో కలిసి మిరుదొడ్డిలో రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. కాంగ్రెస్ తులం బంగారం హామీ ఇవ్వడం ఏమో కానీ తూలం బంగారంకు రూ.20 వేల ధర పెరిగిందని ఎద్దేవా చేశారు. నిత్యావస ధరలు పెరిగాయి అన్నారు.
MP ఎన్నికల ప్రచారానికి గడువు మరో వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో రాజకీయ పార్టీలు ప్రచార వేగాన్ని పెంచాయి. తీవ్ర ఎండలోనూ నాయకులు పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలువురు అగ్రనేతలు పర్యటించి క్యాడర్లో జోష్ నింపారు. అటూ ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగులతో హోరెత్తిస్తున్నాయి. బలమైన వర్గాలే లక్ష్యంగా హామీలు గుప్పిస్తున్నారు. దీంతో MDK, ZHB పార్లమెంట్లో రాజకీయం వేడెక్కింది.
సిద్దిపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు BRS నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారంటీల హామీ విఫలమైందన్నారు. ఆరు గ్యారంటీల అమలు చేయనందుకు గానూ రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణ చెప్పాలని అన్నారు. క్షమాపణ చెప్పిన తర్వాతే తెలంగాణ ప్రజలను ఓట్లు అడగాలని అన్నారు.
ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో BRS నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చేందుకే ప్రాధాన్యం ఇస్తుందన్నారు. బీజేపీతో పేదలకు ఒరిగిందేమీ లేదని, వారు అధికారంలోకి వస్తే దేశాన్ని అమ్మడం ఖాయమని విమర్శించారు.
ఎంపీ ఎన్నికల నేపథ్యంలో షోషల్ మీడియాపై సిద్దిపేట కమిషనరేట్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. సిద్దిపేటలో హోం మంత్రి అమిత్ షా, బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై ఫేక్ ప్రచారం నేపథ్యంలో ప్రత్యేక దృష్టిసారించారు. ఈ టీం పార్టీల నేతలు, కార్యకర్తలు చేసే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, X,యూట్యూబ్, రీల్స్ వీడియోలు, పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఫిర్యాదు చేస్తే చర్యలకు సన్నద్ధమవుతున్నారు.
Sorry, no posts matched your criteria.