Medak

News May 5, 2024

పటాన్‌చెరు: అనుమానాస్పదంగా శిశువు మృతి

image

45 రోజుల ఆడశిశువు మృతి చెందింది. పటాన్‌చెరు SI వెంకట్ వివరాలు.. మహరాష్ట్రకు చెందిన జ్ఞానేశ్వర్, స్వప్న దంపతులు ఉపాధి కోసం ఇస్నాపూర్‌ వచ్చారు. పనిమీద జ్ఞానేశ్వర్ సొంతూరు వెళ్లాడు. శనివారం రాత్రి పాలు తాగి పడుకున్న పాప తెల్లారేసరికే చలనం లేకుండా పడిఉంది. పాపను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. తండ్రి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.

News May 5, 2024

MDK: రికార్డ్.. 44.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత

image

మెతుకు సీమ భగ భగమంటోంది. రోజురోజుకు భానుడు తాపానికి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో జనం జలు హడలిపోతున్నారు. రేగోడ్‌లో శనివారం రికార్డు స్థాయిలో 45.1 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 4 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 10 రోజులుగా ఎండ పెరుగుతూ వచ్చింది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిన్న వడదెబ్బతో ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే.

News May 5, 2024

గజ్వేల్: పడిపోయిన చెట్టు.. రూ.10వేల జరిమానా

image

గజ్వేల్ పట్టణంలో బైక్ మెకానిక్ షాపు ముందున్న చెట్టు వద్ద మంట పెట్టడంతో చెట్టు మొదలు కాలి పడిపోయింది. దీంతో సదరు వ్యక్తికి మున్సిపల్ సిబ్బంది రూ.10000 జరిమానా విధించారు. చెట్టు పోయిన చోటనే వేరే మొక్కను పెట్టించారు. ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లును కొట్టివేస్తే వారిపై చర్యలు తీసుకోబడునని కమిషనర్ గోల్కొండ నర్సయ్య హెచ్చరించారు.

News May 4, 2024

మెదక్: తటస్థ ఓటర్లకు పార్టీల గాలం..!

image

పార్లమెంటు ఎన్నికల్లో తటస్థ ఓటర్లు కీలకంగా మారారు. దీంతో వీరి ఓట్లను చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తూ ఓటర్లకు గాలం వేసే పనిలో ఉన్నారు. గ్రామాల్లో ఏ పార్టీ వారు ఎంతమంది ఉన్నారు? తటస్తులు ఎంతమంది? అన్న కోణంలో ప్రధాన పార్టీలు ప్రత్యేక బృందాలతో సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రధానంగా మెదక్ పార్లమెంట్ పరిధిలోని పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న  వారిపై దృష్టిసారించారు.

News May 4, 2024

నాడు ప్రామిసరీ నోట్లు.. నేడు గాడ్ ప్రామిస్‌లు: హరీశ్ రావు

image

మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, బీజేపీలను ఎంపీ ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని మాజీ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. అక్బర్ పేట భూంపల్లిలో జరిగిన కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తూ.. అసెంబ్లీ ఎన్నికల్లో నాడు ప్రామిసరీ నోట్లు రాసిచ్చి.. నేడు గాడ్ ప్రామిస్‌లు చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.

News May 4, 2024

రాయికోడ్: నీటికుంటలో వ్యక్తి మృతదేహం

image

సంగారెడ్డి జిల్లా రాయికోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శిరూరు గ్రామ శివారులోని రైల్వే బ్రిడ్జి వద్ద నీటి కుంటలో వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. సుమారు 35 ఏళ్ల వయసు గల వ్యక్తి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు బ్లాక్ కలర్ ప్యాంట్, వైట్ కలర్ షర్ట్ ధరించారని, మృతుడిని ఎవరైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాలన్నారు.

News May 4, 2024

ఓయూలో ఈనెల 16 నుంచి డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు

image

ఓయూ పరిధిలో మే 16 నుంచి డిగ్రీ వన్ టైమ్ ఛాన్స్ పరీక్షలు ప్రారంభంకానున్నట్లు కంట్రోలర్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, ఇతర డిగ్రీ కోర్సులు చదివి ఫెయిలైన పూర్వ విద్యార్థులకు పరీక్ష రాసుకునేందుకు ఒక్క అవకాశం ఇచ్చిన విషయం విదితమే. వన్ టైమ్ ఛాన్స్ పరీక్షకు 15 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. వచ్చే వారం నుంచి హాల్ టికెట్లు జారీ చేయనున్నట్లు కంట్రోలర్ చెప్పారు. SHARE IT

News May 4, 2024

వర్గల్: పెళ్లి ఇష్టం లేక యువతి ఆత్మహత్య

image

వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన మౌనిక (21) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. వేలూరు గ్రామానికి చెందిన మల్లేశం కూతురు మౌనిక టైలరింగ్ చేస్తుంది. గత నెల 27న మౌనికకు పెళ్లి చూపులు నిర్వహించారు. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పురుగుల మందు సేవించింది. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

News May 4, 2024

సిద్దిపేట: ఉద్యోగం పేరుతో యువతికి రూ16.45 లక్షలు టోకరా

image

ఓ యువకుడు ఆన్‌లైన్ ద్వారా యువతిని మోసం చేసి జైలు పాలయ్యాడు. చిత్తూరు జిల్లా పెద్దపంజాణి గ్రామానికి చెందిన అరవింద్ సిద్దిపేట‌కు చెందిన ఓ యువతిని ఉద్యోగం పేరుతో మోసం చేశాడు. ఆమె నుంచి రూ.16,75,750ల నగదును ఆన్‌లైన్ ద్వారా తీసుకున్నాడు. అనంతరం ఫోను ఆఫ్ చేయడంతో మోసపోయానని గ్రహించిన యువతి సిద్దిపేట పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు విచారణ చేపట్టి అరవింద్‌ను అరెస్ట్ చేశారు.

News May 4, 2024

తూప్రాన్: తల్లి, ముగ్గురు పిల్లలు MISSING

image

తూప్రాన్ పట్టణంలో నివాసముండే కిష్టాపూర్‌కు చెందిన వడ్ల పవన్ భార్య అర్చన (27), ముగ్గురు పిల్లలు కార్తీక్(10), ఈశ్వర్(4), అక్షయ(6) అదృశ్యమైనట్లు ఎస్ఐ శివానందం తెలిపారు. 13ఏళ్ల క్రితం యాదాద్రి జిల్లాకు చెందిన అర్చనను పవన్ ప్రేమ వివాహం చేసుకోగా.. తూప్రాన్‌లో ఉంటున్నారు. కిష్టాపూర్‌లో తల్లిదండ్రుల వద్ద గల మరో ఇంట్లో ఉండేందుకు నిర్ణయించడంతో గొడవ చేసింది. నిన్న ఇంట్లోంచి వెళ్లి కనిపించకుండా పోయింది.