India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మళ్లీ పెళ్లి సందడి షురూ అయ్యింది. ఆగస్టు చివర వారం వరకు పెళ్లి ముహూర్తాలు ఉండగా.. ఆ తర్వాత నుంచి వివాహానికి అనువైన శుభ ఘడియాలు రాలేదు. నవంబర్లో 3,7,8,9,10,13,14,15,16,17, డిసెంబర్లో 5,6,7,8,9,11,13, 14,15,18, 26 తేదీల్లో పెళ్లికి ఈ రెండు నెలల్లో 21 రోజులు మంచి ఘడియలు ఉన్నట్టు పురోహితులు తెలిపారు. ఇప్పటికే పెళ్లిళ్ల కోసం ఫంక్షన్హాళ్లు బుకింగ్లు మొదలయ్యాయి.
డా.బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ (CBCS) నూతనంగా అడ్మిషన్ గడువు పొడిగించినట్లు సిద్దిపేట అంబేడ్కర్ రీజినల్ కో-ఆర్డినేటర్ డాక్టర్ ఏం శ్రద్ధానందం తెలిపారు. ఈ నెల 15వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా అడ్మిషన్ పొందవచ్చు అన్నారు. https://www.braouonline.in వెబ్సైట్లో అడ్మిషన్ పొందవచ్చు అన్నారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ పాఠశాల హాస్టల్లో సాత్విక్(12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలుడి శరీరంలో పటు చోట్ల గాయాలున్నాయి. కాగా, హాస్టల్ బెడ్పై నుంచి పడి చనిపోయి ఉంటాడని పాఠశాల యాజమాన్యం చెబుతున్నారు. మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నారు.
సంగారెడ్డి వీఆర్ ఉన్న ఎస్సై వినయ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి రూరల్ ఎస్సైగా వినయ్ కుమార్ పనిచేస్తున్న సమయంలో అక్రమ ఇసుక రవాణా అరికట్టడంలో సక్రమంగా విధులు నిర్వహించ లేదని వీఆర్కు బదిలీ చేశారు. కాగా, ఈరోజు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
గంజాయి స్మగ్లర్లకు సహకరించిన పటాన్చెరు ఎస్సై అంబరియా, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ మారుతి నాయక్, ఏఆర్ కానిస్టేబుల్ మధును సస్పెండ్ చేస్తూ ఐజీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. మనూరు ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో సనాత్పూర్, నిజామాబాద్ జిల్లా వర్ని వద్ద గంజాయి పట్టుకొని నిందితులను వదిలిపెట్టారు. నిందితులు మరోసారి పట్టు పడడంతో విషయం బయటపడింది. ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదుకు పరిశీలిస్తున్నట్లు వివరించారు.
డీఎస్సీలో ఎంపిక కాలేదని నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI కృష్ణారెడ్డి వివరాలు.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన సోము శంకర్(33) పీజీ వరకు చదువుకున్నాడు. ఇటీవల DSC రాయగా ఎంపిక కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దీపావళి పురస్కరించుకొని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ కుమార్తెలు రంగురంగుల పూలతో అలంకరించిన దీప కాంతులు వెలిగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రజలకు ఆనందం, శాంతి, విజయాలతో నిండిన సంతోషకరమైన సమయాన్ని గడపాలని ఆకాంక్షించారు.
కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 2 నుంచి ఏడుపాయలలో వనదుర్గమాత ఆలయం వద్ద ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి సామూహిక దీపోత్సవం జరుగుతుందని ఈఓ చంద్రశేఖర్ రావు తెలిపారు. మట్టి ప్రమిదలు దేవస్థానం నుంచి ఉచితంగా ఇవ్వబడుతుందన్నారు. ఈ నెల 15న సాయంత్రం 6 గంటలకు దీపోత్సవం, పల్లకి సేవ ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు సాయంత్రం దీపాలు వెలిగించడం జరుగుతుందన్నారు.
బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు తెలిపారు. వికారాబాద్ జిల్లా జీవంగి గ్రామానికి చెందిన వినీల్ 7 నెలల క్రితం ఇన్స్టాలో న్యాల్కల్ మండలం రాఘవపూర్ చెందిన ఓ బాలిక(15)తో పరిచయం ఏర్పడింది. బాలిక గ్రామానికి వచ్చి, ఊరి శివారులో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదుతో యువకుడిని అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదయిందన్నారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 2న ఉమ్మడి జిల్లా క్రికెట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ అమూల్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిన్నారం టీటీడబ్ల్ఆర్ఎస్ పాఠశాలలో అండర్ 17 బాలుల క్రికెట్ ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఉ.9 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 6281440401,9505796688 నంబర్లను సంప్రదించాలని కోరారు.
Sorry, no posts matched your criteria.