India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

యువతిని అడవిలో వదిలి వెళ్లిన ఘటన ములుగు మండలం వంటిమామిడి అడవిలో జరిగింది. పోలీసుల వివరాలు.. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న విక్రమ్ మన్వర్ రబియాను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. HYDలో ఉంటున్న విక్రమ్ పేరెంట్స్ వద్దకు రాగా శనివారం ఇద్దరి మధ్య గొడవ జరగ్గా రబియా మాత్రలు మింగింది. ఆమెను విక్రమ్ తీసుకొచ్చి అడవిలో వదిలి వెళ్లాడు. స్థానికుల సమాచారంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటంతో ప్రజలు వణుకుతున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 7.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా.. మెదక్ జిల్లా శివంపేటలో 8.2, సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్లో 9.9 డిగ్రీలు నమోదైంది. జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలికి తోడు మంచు కమ్మేయడంతో ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని వైద్యులు అంటున్నారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడానికి ప్రభుత్వం 40% మెస్, 200 శాతం కాస్మొటిక్ చార్జీలు పెంచినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. భూపాలపల్లి జిల్లా గాంధీనగర్లోని మహాత్మ జ్యోతిబాపూలే హాస్టల్లో నూతన డైట్ మెనూ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని తెలిపారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో గ్రూప్-2 పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సంగారెడ్డిలో 41 కేంద్రాల్లో 15,218, మెదక్ జిల్లాలో 16 కేంద్రాల్లో 5,855, సిద్దిపేటలోని 37 కేంద్రాల్లో 13,714 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అంక్షలు అమలులో ఉంటాయన్నారు. అభ్యర్థులు సమయానికి చేరుకోవాలన్నారు. అరగంట ముందే గేట్లు మూసివేస్తారని, నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.
-ALL THE BEST

కౌడిపల్లి మండలం కృషి విజ్ఞాన కేంద్రాన్ని శనివారం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఉపరాష్ట్రపతి జగధీప్ ధన్కడ్ ఈనెల 25న కౌడిపల్లి మండలం తునికి శివారులోని గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఏకలవ్య కృషి విజ్ఞాన కేంద్రానికి రానున్నారని తెలిపారు. విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు చేస్తున్న ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొన్నారు.

సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని సర్కారుపై మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శలు గుప్పించారు. 14 రోజులు గడిచినా జీతాలు ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ రేవంత్రెడ్డి గప్పాలు కొట్టారన్నారు. డిసెంబర్లో 14వ తేదీ వచ్చినా 39,568 మంది అంగన్వాడీ టీచర్లు, ఆయాలు జీతాలు రాక ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉందన్నారు.

జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా 7 బెంచీలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేశ్ తెలిపారు. సంగారెడ్డిలో మూడు బెంచీలు, జోగిపేటలో ఒకటి, నారాయణఖేడ్ ఒకటి, జహీరాబాద్ ఒకటి, మొత్తం ఏడు బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. పెండింగ్ కేసులను తొందరగా పరిష్కరించేందుకు, కేసు పెండింగ్లో ఉన్నవారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రామాయపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. రామాయపల్లి గ్రామానికి చెందిన కటికల రేణుక (40) సమీపంలోని ఇండూస్ మెడికేర్ కంపెనీలో కార్మికురాలిగా పనిచేస్తోంది. ఈరోజు ఉదయం కంపెనీకి వెళ్తుండగా గ్రామ చౌరస్తా వద్ద బైక్ ఢీకొనడంతో అక్కడికక్కడే రేణుక మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతదేహాన్ని తూప్రాన్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలో శనివారం రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటించనున్నారు. మండల పరిధిలోని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్ను మంత్రి సందర్శిస్తారని అధికారులు తెలిపారు. అర్బన్ పార్క్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొంటారని పేర్కొన్నారు.

చిన్నశంకరంపేట మండలం మాందాపూర్ గ్రామంలో కొన్నసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే యాప్ వివరాల నమోదు ప్రక్రియను కలెక్టర్ శుక్రవారం పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన పురాతన ఇళ్లలో నివాసముంటున్న వారు కొత్త ఇళ్లను నిర్మించుకునేందుకు వస్తే వారి వివరాలను సైతం యాప్లో పొందుపర్చాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే అత్యంత పారదర్శకంగా కొనసాగుతుందని ఆయన అన్నారు.
Sorry, no posts matched your criteria.