India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనెల 4 వరకు ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించుకునేందుకు బోర్డు గడువు పెంచిందని డీఐఈఓ సత్యనారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 2 వరకు ఉన్న ఫీజు గడువును ఎలాంటి అపరాధ రుసుంలేకుండా 4 వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులకు ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి తెలిపారు. సంగారెడ్డిలో గురువారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఉన్న ఆర్డీవో కార్యాలయంలో బ్యాలెట్ ఓటు వినియోగించుకోవచ్చని చెప్పారు.
*కొమురవెల్లి మల్లన్న సాక్షిగా ఆగస్టు 15న రైతులను రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని పునరుద్ఘాటించారు.
*హరీష్ రావు రాజీనామా రాసిపెట్టుకో.. రుణమాఫీ చేసిన తర్వాత సిద్దిపేట చౌరస్తాలో లక్షమందితో సమావేశం నిర్వహిస్తాం.
*సిద్దిపేటలో దొరల రాజ్యం నడుస్తోంది.
*దుబ్బాక రావు.. సిద్దిపేట రావు పొద్దున రెండు పార్టీలు రాత్రి ఒక్కటే పార్టీ,
*మల్లన్నసాగర్లో భూములు గుంజుకొని అక్రమ కేసులు పెట్టివారికి ఎంపీ టికెట్
సిద్దిపేటలో మామపోతే అల్లుడు అన్నట్టుగా హరీశ్ రావు రాజ్యం ఏలుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. మరోవైపు నిజాం వద్ద కాశీం మాదిరిగా కేసీఆర్ వద్ద వెంకట్రావ్ పని చేశారని విమర్శించారు. అందుకే మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని ఓడించాలని పిలుపునిచ్చారు. దొరల గడీలను బద్దలు కొట్టకపోతే బానిసల అవుతామని చెప్పారు. మెదక్ను బ్రహ్మ రాక్షసుల నుంచి విముక్తి కల్పిస్తానని అన్నారు.
సిద్దిపేట జిల్లాలో టాటాఏస్, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సిద్దిపేట రూరల్ మండలంలోని పుల్లూరు బండ దగ్గరలో టాటాఏస్ వాహనం పుల్లూరు మీదుగా మల్యాలకు వెళ్తుంది. అదే సమయంలో రూరల్ మండలం బండచెర్లపల్లి గ్రామానికి చెందిన నాగరాజు ఎదరుగా బైక్ పై మల్యాల నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా రెండు వాహనాలు ఢీకొన్నాయి. దీంతో నాగరాజు అక్కడికక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలో స్క్రాప్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముత్తంగి శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ వద్ద గల స్క్రాప్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గుర్తించిన వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా.. మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాణ నష్టం ఏమీ జరగనప్పటికీ, భారీగా నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తొగుట మండల కేంద్రానికి చెందిన కాసర్ల మైసవ్వ(63) చెరువులో పడి మృతి చెందింది. స్థానికుల సమాచారం.. మైసవ్వ భర్త మైసయ్య ఐదేళ్ల క్రితం చనిపోయాడు. కుమారులు మల్లేశం కనకయ్య, కూతురు కవితల వివాహమైంది. కొంతకాలంగా మతిస్తిమితం సరిగా లేకుండా ఉన్న మైసవ్వ చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందినట్లుగా కుటుంబీకులు తెలిపారు. ఈ మేరకు తొగుట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బీజేపీ రిజర్వేషన్లు ఇచ్చే పార్టియే, కానీ తీసేసే పార్టీ కాదని మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు స్పష్టం చేశారు. గురువారం గజ్వెల్లోని కుకునూర్పల్లి మండల కేంద్రంలో రోడ్ షోకు హాజరై కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ బీజేపీపై బురదల్లే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. స్వయంగా ప్రధాని మోదీ తన ప్రాణం ఉన్నంత వరకు రిజర్వేషన్లు తీసేయనని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోకి వచ్చే మెదక్, జహీరాబాద్, కరీంనగర్, భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో 130 మంది బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానంలో 44 మంది, జహీరాబాద్ పార్లమెంట్ స్థానంలో 19 మంది, కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో 28 మంది, భువనగిరి పార్లమెంట్ స్థానంలో 39 మంది పోటీలో ఉన్నారు.
మెదక్ లోకసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో అభ్యర్థుల ప్రచారం ఒక్కసారిగా ఉధృతమైంది. ప్రచారానికి ఇంకా పదిరోజులే మిగలడంతో అభ్యర్థులు హోరాహోరీగా పర్యటిస్తున్నారు. ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంపైనే దృష్టిసారిస్తున్నారు . ప్రత్యక్షంగా ప్రజలను కలుస్తూ తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఎవరికి వారు ధీమాగా ప్రచారాన్ని ఉధృతం చేశారు.
Sorry, no posts matched your criteria.