Medak

News May 2, 2024

మెదక్: వ్యక్తి మిస్సింగ్.. అస్థిపంజరం లభ్యం

image

మనోహరాబాద్ మండలం గౌతోజిగూడ గ్రామంలో అదృశ్యమైన చుక్క కృష్ణ(55) ఆత్మహత్య చేసుకోగా అస్థిపంజరం లభించినట్లు ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇంట్లో గొడవపడి ఫిబ్రవరి 11న ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అప్పుడప్పుడు ఇలాగే వెళ్లి వస్తుండడంతో ఇంట్లోవాళ్లు నాలుగైదు రోజులు ఎదురుచూశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గ్రామ సమీపంలోని అటవీలో ఉరేసుకోగా అస్థిపంజరంగా గుర్తించారు.

News May 2, 2024

నూతన ఓటర్లకు గజిబిజి కార్డులు.. ఫొటో స్థానంలో ఆధార్ కార్డు

image

నారాయణఖేడ్ పట్టణానికి చెందిన పూసిని లక్ష్మీనారాయణ, ఈశ్వరమ్మ, మాణిక్యం నూతన ఓటర్లుగా నమోదు చేయించుకున్నారు. కొత్తగా కొరియర్‌లో వచ్చిన కవర్లు విప్పి చూసిన వారికి షాక్ గురయ్యారు. కొత్త కార్డులుగా సవిత బాయి విస్లావత్, పింకీ బాయి విస్లావత్, సక్కుబాయి విస్లావత్ ఓటర్ కార్డులు వచ్చాయి. సక్కుబాయి ఫొటో స్థానంలో గమ్మత్తుగా ఆధార్ ఫొటో ఉండడం విశేషం. కొత్త కార్డులను చూసి నూతన ఓటర్లు అవాక్కయ్యారు.

News May 2, 2024

నేడు సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి

image

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 2న సిద్ధిపేటలో పర్యటిస్తారని మెదక్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. గురువారం సాయంత్రం 3:30 గంటలకు బ్లాక్ ఆఫీస్ నుంచి ఓల్డ్ బస్టాండ్ వరకు రోడ్ షో, ర్యాలీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం బస్టాండ్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్ నిర్వహిస్తామన్నారు. కావున నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలి రావాలన్నారు.

News May 2, 2024

మతోన్మాద బీజేపీని ఓడించాలి: ప్రొఫెసర్ కోదండరాం

image

మతోన్మాద బీజేపీని ఓడించి ఇండియా కూటమిని బలపర్చాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. బుధవారం విలేకర్లతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి సంస్కరణలు, సవరణ చేస్తామని చెప్పి 400 ఎంపీ సీట్ల మెజారిటీ ఇవ్వమని అడుగుతున్నా బిజెపికి ఓటు వేయొద్దన్నారు. అసమానతలను మరింత తీవ్రంగా పెంచడానికి కేంద్రం అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.

News May 1, 2024

UPDATE..MDK: ఆగమేఘాలతో మీటర్ ఫిట్టింగ్.. దిగొచ్చిన సయ్యద్

image

మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన సయ్యద్ ఇంటికి విద్యుత్ అధికారులు ఆగమేఘాల మీద విద్యుత్తు మీటర్ ను బిగించారు. కొద్దిరోజులుగా విద్యుత్ మీటర్ బిగించడం లేదని వాటర్ ట్యాంక్ ఎక్కి సయ్యద్ నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. SI కరుణాకర్ రెడ్డి ఆగమేఘాల మీద విద్యుత్ అధికారులతో మాట్లాడి మీటర్ ఏర్పాటు చేయించారు. దాంతో సయ్యద్ వాటర్ ట్యాంక్ మీద నుంచి దిగి వచ్చారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

News May 1, 2024

మెదక్: అరచేతిలో అంతర్జాలంతో జాగ్రత్త

image

అరచేతి అంతర్జాలంతో జాగ్రత్తగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీ సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. మెదక్ మహిళా డిగ్రీ కళాశాలలో మెదక్ పట్టణ సీఐ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. సాధారణంగా ప్రజలు ఆశ, భయం వల్ల సైబర్ నేరాలకు గురవుతున్నారని తెలిపారు. సైబర్ నేరాలు ఏమిటి, సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు.

News May 1, 2024

కార్మిక చట్టాలపై అవగాహన అవసరం: న్యాయమూర్తి తరణి

image

అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కార్మికుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని దుబ్బాక జూనియర్ సివిల్ ప్రథమ శ్రేణి న్యాయమూర్తి వేముగంటి తరణి అన్నారు. బుధవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని హబ్సిపూర్ శివారులో ఉన్న శ్రీ లలితా పరమేశ్వరి ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యాయ చైతన్య సదస్సులో పాల్గొన్నారు.

News May 1, 2024

సంగారెడ్డి: ఈనెల 7 వరకు పాలీసెట్ దరఖాస్తుకు అవకాశం

image

పాలిసెట్ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడవు ఈనెల 7 వరకు పెంచినట్లు సంగారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు రూ.250, ఇతరులు రూ.500 ఆన్ లైన్ ద్వారా చెల్లించాలని చెప్పారు. మే 24న ప్రవేశ పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పదవ తరగతి చదివిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News May 1, 2024

వర్గల్: హల్దీవాగులో మృతదేహం లభ్యం

image

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద గల చెక్ డ్యాంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించినట్లు గౌరారం పోలీసులు తెలిపారు. సుమారు 35ఏళ్ల వయసు కలిగి ఉన్న మృతుడి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వివరించారు. హల్దీవాగులో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

News May 1, 2024

SRD: రావి ఆకుపై మేడే ‘లోగో’.. కార్మికులకు శుభాకాంక్షలు

image

కార్మిక దినోత్సవం మేడేను పురస్కరించుకొని అనంతసాగర్‌కు చెందిన ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్ గూడూరి శివకుమార్ బుధవారం రావి ఆకుపై కార్మికుల లోగో చిత్రాలను గీసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక దినోత్సవం దాని మూలాలను కార్మిక సంఘం ఉద్యమంలో కలిగి ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు రావి ఆకుపై లేబర్ల వృత్తి ఆయుధాలైన కొడవలి, సుత్తి, పాన చిత్రాలను సూచిస్తూ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.