India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా విపరీతమైన చలి పెరగడంతో జనం ఇంట్లోంచి బయటకు రావటానికి జంకుతున్నారు. వాహనదారులు, పాదచారులు చలికి ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ మెదక్ జిల్లా దామరంచలో 11.9 డిగ్రీలు నమోదు కాగా.. కనిష్ఠంగా సంగారెడ్డి జిల్లా కంగ్టిలో 10.1, సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపేటలో 12.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

రోడ్డుపై ట్రాక్టర్ నడుస్తుండగానే యంత్ర పరికరాలు విడిపోయి పడిపోయాయి. ప్రమాదం నుంచి డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ చౌరస్తాలో గురువారం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ట్రాక్టర్ ముందు చక్రాలు, ఇంజన్ భాగం ఊడిపోయింది. డ్రైవర్ అప్రమత్తమై వాహనం నుంచి దూకడంతో ప్రమాదం తప్పింది.

ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్మీడియట్ చదివేందుకు దరఖాస్తు గడపను ఈనెల 16 వరకు పెంచినట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. మీసేవా, ఆన్లైన్ కేంద్రాల్లో దరఖాస్తు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. అ అవకాశాన్ని గడువును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇంత కంటే దారుణం ఏముంటుందని ప్రశ్నించారు. రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..? లేక దోపిడీ దొంగనా అని నిలదీశారు.

వికారాబాద్ జిల్లా తాండూరులో ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రి పాలైన గిరిజన బాలికలను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ వేదికగా మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామనన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళ ప్రజా ప్రతినిధులకు ఇస్తున్న గౌరవం ఇదేనా..? అని ప్రశ్నించారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి చంపేస్తోంది. మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రత సింగిల్ డిజిట్కు పడిపోయింది. మెదక్ జిల్లా శివ్వంపేటలో 9.4డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, సంగారెడ్డి జిల్లా నల్లవల్లి 9.7, కంగ్టీ 9.8, కోహిర్లో 9.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లా అంగడి కిష్టాపూర్లో 10.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలోని విద్యాశాఖలో భాగమైన సమగ్ర శిక్షాలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు సేకరించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఆదేశించారు. రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు ఉద్యోగుల వివరాలను సేకరించి జిల్లా కార్యాలయానికి పంపాలని మండల విద్యాధికారులకు సూచించారు. కోరారు. సూచించారు. సమగ్ర శిక్షా ఉద్యోగులు గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

నాటి కేంద్ర మంత్రి చిదంబరం నుంచి తెలంగాణ ప్రకటన వచ్చిందంటే దానికి కారణం కేసీఆర్ అని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఈ సత్యాన్ని ఏమార్చాలని కాంగ్రెస్ చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్రావు ధ్వజమెత్తారు. సంగారెడ్డిలో హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ గురించి సీఎం రేవంత్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లేకుంటే నీ రెండు కళ్ళ సిద్ధాంతం గుర్తుకు వస్తుందని హరీశ్రావు తెలిపారు.

రాజీమార్గమే రాజామార్గం అని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజీపడే కేసుల్లో రాజీ పడేటట్లు కక్షిదారులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని అధికాలకు సూచించారు. ఇద్దరు కొట్లాడితే ఒక్కరే గెలుస్తారు. రాజీ పడితే ఇద్దరూ గెలుస్తారని.. కక్షలతో ఏమీ సాధించలేమని అన్నారు. అదేరోజు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

వారణాసిలోని బెనారస్ యూనివర్సిటీలో జరుగుతున్న క్రీడా సమాఖ్య పాఠశాల స్థాయి అండర్-14 వాలీబాల్ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర జట్టు ప్రతిభ చూపుతున్నట్లు కోచ్ అల్లి నరేశ్ తెలిపారు. బాలుర విభాగంలో మొదటి మ్యాచ్ పంజాబ్(3-2)తో, రెండవ మ్యాచ్ ఢిల్లీ(3-0)తో విజయం సాధించినట్లు వివరించారు. విజయం పట్ల అధ్యక్షుడు నాగరాజు, ఎస్జీఎఫ్ సెక్రెటరీ రమేష్, కిషోర్, దేవానంద్, హరిత, పుష్పవేణి హర్షం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.