Medak

News December 11, 2024

 మెదక్: వీడియో కాల్ మాట్లాడుతూ మహిళ సూసైడ్ !

image

వీడియో కాల్ మాట్లాడుతూ మహిళ సూసైడ్ చేసుకున్న ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. టేక్మాల్ మం. కొరంపల్లికి చెందిన ప్రభాకర్‌కు పాపన్నపేట మం. గాందారిపల్లి చెందిన లావణ్య(38)తో 20ఏళ్ల క్రితం పెళ్లైంది. కాగా లావణ్య నిన్న ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుంది. అయితే తన చెల్లి చివరిగా ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని ఆమె అన్న కాశీనాథం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు  కేసు నమోదు చేశారు.

News December 11, 2024

డిసెంబర్ 15వ తేదీన జిల్లాకు విశారదన్ మహారాజ్ రాక

image

సిద్దిపేట జిల్లా కేంద్రంలో డిసెంబర్ 15న జరిగే ధర్మ సమాజ్ పార్టీ (DSP) జిల్లా మహాసభ (ప్లీనరీ)కి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధినేత విశారదన్ మహారాజ్ హాజరవుతారని జిల్లా అధ్యక్షుడు సదన్ మహరాజ్ తెలిపారు. బుధవారం ఆయన సిద్దిపేటలో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 93 శాతం మంది బీసీ, ఎస్సీ ఎస్టీ, అగ్ర కుల పేదల తరఫున పోరాడే ఏకైక పార్టీ ధర్మ సమాజ్ అన్నారు.

News December 11, 2024

పారదర్శక పాలన అందించాలి: మంత్రి పొన్నం

image

పారదర్శక పాలన అందించాలని నూతన పాలకవర్గానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బుధవారం నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. పారదర్శక పాలనతో ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు.

News December 11, 2024

మెదక్: వేర్వేరు కారణాలతో ముగ్గురి సూసైడ్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు. వివరాలిలా.. హుస్నాబాద్ మండలం పొట్లపల్లికి చెందిన ఆటో డ్రైవర్ శ్రీధర్ ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకున్నాడు. అదే విధంగా దుబ్బాక పరిధిలోని ధర్మాజీపేట వాడకు చెందిన నర్సింలు(42) అప్పులు తీర్చలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హత్నూర మండలం నస్తీపూర్‌కి చెందిన కుమార్‌పై భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సూసైడ్ చేసుకున్నాడు.

News December 11, 2024

సంగారెడ్డి: ఓపెన్ స్కూల్లో ప్రవేశం పొందేందుకు నేడే ఆఖరు

image

సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్ తరగతులలో ప్రవేశం పొందేందుకు నేడే ఆఖరి తేదీ అని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ శోభారాణి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఓపెన్ స్కూల్లో ప్రవేశం పొందేందుకు ఇది చివరి అవకాశమన్నారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రములో సంప్రదించాలని సూచించారు.

News December 11, 2024

సిద్దిపేట: గ్రూప్-2 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: అదనపు కలెక్టర్

image

గ్రూప్-2 పరీక్ష అభ్యర్థులు ప్రశాంతమైన వాతావరణంలో రాసేలా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రూప్-2 పరీక్ష నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారి, రూట్ అధికారులు, పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 37 కేంద్రాల్లో 13,714 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని తెలిపారు.

News December 10, 2024

మెదక్: ముసాయిదాపై అభ్యంతరాలుంటే ఈనెల 12లోపు తెలపాలి: కలెక్టర్

image

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా రూపొందించిన ముసాయిదా పోలింగ్ స్టేషన్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 12 లోపు సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో తెలియజేయాలన్నారు. కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ రాజకీయ పార్టీలకు తెలిపారు.

News December 10, 2024

సంగారెడ్డి: మూడు నెలలకు ఒకసారి ఈవీఎంల పరిశీలన: కలెక్టర్

image

3నెలలకు ఒకసారి ఈవీఎంలను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. మంగళవారం పాత డీఆర్డీఏలోని ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించినట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌లో సీసీ కెమెరాలు, విద్యుత్ లైట్లు, తదితర సౌకర్యాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈవీఎంలకు పోలీసుల భద్రత కల్పించినట్లు చెప్పారు.

News December 10, 2024

ఐదున్నర దశాబ్దాలకు ఆత్మీయ సమ్మేళనం

image

పటాన్‌చెరులో 1971-72లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 55ఏళ్లకు ఆత్మీయ అపూర్వ సమ్మేళనం నిర్వహించుకున్నారు. మాజీ కార్పొరేటర్ సపాన్ దేవ్ ఆధ్వర్యంలో పూర్వ స్నేహితులు (విద్యార్థులు) కలుసుకొని ఒకరినొకరు పలకరించుకొని ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయాలని అనుకున్నట్లు వివరించారు.

News December 10, 2024

డిసెంబర్ 19న ఫుల్‌బాల్ క్రీడాకారుల ఎంపికలు

image

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం కప్ పోటీలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఫుల్‌బాల్ అసోసియేషన్ పర్యవేక్షణలో క్రీడాకారుల ఎంపికలు డిసెంబ 19న నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి డి వై ఎస్ ఓ జయదేవ్ ఆర్యా, సిద్దిపేట ఫుట్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కోచ్ అక్బర్ నవాబ్ తెలిపారు. ఎంపికలకు క్రీడాకారులు ఆధార్ కార్డుతో హాజరు కావాలన్నారు.