Medak

News May 1, 2024

నిప్పుల కొలిమిలా మెదక్.. జాగ్రత్త ప్రజలారా..!

image

ఉమ్మడి జిల్లాలో మే నెల ప్రారంభానికి ముందునుంచే సూర్యుడు సుర్రుమంటుండు. తాజాగా జిల్లాలో 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిప్పుల కొలిమిలా మండుతున్న ఎండల ధాటికి ప్రజలు అల్లాడిపోతున్నారు. వడగాలులు, ఉక్కపోత ఠారెత్తిస్తున్నాయి. మరో మూడు రోజులు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దని అంటున్నారు.

News May 1, 2024

మే డే శుభాకాంక్షలు తెలిపిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌

image

శ్రామికుల విజయస్ఫూర్తిని చాటేరోజు ‘మే డే’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నేడు ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘శ్రామిక జనుల విజయ స్ఫూర్తిని చాటే ‘మే డే’ సందర్భంగా.. తెలంగాణ కార్మిక లోకానికి శుభాకాంక్షలు. మీ శ్రమ ఫలమే సమస్త సంపదలు. మీకు శుభం చేకూరాలని మనసారా ఆకాంక్షిస్తున్నానంటూ తెలిపారు.

News May 1, 2024

SRD: స్టేట్ ర్యాంకర్ సుల్తానాను అభినందించిన మంత్రి

image

SRD: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో 1000 మార్కులకు 993 మార్కులతో స్టేట్ 1st ర్యాంక్ సాదించిన మెహ్రీన్ సుల్తానాను రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. సంగారెడ్డి‌లోని తన నివాసంలో మెహ్రీన్ సుల్తానా తండ్రి మహమ్మద్ సుజాయత్ అలీ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.

News May 1, 2024

MDK: అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

image

మెదక్ లోక్ సభ నియోజకవర్గం నుంచి 44 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్సీ అభ్యర్థులు పోనూ.. మిగిలిన గుర్తింపు, రిజిస్టర్డ్ పార్టీల, స్వతంత్ర అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారి రాహుల్ రాజ్ ఎన్నికల చిహ్నాలను కేటాయించారు. స్వతంత్ర అభ్యర్థులకు లాటరీ పద్ధతిలో గుర్తులు కేటాయించారు.

News May 1, 2024

కాంగ్రెస్ రాజకీయం ముందు బిజెపి బచ్చా: జగ్గారెడ్డి వ్యాఖ్యలు

image

బిజెపి, కాంగ్రెస్ పుట్టు శత్రువులని, కాంగ్రెస్ రాజకీయ ముందు బిజెపి బచ్చా.. అని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. మోడీ, అమిత్ షాలకు భయం పట్టుకొని ఢిల్లీ పోలీసులను గాంధీభవన్‌కు పంపారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ అంటే వారికి దడ పుట్టింది అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు సాధించి రాహుల్ గాంధీకి గిఫ్ట్ ఇస్తామన్నారు.

News May 1, 2024

గుంపు మేస్త్రీ గూబ పగలాలి: హరీశ్‌రావు

image

తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన గుంపు మేస్త్రీకి పార్లమెంట్ ఎన్నికల్లో గూబ పగిలేలా తీర్పు ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలో జరిగిన రోడ్డు షో‌లో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి‌తో కలిసి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రం కల సాకారం చేసి మన చెరువులు కుంటల్లోకి నీళ్ళు తెచ్చిన కేసీఆర్‌కు పట్టం కట్టాలని ఆయన కోరారు.

News May 1, 2024

అల్లదుర్గ్: మోదీ రాకతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం

image

భాజపా మెదక్, జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థులు రఘునందన్ రావు, బీబీ పాటిల్‌లకు మద్దతుగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్ని ప్రసంగించారు. అల్లాదుర్గం మండలం చిల్వర గ్రామ శివారులో నిర్వహించిన సభకు అత్యధిక జనాభా రావడంతో బీజేపీ శ్రేణుల్లో, యువతలో జోష్ నింపింది. ప్రధాని మోదీ పాల్గొని మాట్లాడి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. సభ సక్సెస్ అయిందని బీజేపీ నాయకులు అభిప్రాయ పడుతున్నారు.

News May 1, 2024

సంగారెడ్డి: మోడీ, షా ఆదేశాల వరకే గాంధీ భవన్‌కు పోలీసులు

image

మోడీ, అమిత్ షా ఆదేశాల వరకే ఢిల్లీ పోలీసులు గాంధీభవన్‌కి వచ్చారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థగా మారిందని విమర్శించారు. టీవీలో చూపిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శిస్తున్నారని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేద్దామని తెలిపారు.

News April 30, 2024

బాల రాముడి వెండి ప్రతిమను పీఎంకు బహుకరించిన ఎంపి

image

అల్లాదుర్గం వద్ద జరిగిన విశాల్ జనసభ కార్యక్రమం వేదికపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జహీరాబాద్ ఎంపీ, బిజెపి ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఘనంగా స్వాగతించి ఆయన ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా బాల శ్రీరాముడి వెండి ప్రతిమను ప్రధానమంత్రి మోడీకి బీబీ పాటిల్ బహూకరించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి పార్లమెంట్లో అడుగు పెట్టాలని ఎంపీకి, పీఎం సూచించినట్లు పార్టీ వర్గీయులు తెలిపారు.

News April 30, 2024

జగదేవ్‌పూర్: చెప్పేది శ్రీరంగనీతులు.. చేసేవి తప్పుడు పనులు: హరీశ్ రావు

image

సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవి శ్రీరంగనీతులని, చేసేవి అన్ని తప్పుడు పనులేనని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జగదేవ్పూర్ మండల కేంద్రంలో ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో హరీశ్ రావు ప్రసంగించారు. రుణమాఫీ చేయలేదని, హామీలు అమలు చేయలేదని, రాజీనామా చేస్తానంటే పారిపోయిండని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. అయితే తిట్లు లేకుంటే దేవుని మీద ఓట్లు చేస్తున్నట్లు ఆరోపించారు.