India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పెళ్లి కావట్లేదని మనస్తాపంతో యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నంగునూరు మండలం సిద్ధన్నపేటకు సంగు భాస్కర్(36) కారు డ్రైవర్. ఆదివారం రాత్రి డ్రైవింగ్కు వెళ్లి వచ్చిన భాస్కర్.. ఉదయం చూడగా ఇంట్లో ఊరేసుకున్నాడు. పెండ్లి కావట్లేదని మనస్తాపంలో సూసైడ్ చేసుకున్నట్లు తండ్రి అంజనేయులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆసిఫ్ తెలిపారు.

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్లోని తెలంగాణభవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.

నేటి నుంచి జరుగబోయే అసెంబ్లీ సమావేశాలకు KCR వస్తారో.. రారో.. మీరే చూస్తారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. BRS MLAలు, MLCలతో పార్టీ అధినేత KCR ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో సమావేశమయ్యారు. గురుకులాల బాట ద్వారా అధ్యయనం చేసిన నివేదికను RS ప్రవీణ్కుమార్, BRSV విభాగం అందజేసింది. నేటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై KCR ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంయుక్త సమావేశం పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆదివారం జరగనున్నది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు.

రేవంత్ రెడ్డి CMగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి సరిగ్గా ఏడాది. కాగా ఇప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. మెదక్ మెడికల్ కళాశాల, ఆందోల్ నర్సింగ్ కళాశాల మంజూరు, జోగుపేట ఆసుపత్రి 150 పడకలకు పెంపు, పటాన్చెరు వరకు రూ.1700 కోట్లతో మెట్రో విస్తరణ, తిమ్మాపూర్లో 1000మందికి ఉపాధి లభించే కోకాకోలా కంపెనీ ప్రారంభం, సహా పలు పనులు చేపట్టారు. మీ కామెంట్?

తూర్పు వరంగల్ MLA కొండా సురేఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా ఏడాది. కాగా, ఆమెకు CM రేవంత్ దేవాదాయ & అటవీ శాఖలు కేటాయించడంతో పాటు MDK ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్ఛార్జ్ మంత్రిగా MDKలో అనేక అభివృద్ధి పనులు చేపట్టారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ వేదికగా ఫ్రీ బస్సు పథకం ప్రారంభం, రూ.500 గ్యాస్, రుణమాఫీ, జిల్లాలో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మీ కామెంట్?

లంచం తీసుకుంటూ కల్హేర్ మండలం మాసాన్పల్లి పంచాయతీ కార్యదర్శి ఉమేశ్ ACBకి చిక్కాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మహదేవుపల్లి చౌరస్తాలో ఫిష్ స్టాల్ ఏర్పాటు చేసేందుకు బ్యాంక్ లోన్ ఎల్ఓసీ సర్టిఫికెట్ కోసం ఉమేశ్ను ఆశ్రయించాడు. దీంతో ఎల్ఓసీ ఇచ్చేందుకు రూ. 15 వేలు లంచం అడగడంతో బాధితుడు ACBని ఆశ్రయించాడు. ఎంపీడీఓ ఆఫీస్లో లంచం తీసుకుంటుండగా పంయితీ కార్యదర్శి ACBకి రెడ్హ్యండెడ్గా పట్టుబడ్డాడు.

రాష్ట్రంలో అప్పటికీ ఎమర్జెన్సీ కొనసాగుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు X వేదికగా మండిపడ్డారు. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వెళ్తున్న BRS నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దమన్నారు. రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పించే స్వేచ్ఛ రాష్ట్రంలో లేదా అని నిలదీశారు. అదుపులోకి తీసుకున్న పార్టీ శ్రేణులను విడుదల చేయాలన్నారు.

వేర్వేరు కారణాలతో ఉమ్మడి జిల్లాలో నిన్న నలుగురు సూసైడ్ చేసుకున్నారు. తూప్రాన్ మం. నర్సంపల్లికి చెందిన శివ(24) ఇంట్లో ఊరేసుకోగా.. అక్కన్నపేట మం. అంతకపేటకు చెందిన ప్రకాశ్ భార్య పుట్టింటింకి వెళ్లిందన్న మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. రాయపోల్కు చెందిన ఎరుపుల నర్సింలు(41) మద్యానికి బానిసై, కుటుంబ కలహాలతో పురుగుమందు తాగి చనిపోయాడు. పటాన్చెరు మం. ఇస్నాపూర్లో కార్మికుడు బహుద్దూర్ గదిలో ఉరేసుకున్నాడు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలోని జూబ్లీ క్లబ్ ఆవరణలోని ఎంఎస్ అకాడమీలో ఉదయం 10 గంటల నుంచి ఎంపికలు జరుగనున్నాయి. జిల్లాలో ఎంపికైన క్రీడాకారులకు 16 న హైదరాబాద్లో జరిగే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనాల్సి ఉంటదని చెప్పారు.
Sorry, no posts matched your criteria.