Medak

News April 30, 2024

సిద్దిపేట: ‘అంజన్నకు ఆస్తులు రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు’

image

సిద్దిపేట జిల్లా కోడూరు మండలంలోని అలిపూర్ గ్రామానికి చెందిన బాలయ్య అనే వ్యక్తి తన ఆస్తులను కొండగట్టు ఆంజనేయస్వామికి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. కని పెంచిన కొడుకులు సరిగ్గా చూసుకోవడం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కాగా తన ఆస్తులను ఆంజనేయ స్వామి పేరిట పట్టా చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని కోరాడు.

News April 30, 2024

మెదక్: ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు ఈవీఎంలు..

image

మెదక్ పార్లమెంటు స్థానంలో అత్యధికంగా 44 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అవసరం కానున్నాయి. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల వివరాలు ఉండనుండగా, మూడు ఈవీఎంలు అవసరం కానున్నాయి. 2,124 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 6,372 ఈవీఎంలు అవసరం కానున్నాయి.

News April 30, 2024

మెదక్ లోక్‌సభకు రికార్డుస్థాయిలో అభ్యర్థుల పోటీ

image

రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే మెదక్‌ లోక్‌సభ ఎన్నికలు ప్రత్యేకంగా మారాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 44 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇంత మంది ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి. ఇక ఈ ఎన్నిక ఖర్చు కూడా అధికంగా ఉండవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా ఒక్కో నియోజకవర్గానికి సుమారు రూ.15 కోట్లు ఖర్చు అవుతుండగా, మెదక్‌ ఎన్నికలకు అదనంగా మరో రూ.10 కోట్లు ఖర్చయ్యే అవకాశాలున్నాయి.

News April 30, 2024

మెదక్: ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు ఈవీఎంలు..

image

మెదక్ పార్లమెంటు స్థానంలో అత్యధికంగా 44 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో ఒక్కో పోలింగ్ కేంద్రానికి మూడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు అవసరం కానున్నాయి. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల వివరాలు ఉండనుండగా, 44 మంది పోటీలో ఉండడంతో మూడు ఈవీఎంలో అవసరము కానున్నాయి. 2,124 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 6,372 ఈవీఎంలు అవసరం కానున్నాయి.

News April 30, 2024

UPDATE: పెళ్లైన మూడు రోజులకే వరుడు మృతి.. వధువు పరిస్థితి విషమం

image

మాసాయిపేట మండలం రామంతపూర్ వద్ద రాత్రి జరిగిన <<13149362>>రోడ్డు ప్రమాదం<<>>లో పెళ్లైన మూడు రోజులకే వరుడు దుర్మరణం చెందగా వధువు పరిస్థితి విషమంగా ఉంది. చిన్నశంకరంపేట మండలం జంగరాయికి చెందిన ఎర్రోళ్ల వెంకటేష్(22)కు మాసాయిపేట మండలం పోతన్పల్లికి చెందిన శ్రీలతతో ఈనెల 26న వివాహం జరిగింది. కాగా రాత్రి బైక్‌పై దంపతులు పోతన్‌పల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.

News April 30, 2024

సిద్దిపేట: సమగ్ర వివరాలకు క్యూఆర్ స్కాన్

image

ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో ఎన్నెన్నో మార్పులు సంతరించుకుంటాయి. ఇది వరకు ఓటరు స్లిప్ పై ఓటరు ఫోటోతో పాటు వివరాలు ఉండేవి. గత అసెంబ్లీ ఎన్నికల నుంచి అందులో మార్పులు తీసుకొచ్చింది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే విధానాన్ని అమలు చేస్తోంది. ఓటరు స్లిప్ పై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దాన్ని ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే ఓటరు పూర్తి వివరాలు కనిపిస్తాయి.

News April 30, 2024

సిద్దిపేట: నాడు తండ్రి.. నేడు తల్లిని చంపిన కొడుకు

image

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తిలో కొడుకు నరసింహులు దాడిలో గాయపడిన తల్లి భారతమ్మ(55) మృతి చెందింది. మద్యానికి బానిసైన నర్సింలు ఈనెల 27న తల్లితో గొడవపడి దాడి చేశాడు. చికిత్స పొందుతూ ఆమె నిన్న చనిపోయింది. కాగా 9ఏళ్ల క్రితం తండ్రి బాలమల్లుతో గొడవపడి దాడి చేయగా మృతి చెందాడు. కూతురు సరస్వతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News April 30, 2024

10th Results.. సిద్దిపేట టాప్‌‌.. మెదక్ లాస్ట్

image

పదోతరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా సత్తాచాటింది. 98.64 ఉత్తీర్ణత శాతంలో రాష్ట్రంలోనే సిద్దిపేట 2వ స్థానంలో నిలిచింది. ఇందులో బాలురు 6920, బాలికలు 6868 మంది ఉత్తీర్ణులయ్యారు. 97.86 శాతంతో సంగారెడ్డి జిల్లా 5వ స్థానంలో నిలవగా.. 10852 బాలురు, 10688 బాలికలు పాసయ్యారు. 92.96 శాతంలో మెదక్ జిల్లా18వ స్థానం సాధించగా.. అబ్బాయిలు 4608, అమ్మాయిలు 4945 మంది పాసయ్యారు.

News April 30, 2024

మెదక్ లోక్‌సభకు రికార్డుస్థాయిలో అభ్యర్థుల పోటీ

image

రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే మెదక్‌ లోక్‌సభ ఎన్నికలు ప్రత్యేకంగా మారాయి. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 44 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇంత మంది ఇక్కడి నుంచి పోటీ చేస్తుండడం ఇదే మొదటిసారి. ఇక ఈ ఎన్నిక ఖర్చు కూడా అధికంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. సాధారణంగా ఒక్కో నియోజకవర్గానికి సుమారు రూ.15 కోట్లు ఖర్చు అవుతుండగా, మెదక్‌ ఎన్నికలకు అదనంగా మరో రూ.10 కోట్లు ఖర్చయ్యే అవకాశాలున్నాయి.

News April 30, 2024

సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య..

image

కంగ్టి మండలం చాప్టా(కే) శివారులో ఓ వ్యక్తి హత్యకు గురైనట్లు కంగ్టి CI చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతుడు ముర్కుంజాల్‌కు చెందిన వడ్డే సంజుగా గుర్తించారు. శరీరంపై ఉన్న గాయల ప్రకారం దారుణంగా హత్యకు చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇంట్లో గొడవతో భార్య 2నెలల క్రితం పుట్టింటింటికి వెళ్లింది. సంజు తల్లిదండ్రులు చనిపోగా సోదరులు HYD వలస వెళ్లారు.