India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి మెదక్ జిల్లాలో నిత్యావసర వస్తువులు, కూరగాయలతోపాటు చికెన్ ధర ఆకాశాన్ని తాకుతోంది. వారం రోజులుగా మెదక్లో చికెన్ షాపుల్లో స్కిన్ లెస్ రూ. 230, విత్ స్కిన్ రూ. 205 పలుకుతుంది. ఇక గ్రామాల్లోని చికెన్ సెటర్లల్లో రూ.250 ఉంది. దీంతో మాంసం ప్రియులు వెనక్కి తగ్గుతున్నారు. 1కేజీ తీసుకోవాలనుకున్న వారు అర కేజీతో సరిపెట్టుకుంటున్నారు. కాగా, పెళ్లిళ్ల సీజన్ కావడమే ఇందుకు కారణమని షాపు యజమానులు అంటున్నారు.
మెదక్ జిల్లా హవేలిఘనపూర్ గురుకులానికి చెందిన నలుగురు విద్యార్థినులు విద్యుదాఘాతానికి గురవ్వడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు. విద్యార్థినులు కరెంట్ షాక్ తగిలి గాయపడటం దురదృష్టకరమని అన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నదని.. ప్రభుత్వ పట్టింపు లేనితనం పిల్లల ప్రాణాల మీదకు తీసుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తూప్రాన్ పట్టణంలో ఏఆర్ కానిస్టేబుల్ భార్య కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ భూమేష్ భార్య కవిత (38) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా సాయంత్రం గుర్తించారు. భర్తతో కొన్నేళ్లుగా కలహాలు ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ సీఆర్ఆర్ గ్రాంట్స్ నుంచి రూ.11.49 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొహెడ నుంచి తంగళ్లపల్లి (వయ కురెళ్ళ) వరకు 1.10 కి.మీ రోడ్డు కోసం రూ.1.55 కోట్లు, తంగళ్లపల్లి నుంచి శ్రీరాములపల్లి PWD రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.1.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.
HYD చందానగర్ PSపరిధిలో ఈరోజు విషాదం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధి అశోక్నగర్లో AP తెనాలి వాసి ఉదయ్(23) ఉంటున్నాడు. రాత్రి ఫ్రెండ్స్తో కలిసి చందానగర్లోని VVప్రైడ్ హోటల్కు వెళ్లాడు. మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క అతడిని తరిమింది.తప్పించుకునే క్రమంలో కిటికీలో నుంచి కిందపడి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీస్ అమరవీరుల త్యాగం మరువలేనిదని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం సోషల్ మీడియా వేదికగా వారికి నివాళులు అర్పిస్తూ పోస్ట్ చేశారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేని అని అన్నారు.
HYD బాచుపల్లిలోని ఓ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం నాగిరెడ్డిపల్లెకు చెందిన అనూష బాచుపల్లిలోని ఓ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. దసరాకు ఇంటికెళ్లిన అనూషను తల్లిదండ్రులు నిన్న కాలేజీలో వదిలివెళ్లిన కొద్దిసేపటికే స్పృహ కోల్పోయిందని సిబ్బంది తెలిపారు. పేరెంట్స్ కళాశాలకు చేరుకోగానే అనూష మృతిచెందినట్లు తెలిపారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మెదక్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో నేటి నుంచి సమ్మేటివ్ -1 పరీక్షలు ప్రారంభం కానున్నాయని జిల్లా విద్యాధికారి రాధాకిషన్ ఆదివారం తెలిపారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రధానోపాధ్యాయులు తగిన చర్యలు తీసుకోవాలని, పరీక్షలకు అందరూ విద్యార్థులు హాజరయ్యే విధంగా చూడాలని పేర్కొన్నారు.
అబద్దాలకే కాంగ్రెస్ అంబాసిడర్ అని MLA హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ ప్రక్షాళన పేరిట కేసీఆర్ కట్టించిన ఇండ్లు సీఎం రేవంత్ రెడ్డి నిర్వాసితులకు ఇవ్వడం సిగ్గు చేటు అన్నారు. సీఎంకు నిర్వాసితులపై ప్రేమ ఉంటే గచ్చిబౌలిలో 250 గజాల స్థలంలో ఇల్లు కట్టించి ఇవ్వాలని సవాల్ విసిరారు. భూ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందించినట్లు స్పష్టం చేశారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో పొలం వద్ద ప్రతాప్ సింగ్(60), కళావతి(55) పురుగుల మందు తాగగా, జహీరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలి చేరుకొని విచారణ చేపట్టారు.
Sorry, no posts matched your criteria.