India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సంగారెడ్డి జిల్లాలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి జనవరి 11 వరకు బడి బయట పిల్లల సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. అనంతరం డిఈవో మాట్లాడుతూ.. జిల్లాలోని సిఆర్పీలు, ఐఈఆర్పీలు, డిఎల్ఎంటిలు, గ్రామాలలో, అవాస ప్రాంతాలలో బడి బయట పిల్లల సర్వే చేయాలని, సర్వేలో గుర్తించిన విద్యార్థుల వివరాలను ప్రభంద పోర్టల్లో నమోదు చేయాలని పేర్కొన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి నీ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడే వాళ్లం కాదని ఎమ్మెల్యే హరీష్ రావు X వేదికగా మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఉల్టా కేసు బనాయించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ రాక్షస పాలన కొనసాగిస్తున్నారు అని మండిపడ్డారు.

హైదరాబాద్ కలెక్టరేట్లో ఈరోజు 81 కుటుంబాలకు డబుల్ బెడ్రూం పట్టాలను మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు. ప్రజాపాలనను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని వాటిని తిప్పి కొట్టాలని అన్నారు.

యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని నెక్లెస్ రోడ్డులో ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా యోగా శిక్షణ కార్యక్రమాన్ని మునిసిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యోగా శిక్షణతో పాటు పోటీలను నిర్వహించారు. వారితో మునిసిపాలిటీ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు చనిపోయారు. వివరాలిలా.. హవేళిఘణాపూర్ మండలం సుల్తానాపూర్కు చెందిన నీల(40) మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి ఔరంగాబాద్ శివాలరులో మృతదేహం లభ్యమైంది. గజ్వేల్ పానీపూరి బండి నడుపుతున్న వ్యక్తి కరెంట్ షాక్తో మృతిచెందాడు. బెజ్జంకికి చెందిన ఉపాధ్యాయుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా బుధవారం తోటపల్లి చెరువు వద్ద అనుమానాస్పందగా మృతిచెందాడు.

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో క్వారీ గుంతలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. జీఎంఆర్ కాలనీకి చెందిన చిట్యాల రఘు, చిట్యాల రవి స్నానం చేయడానికి క్వారీకి వెళ్లారు. ప్రమాదవశాత్తు రవి నీటి గుంతలో పడి మునిగిపోయాడు. గజ ఈతగాల్లతో వెతకించినా ఆచూకీ లభించలేదు. కేసు నమోదైంది.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందదిరా క్రాంతి పథకం రుణాలపై బ్యాంకర్లు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బ్యాంకర్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల రుణాలను త్వరగా ఇవ్వాలని సూచించారు. సమావేశంలో ఆర్బీఐ మేనేజర్ తాన్య, నాబార్డ్ డే కృష్ణ తేజ, లేట్ బ్యాంకు మేనేజర్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలుచోట్ల భూకంపం సంభవించింది. సంగారెడ్డి, సిద్దిపేట, హుస్నాబాద్, జగదేవ్పూర్, జోగిపేట, గజ్వేల్, కొమ్మేపల్లి, పొట్టపల్లి ప్రాంతాల్లో భూమి కంపించిందని పలువురు సోషల్ మీడియాలో పేర్కొనా, దీనిపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఉ.7:25 నుంచి 7:30ల మధ్య భూమి కంపించింది. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. అయితే మీ ప్రాంతంలో వస్తే కామెంట్ చేయండి.

సంగారెడ్డి జిల్లాలో 101 పాఠశాలలో బుధవారం NAS పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పరీక్ష నిర్వహించడానికి 101 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లను నియమించామని, ప్రతి పాఠశాలకు ఒక అబ్జర్వర్ ఉంటారని పేర్కొన్నారు. పాఠశాల హెచ్ఎంలు పరీక్ష ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని కోరారు.

సంగారెడ్డిలో బుధవారం ఏక సభ్య కమిషన్ చైర్మన్ శమీమ్ అత్తర్ సభ్యులు సంగారెడ్డికి వస్తున్నారని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎస్సీ కుల సంఘాల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన దళిత సంఘాల నాయకులు తమ వినతి పత్రాలను సమర్పించాలని చెప్పారు.
Sorry, no posts matched your criteria.