Medak

News October 20, 2024

సదాశివపేట: వినాయక విగ్రహాం ధ్వంసంపై క్లారిటీ.!

image

సదాశివపేటలోని వినాయక విగ్రహాన్ని ఎవరూ ధ్వంసం చేయలేదని సంగారెడ్డి డిఎస్పీ సత్తయ్య గౌడ్ అన్నారు. సదాశివపేటలో శనివారం దేవాలయం సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. 15 అర్ధరాత్రి నుంచి 16 తెల్లవారుజాము వరకు ఇలాంటి ఘటన జరగలేదని సీసీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. గర్భగుడిలో పశువు ఉండడంతో ఓ భక్తులు గమనించి బయటకు పంపించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమం సీఐ మహేశ్ గౌడ్ పాల్గొన్నారు.

News October 20, 2024

సంగారెడ్డి: ఏటీసీ నిర్మాణ పనులను వేగవంతం చేయండి: కలెక్టర్

image

హత్నూరలో ఏర్పాటు చేయనున్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. హత్నూర ఐటీఐలో ఏటీసీ పనులను శనివారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

News October 20, 2024

కాంగ్రెస్–బీజేపీ మ‌ధ్య చీక‌టి ఒప్పందం మ‌రోసారి బ‌ట్ట‌బ‌య‌లైంది: హరీష్

image

గ్రూప్స్ అభ్యర్థులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ముఠా గోపాల్, దాసోజు శ్రవణ్ సహా ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ – బీజేపీకి మధ్య ఉన్న చీకటి ఒప్పందం మరోసారి బట్టబయలైంది. బీజేపీకి ఒక న్యాయమా..? బీఆర్ఎస్‌కు ఒక న్యాయ‌మా..? అని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు.

News October 19, 2024

BRS పటాన్‌చెరు నియోజకవర్గ కొత్త బాస్ ఎవరు..?

image

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన ప్రస్తుత పటాన్‌చెరు MLA మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై BRS అధిష్ఠానం దృష్టి సారించింది. ఇందుకోసం హరీశ్‌రావు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. నియోజకవర్గ ముఖ్య నాయకులు, సన్నిహితులతో చర్చిస్తూ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కొత్త ఇన్‌ఛార్జి నియామకంపై కసరత్తు చేస్తున్నారు. చూడాలి మరీ ఆ పదవీ ఎవరిని వరిస్తుందో.

News October 19, 2024

MDK: నేడు జిల్లాకు హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి రాక

image

రాష్ట్ర హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి నేడు మెదక్ జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద తెలిపారు. జస్టిస్ విజయసేన్ రెడ్డి ఉదయం 8:15 గంటలకు ఏడుపాయల అమ్మవారిని దర్శించుకుని, అక్కడి నుంచి ఉదయం 10 గంటలకు అల్లాదుర్గంలోని కోర్టు కాంప్లెక్సు ప్రారంభిస్తారని తెలిపారు. ఆ తర్వాత మెదక్ చేరుకొని బార్ అసోసియేషన్ తో సమావేశం నిర్వహించి, మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్‌కు వెళ్తారు.

News October 19, 2024

కూతురును హత్య చేసిన తల్లి, ప్రియుడికి జీవిత ఖైదు

image

కూతురిని హత్య చేసిన తల్లి, ఆమె ప్రియుడికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి భవాని చంద్ర శుక్రవారం తీర్పు ఇచ్చారు. వడపావ్‌కు చెందిన రాజుతో కల్పన వివాహేతర సంబంధం పెట్టుకుని సదాశివపేటలో నివాసముంటుంది. కాగా కల్పన పెద్ద కుమార్తె భవ్య(3) రాజును నాన్న అని పిలవకపోవడంతో తలను గోడకేసి కొట్టడంతో మృతిచెందింది. ఈ కేసులో నేరం రుజువు కావడంతో వీరిద్దరికీ కోర్టు శిక్ష విధించింది.

News October 19, 2024

MDK: ఈ టీచర్ ది గొప్ప మనసు..

image

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని వడియారంలో ప్రాథమిక పాఠశాలలో “మన ఊరు మన బడి” పథకంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేసేందుకు పాఠశాల ఉపాధ్యాయురాలు వసంత తన వంతు సహాయంగా రూ. లక్ష విరాళం ప్రకటించారు. ఈరోజు పనులు పూర్తి చేసేందుకు రూ. 25000 చెక్కును HM సిద్దిరాములుకు అందజేశారు. దీంతో వసంతను హెచ్ఎం, ఉపాధ్యాయులు సంతోషిమాత, అమరేశ్వరి తదితరులు అభినందించారు.

News October 19, 2024

సంగారెడ్డి: ‘రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోండి’

image

రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు, అధికారులు కలిసి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో రోడ్డు భద్రత సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ముఖ్యంగా లకడారం, కంది, నోవా పాన్, ముత్తంగి స్వీట్ హార్ట్ కార్నర్, రుద్రారం గీతం రోడ్, కవలం పేట్ మామిడిపల్లి ఎక్స్ రోడ్ వంటి ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.

News October 18, 2024

MDK: వేచి చూడాలి మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో..?

image

ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటికే గ్రామ సర్పంచులు, ఎంపీపీ, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. త్వరలో మున్సిపాలిటీల పదవీ కాలం కూడా ముగియనున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా ఇన్‌ఛార్జిలతో నేనంటే నేను ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ పదవికి పోటీ చేస్తానని చెప్పుకుంటున్నారు. వేచి చూడాలి మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో..?

News October 18, 2024

సంగారెడ్డి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలపై మంత్రి సమీక్ష

image

సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో వారి ధాన్యం కొనుగోలు, రుణమాఫీపై అధికారులతో మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని చెప్పారు. ఇంకా ఎవరికైనా రూ. రెండు లక్షల లోపు రుణమాఫీ కాకుంటే వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో వల్లూరు క్రాంతి, అధికారులు పాల్గొన్నారు.