India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెదక్ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేసిన ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు సోమవారం విత్ డ్రా చేసుకున్నారు. సదాశివపేటకు చెందిన తుమ్మలపల్లి పృథ్వీరాజ్(తెలంగాణ మంజీరా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు), సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం గుండ్ల మాచనూర్ గ్రామానికి చెందిన కపిల్ భద్రేశ్ విత్ డ్రా చేసుకున్న వారిలో ఉన్నారు. మొత్తం 53 మంది అభ్యర్థులు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని హాస్టళ్లు, మెస్లకు వచ్చే నెల 1వ తేదీ నుంచి వేసవి సెలవులను ప్రకటించారు. ఈ మేరకు చీఫ్ వార్డెన్ డాక్టర్ కొర్రెముల శ్రీనివాస్ ప్రకటన జారీ చేశారు. వేసవి నేపథ్యంలో <<13137079>>మంచినీరు, విద్యుత్ కొరత <<>>ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే మే 1 నుంచి 31 వరకు సెలవులు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విద్యార్థులందరూ సహకరించాలని కోరారు. SHARE IT
మెదక్ పార్లమెంట్ పరిధిలో రేపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం శివారులోని చిల్వేర్ వద్ద నిర్వహించే సభలో ఆయన పాల్గొనున్నారు. మెదక్ స్థానం నుంచి ఈ ఎన్నికలో
బీజేపీ తరఫున రఘునందన్, జహీరాబాద్ నుంచి బీబీపాటిల్ పోటీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉంది.
కౌడిపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో <<13142095>>చిన్నారి<<>> మృతిచెందిన సంగతి తెలిసిందే. ప్రణయ్ (2), మరో అమ్మాయి ఇంటి ఎదుట ఆడుకుంటూ 765డి జాతీయ రహదారి పైకి వచ్చి రోడ్డు దాటారు. ఇది గమనించిన బాలుడి తండ్రి రాములు పిల్లల్ని తీసుకుని రోడ్డు దాటాడు. ఈ క్రమంలో చిన్నారి ప్రణయ్ తండ్రి చేయిని వదిలి ఒక్కసారిగా ముందుకొచ్చాడు. అదే సమయంలో వేగంగా వస్తున్న లారీ చిన్నారిని ఢీకొంది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
మెదక్ జిల్లా శివంపేట మండలం లింగోజిగూడ తాండాకు చెందిన మాలోత్ విట్టల్ (48) ఈరోజు ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో భార్య, కొడుకుతో ఇంట్లో విషయమై గొడవపడ్డాడు. మనస్తాపానికి గురైన విఠల్ పొలం వద్దకు వెళ్లి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. శివంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జహీరాబాద్ లోక్సభ స్థానంలో ఓటర్ల సంఖ్య పెరిగింది. 2019 నుంచి 2024 వరకు ఈ స్థానంలో 1,45,912 మంది కొత్త ఓటర్లు చేరారు. ఈ పార్లమెంటు పరిధిలో మొత్తం 16,40,755 మంది ఓటర్లు ఉన్నారు. ఈ లోక్సభ స్థానానికి 2009లో 74.67 శాతం, 2014లో 77.28 శాతం, 2019లో 69.70 శాతం పోలింగ్ నమోదైంది. ప్రస్తుతం పెరిగిన ఓటర్ల సంఖ్యతో ఈసారి పోలింగ్ శాతం పెరగనుందని పలువురు భావిస్తున్నారు.
మెదక్ లోక్సభ స్థానంపై స్థానికేతరులు దృష్టి సారించారు. ఈ స్థానానికి 54 మంది అభ్యర్థులు నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఇందులో ఓ స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. మిగిలిన 53 మంది అభ్యర్థుల్లో 8 మంది అభ్యర్థులు స్థానికేతరులు ఇక్కడ నామినేషన్ వేయడం గమనార్హం. ఇందులో ఖమ్మం, హైదరాబాద్, ఆదిలాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి, వరంగల్కు చెందిన వారు నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది.
ఈవీఎంల పనితీరుపై ఏఆర్వోలు, నోడల్ అధికారులకు అవగాహన ఉండాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డిలోని ఫంక్షన్ హాల్ లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధికారులకు అవగాహన సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పోలింగ్ రోజున ఎన్నికల సిబ్బంది ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి పాల్గొన్నారు.
ఎన్నికల విధుల్లో అలసత్వం వద్దని,
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని
ఎన్నికల పరిశీలకుడు సమీర్ మాధవ్ కుర్కోటి సూచించారు. ఎన్నికల నియమావళిపై అదివారం మెదక్ కలెక్టరేట్లో వ్యయ పరిశీలకుడు సునీల్ కుమార్ రాజ్వాన్షి, జిల్లా పోలీస్ పరిశీలకుడు రామేశ్వర్ సింగ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్, SP బాలస్వామితో కలిసి జిల్లా ఎన్నికల నోడల్ అధికారులు, పోలీస్ అధికారులతో సమీక్షించారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. వెంకట్రావుపేట్ జాతీయ రహదారిపై లారీ ఢీకొని బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. బంధువులు తెలిపిన వివరాలు.. వెంకట్రావుపేట్కు చెందిన దొంతుల స్వప్న- రాము దంపతుల ఏకైక కుమారుడు ప్రణయ్(4) రోడ్డు పక్కన నడిచి వెళ్తుండగా లారీ ఢీకొని స్పాట్లోనే చనిపోయాడు. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రణయ్ పుట్టు వెంట్రుకలు నేడే తునికి నల్ల పోచమ్మ వద్ద తీశారు.
Sorry, no posts matched your criteria.