Medak

News December 2, 2024

సిద్దిపేట: కోకా కోలా ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం

image

సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్లో HCCB – కోకా కోలా ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులకు వందల సంఖ్యలో ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్లో రూ.1000 కోట్లతో కోకా కోలా కంపెనీని నిర్మించిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించడం ఇదే తొలిసారి.

News December 2, 2024

గజ్వేల్: KCR ఇలాకాలో రేవంత్ రెడ్డి మాట ఇదే!

image

సిద్దిపేట జిల్లాలో నేడు <<14764463>>CM రేవంత్ రెడ్డి పర్యటన<<>> విషయం తెలిసిందే. గజ్వేల్ పరిధి బండ తిమ్మాపూర్‌లో హిందుస్థాన్ కోకాకోలా కంపెనీని సీఎం ప్రారంభించనున్నారు. కాగా ఏడాది క్రితం కాంగ్రెస్ విజయభేరి యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన గజ్వేల్ ప్రజలకు పరిశ్రమలు తెస్తానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు CM హోదాలో పరిశ్రమలు ప్రారంభించనున్నారని కాంగ్రెస్ నేతలు తెలిపారు.

News December 2, 2024

సిద్దిపేట జిల్లాలో సీఎం పర్యటన.. షెడ్యూల్ ఇదే

image

సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండతిమ్మాపూర్ గ్రామానికి నేడు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. స్థానిక హిందుస్థాన్ కోకాకోలా కంపెనీని సీఎం ప్రారంభించనున్నారు. బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 2 గంటలకు బండతిమ్మాపూర్ చేరుకుంటారు. 3 గంటలకు తిరిగి సీఎం బేగంపేట వెళ్తారని సీఎం పర్సనల్ సెక్రటరీ నర్మల శ్రీనివాస్ తెలిపారు. రూ.వెయ్యి కోట్లతో ఈ గ్రీన్ ఫీల్డ్ ప్లాంటును నిర్మించారు.

News December 2, 2024

సిద్దిపేట: నేడు సీఎం పర్యటన షెడ్యూల్

image

సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్ గ్రామానికి సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. బండ తిమ్మాపూర్‌లో హిందుస్థాన్ కోకాకోలా కంపెనీని సీఎం ప్రారంభించనున్నారు. హెలికాప్టర్‌లో బేగంపేట నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బండ తిమ్మాపూర్ చేరుకుంటారు. 3 గంటలకు తిరిగి సీఎం బేగంపేట వెళ్తారని సీఎం పర్సనల్ సెక్రటరీ నర్మల శ్రీనివాస్ ఒక ప్రకటనలో వివరించారు.

News December 2, 2024

MDK: నేడు సీఎం రేవంత్ రెడ్డి రాక

image

సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండ తిమ్మాపూర్‌లో నూతనంగా నిర్మించిన హిందూస్తాన్ లీవర్ కోకాకోలా బేవరేజెస్ ఫాక్టరీని సోమవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి శనివారం కోకాకోలా ఫ్యాక్టరీని సందర్శించి సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్ల గురించి ఫ్యాక్టరీ అధికారులతో చర్చించారు.

News December 1, 2024

రాంచంద్రంపురం: జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌లతో సమావేశం

image

హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన ఆదివారం జీహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్‌లతో సమావేశం నిర్వహించారు. ప్రజా పాలన విజయోత్సవాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ఈనెల 7,8,9 డివిజన్, నియోజకవర్గాలు, రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి తదితరులు ఉన్నారు.

News December 1, 2024

ఈ బూటకపు ఎన్ కౌంటర్ ఏంది..?: హరీశ్ రావు

image

ఏడాది విజయోత్సవాలు ప్రభుత్వం నిర్వహిస్తుంటే ఈ బూటకపు ఎన్ కౌంటర్ ఏంది.? అని ఎమ్మెల్యే హరీశ్ రావు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. అరెస్టులు, నిర్బంధాలు, కంచెలు, ఆంక్షలు ఒకవైపు.. బూటకపు ఎన్ కౌంట్లర్లు మరోవైపు రాష్ట్రంలో అశాంతిని రేపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు అటకెక్కించి ఏడో గ్యారెంటీగా డబ్బా కొట్టిన ప్రజాస్వామ్య పాలనకు సైతం విజయవంతంగా తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.

News December 1, 2024

నర్సాపూర్: రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి దుర్మరణం

image

స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కొల్చారం మండలం రంగంపేటకు చెందిన కార్తీక్(24) మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి మిత్రుడి పుట్టినరోజు వేడుకలకు హాజరై తిరిగి HYDకి వెళ్తుండగా మియాపూర్ వద్ద ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ కార్తీక్ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు

News December 1, 2024

మెట్రో రైలు ట్రాఫిక్ కంట్రోలర్‌గా రేగోడ్ వాసి

image

మెట్రో లోకో పైలట్ స్థాయి నుంచి మెట్రో ట్రైన్స్‌ను నియంత్రించే స్థాయికి ఎదిగాడు మెదక్ జిల్లా యువకుడు. రేగోడ్‌కు చెందిన బోయిని వీరప్రసాద్ 2017లో ప్రారంభమైన HYD మెట్రోలో భాగంగా నాగోల్ నుంచి అమీర్‌పేట వరకు తొలి ప్యాసింజర్ మెట్రో నడిపారు. గతంలో మెట్రో లోకోపైలట్, మెట్రో డిపో కంట్రోలర్‌గా పనిచేసి నేడు మెట్రో ట్రాఫిక్ కంట్రోలర్ అధికారి అయ్యారు. దీంతో వీర ప్రసాద్‌ను గ్రామస్థులు, మిత్రులు అభినందిస్తున్నారు.

News December 1, 2024

దళిత సమ సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి దామోదర్

image

రాష్ట్రంలో దళిత సమ సమాజ నిర్మాణం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో నిర్వహించిన రైతు పండుగ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సమగ్ర కుటుంబ సర్వేతో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమం సమంగా అందిస్తూ ముందుకు సాగుతామన్నారు.