Medak

News April 28, 2024

బీడీ కార్మికులకు సైతం జీఎస్టీ విధించిన బీజేపీ: హరీశ్ రావు

image

బీడీ కార్మికులకు కూడా బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ విధించిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. పుర్రె గుర్తు పెట్టీ కాంగ్రెస్ పార్టీ బీడి కార్మికులను ముంచింది. బీడీ కార్మికులను అందుకున్నది కేవలం కేసిఆర్ మాత్రమే అన్నారు. చిన్న శంకరంపేట్ మండల కేంద్రంలో ప్రచారంలో పాల్గొన్నారు. మెదక్ ఎంపీగా బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామి రెడ్డి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

News April 28, 2024

చేగుంట: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

image

చేగుంట మండలం చిన్న శివునూరు చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేగుంటకు చెందిన బాలరాజు(45) మృతి చెందాడు. చేగుంట మండలం కర్నాల్ పల్లి ఎల్లమ్మ ఆలయానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై చేగుంటకు తిరుగు ప్రయాణమయ్యాడు. చిన్న శివునూరు చౌరస్తా వద్ద కారు తగలడంతో బాలరాజు కిందపడ్డారు. ఈ క్రమంలో ఆయనపై నుంచి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చేగుంట పోలీసులు  కేసు నమోదు చేశారు.

News April 28, 2024

ఎన్నికల సంఘం.. టెక్నాలజీ సద్వినియోగం !

image

ఎన్నికల సంఘం సాంకేతికతలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకుంటుంది. ఐదేళ్లకోసారి జరిగే ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారం హోరెత్తుతోంది. ప్రజలు ఎక్కువగా వాడే వాట్సప్‌ను వినియోగించుకోవాలని జిల్లా అధికారులు అంటున్నారు. దీంతో వివిధ రకాల సమాచారాలను ఓటర్లకు చేరవేస్తున్నారు.

News April 28, 2024

ఉద్దేశపూర్వకంగానే మాట్లాడుతున్న సీఎం: రఘునందన్

image

బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజులుగా ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నారని మెదక్ బీజేపీ అభ్యర్థి ఎం. రఘునందన్ రావు పేర్కొన్నారు. బీఆర్ అంబేడ్కర్ తిరిగి పుట్టినా రాజ్యాంగ సవరణ తప్ప మారదనే విషయాన్ని పీఎం మోదీ స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు అవిభక్త కవలలని ద్వజమెత్తారు.

News April 28, 2024

శివంపేట: భార్య పుట్టింటికి వెళ్లడంతో భర్త సూసైడ్

image

మెదక్ జిల్లా శివంపేట మండలం గుండ్లపల్లికి చెందిన డప్పు కుమార్(30) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం.. తరచూ మద్యం తాగి వస్తుండటంతో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 4 రోజుల క్రితం గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లగా.. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న కుమార్ శనివారం రాత్రి ఉరివేసుకున్నాడు. ఈ మేరకు శివంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News April 28, 2024

సంపూర్ణ అక్షరాస్యత.. నవభారత్ సాక్షరత

image

సంపూర్ణ అక్షరాస్యతలో భాగంగా 15 ఏళ్లు దాటిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ‘నవభారత్ సాక్షరత’ (న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులను వినియోగించుకోనున్నారు. గ్రామ పరిధిలోని నిరక్షరాస్యులైన వయోజనులను గుర్తించి అక్షరాలను నేర్పిస్తారు.

News April 28, 2024

మెదక్: మొదలైన బుజ్జగింపుల పర్వం

image

లోక్‌సభ ఎన్నికల్లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పోటీచేసిన సెగ్మెంట్‌గా, బీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోటగా, పలు ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలనూ ఆదరించిన స్థానంగా మెదక్‌కు పేరుంది. అయితే ప్రస్తుతం 53 మంది అభ్యర్థులు నామినేషన్లు వేసిన రికార్డును సైతం సొంతం చేసుకుంది. ఈ క్రమంలో స్వతంత్రులను విత్ డ్రా చేయించేందుకు ప్రధాన పార్టీలు వారిని బుజ్జగిస్తున్నారు.

News April 28, 2024

మెదక్: ఎంపీ అభ్యర్థుల ప్రచారం.. ‘అగ్ని’ ఓ పరీక్షే

image

లోక్ సభ ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయింది. ఇక అభ్యర్థులు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అభ్యర్థులు, వాటి శ్రేణులు సతమతమవుతున్నారు. వారికి ఎండ ఓ సవాలుగా మారింది. రెండు వారాలు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉంది. ఎండ తీవ్రతతో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రచారం నిర్వహించనున్నారు.

News April 28, 2024

మెదక్: అడవిలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

image

నర్సాపూర్ మండల పరిధిలోని కొండాపూర్ అడవి ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న నర్సాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతురాలు శివంపేట మండలానికి చెందిన మహిళగా అనుమానిస్తున్నారు. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభించడంతో విచారణ చేపట్టినట్టు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.

News April 28, 2024

సిద్దిపేట: లోన్ కట్టలేక వ్యక్తి ఆత్మహత్య

image

బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామానికి చెందిన సత్తయ్య (50) హౌసింగ్, ట్రాక్టర్ లోన్ తీర్చలేక శుక్రవారం మధ్యాహ్నం పురుగుల మందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు సిద్దిపేట ఆసుపత్రికి తరలించగా అక్కడి నుండి నిమ్స్ కి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మృతుని కుమారుడు హరీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణా రెడ్డి తెలిపారు.