India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన విజయోత్సవాలకు టీపీసీసీ ఇన్చార్జిలను నియమించింది. సిద్దిపేట-నారాయణరెడ్డి, మెదక్-ఆకుల లలిత, ఖేడ్-లోకేశ్ యాదవ్, ఆందోల్-పహీమ్ ఖురేషి, నర్సాపూర్-ఆంజనేయులు యాదవ్, జహీరాబాద్-మన్నె సతీష్, సంగారెడ్డి శివసేనారెడ్డి, పటాన్ చెరు-మెట్టు సాయికుమార్, దుబ్బాక-శశికళ యాదవ రెడ్డి, గజ్వేల్-పారిజాత నరసింహారెడ్డి లను నియమించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నూటికి నూరు శాతం రైతు రుణమాఫీ చేసి తీరుతామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈరోజు మహబూబ్నగర్ ‘రైతు పండుగ’ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒకేసారి రూ.18 వేల కోట్లు రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని గుర్తు చేశారు. కులగణనతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని అన్నారు.

దీక్షా-దివస్ను BRS శ్రేణులు సక్సెస్ చేశాయి. సోషల్ మీడియాలో KCR పోరాటానికి ఎలివేషన్స్ జత చేస్తూ ఆకాశానికి ఎత్తాయి. BRS MLAలు ర్యాలీలు తీసి KCR చిత్రపటానికి పాలాభిషేకాలు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు తెలంగాణ నలుమూలల నాయకులు తెలంగాణ భవన్కు క్యూకట్టారు. కానీ, KCR మాత్రం బయటకురాలేదు. ఉద్యమంలో అంతా తానై నడిచిన గులాబీ బాస్ నిన్నటి దీక్షా-దివస్లో ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించకపోవడం గమనార్హం.

మాది ప్రజా ప్రభుత్వ.. రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. రైతు రుణమాఫీకి రూ.18,000 కోట్లు, రైతు భరోసాకు రూ.7,625 కోట్లు, రైతు బీమాకు రూ.1455 కోట్లు, పంటల భీమాకు రూ.1,300 కోట్లు, ఉచిత విద్యుత్కు రూ.10,444 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. సన్న వడ్లకు బోనస్ రూ.5,040 కోట్లు కేటాయించామన్నారు.

అరవై శాతం శరీరం కాలిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారం రోజులు మృత్యువుతో పోరాడి ఓడింది. సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామానికి చెందిన మీనా హనుమంతరావు దంపతుల కూతురు స్నేహలత(18)పై ఈనెల 22న ఓ అగంతకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గాయపడ్డ ఆమెకు HYDలో చికిత్స అందించారు. 60 శాతం శరీరం కాలిన యువతి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. ఘటనపై కేసు నమోదైంది.

రాష్ట్రంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నియంత్రణపై వైద్యా,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలోనీ ప్రాథమిక ఆసుపత్రిలో అందిస్తున్న సేవల బలోపేతంపై మంత్రి చర్చించారు. సీజనల్ వ్యాధులు విస్తరించకుండా ప్రాథమిక ఆసుపత్రులలో అవసరమైన సిబ్బంది, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

సంగారెడ్డి కలెక్టరేట్లో డిసెంబర్ 4న ఎస్సీ వర్గీకరణ కోసం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ షమీమ్ అత్తర్ బహిరంగ విచారణకు హాజరవుతారని కలెక్టర్ వల్లూరు క్రాంతి శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలకు చెందిన ఎస్సీ కుల సంఘాల నాయకులు బహిరంగ విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు.

వయునాడ్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందిన ప్రియాంక గాంధీని శుక్రవారం జహీరాబాద్ ఎంపీ సురేశ్ కుమార్ షేట్కార్ కలిసి పుష్పగుచ్చాన్ని ఇచ్చారు. అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. తన గెలుపుకు కృషి చేసిన కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాలకు అన్ని సహాయ సహకారాలు అందజేస్తుందని ఆమె పేర్కొన్నారు.

సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివాస్లో సీఎం రేవంత్ పై హరీశ్ రావు మండిపడ్డారు. ‘రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా, ఇచ్చిన తెలంగాణ ప్రకటనను కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తీసుకున్నప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున మొదలైంది. అప్పుడు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తే రేవంత్ పారిపోయిండు. రేవంత్ మీద ఉద్యమ కేసులు లేవు కానీ.. ఓటుకు నోటు కేసు మాత్రం నమోదైంది’ అని హరీశ్ రావు అన్నారు.

తెలంగాణ కోసం 2009 NOV29న దీక్ష చేపట్టిన KCR.. సిద్దిపేటలోని రంగధాంపల్లి దీక్షా శిబిరానికి వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఈ క్రమంలో దీక్షా స్థలంలో అలజడి మొదలు కాగా వెంటనే హరీశ్ రావు, పద్మాదేవేందర్ రెడ్డి, సోలిపేట ఇతర నాయకులు దీక్ష చేపట్టారు. సిద్దిపేట, రంగధాంపల్లి దీక్షలు యావత్ తెలంగాణను కదిలించాయి. సిద్దిపేట, పాలమూకుల దీక్షలు ఏకంగా 1,531 రోజులపాటు కొనసాగాయి.
Sorry, no posts matched your criteria.