India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈతకు వెళ్లి బాలుడు మృతి చెందాడు. SI ప్రేమ్దీప్ వివిరాలు.. మనోహరాబాద్ మండలం పాలటకు చెందిన నితిన్(10) దౌల్తాబాద్ మండలం కోనాయిపల్లిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. అమ్మమ్మతో కలిసి బుధవారం దౌల్తాబాద్లో పెళ్లికి వెళ్లిన నితిన్ ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వచ్చాడు. వారు వచ్చేసరికే ఇంటి వద్ద మనవడు లేకపోవంతో స్థానికంగా వెతికినా ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం గ్రామంలోని చెరువులో నితిన్ మృతదేహం తేలింది.
తూప్రాన్ మండలం యావాపూర్ వద్ద రాత్రి జరిగిన <<13123863>>రోడ్డు ప్రమాదం<<>>లో మృతుడు సిద్దిపేట జిల్లాకు చెందిన ఎండీ ఖాజామియా(30)గా గుర్తించారు. రాయపోల్ మండలం ఎల్కంటి గ్రామానికి చెందిన ఖాజామియా.. గజ్వేల్ పట్టణంలో నివాసం ఉంటూ నీటి శుద్ధి మెకానిక్గా పనిచేస్తున్నాడని గ్రామస్థులు తెలిపారు. తూప్రాన్ వైపు నుంచి గజ్వేల్ వైపు వెళ్తుండగా యావపూర్ చౌరస్తా వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది.
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో శుక్రవారం నిర్వహించనున్న సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్షెట్కార్కు మద్దతుగా నిర్వహించే సభలో ఆయన పాల్గొననున్నారు. పెద్దశంకరంపేటలోని పద్మయ్య ఫంక్షన్హాల్ సమీపంలోని ఖాళీ ప్రదేశాన్ని ఎంపిక చేశారు.
ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు కలిపి మొత్తం 94 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మెదక్ పార్లమెంట్కు 54 మంది 90 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా.. జహీరాబాద్ లోక్ సభకు 40 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు సమర్పించారు. చివరి రోజు భారీగా నామపత్రాలను సమర్పించారు. ఈ నెల 26న నామపత్రాల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఉంది.
తూప్రాన్ మండలం యావపూర్ చౌరస్తా వద్ద తూప్రాన్ గజ్వేల్ రోడ్డు పై రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. తూప్రాన్ వైపు నుంచి గజ్వేల్ వైపు వెళ్తున్న బైకు.. ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రాయపోలు మండలం ఎల్కంటి గ్రామస్థులుగా అనుమానిస్తున్నారు. తూప్రాన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
నామినేషన్ల ప్రక్రియ గడువు గురువారంతో ముగిసింది. నేటితో 23 మంది అభ్యర్థులు 36 నామినేషన్లను దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం వరకు 54 మంది అభ్యర్థులు 90 నామినేషన్లను దాఖలు చేశారని రిటర్నింగ్ అధికారి తెలిపారు. శుక్రవారం నామినేషన్లను పరిశీలించనున్నారు.
KCR రాష్ట్రానికి ఏం చేశారని సీఎం రేవంత్ రెడ్డి అడిగావు కదా.? నిన్న మెదక్లో మీ అభ్యర్థి తరఫున నామినేషన్ వేశావంటే దానికి కారణం కేసీఆరే అని హరీశ్రావు అన్నారు. BRS ఎంపీ అభ్యర్థికి మద్దతుగా నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆయన మాట్లాడుతూ.. పేరుకే మెదక్ జిల్లా ఉండేదని కానీ గతంలో నామినేషన్ వేయడానికి సంగారెడ్డి వెళ్లేవారని అన్నారు. KCR మెదక్లో కలెక్టరేట్ కట్టడం వల్ల నామినేషన్ వేశావని గుర్తు చేశారు.
మెదక్, సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురి హత్యలు జిల్లాల్లో కలకలం రేపుతున్నాయి. కోహిర్ వద్ద ఆటో అద్దె డబ్బులు విషయంలో గొడవ జరిగి జగద్గిరిగుట్టకు చెందిన షేక్ అన్వర్ అలీ(30)ని మిత్రులు దాడి చేసి హతమార్చారు. నర్సాపూర్ ఎర్రగుంట తండాకు చెందిన సక్కుబాయి(48) ప్రవర్తన నచ్చక కొడుకు హంజా హత్య చేశాడు. శెట్పల్లి కలాన్లో భార్యను కాపురానికి పంపడం లేదని అల్లుడు దశరథ అత్త కౌసమ్మ(50)ను హత్య చేశాడు.
ఇంటర్ ఫలితాల్లో కొండాపూర్ మండలంలోని గిర్మాపూర్ సాంఘిక సంక్షేమ కళాశాలలో విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ సుదర్శనం తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 82 మందికి 82, ద్వితీయ సంవత్సరంలో 59కి 59 మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. ఈ సందర్భంగా పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
BRS పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి తన పేరిట రూ. 62,84,43,006 ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. అందులో 3 కిలోల పైగా బంగారం, రెండు కిలోల పైగా వెండి ఆభరణాలు ఉన్నాయి. ఇందుర్తిలో రూ. 7.88 లక్షల విలువైన 1.30 ఎకరాల భూమి, ప్లాట్లు ఉన్నాయి. ప్రణీత రెడ్డి పేరిట రూ. 4.48 కోట్ల విలువైన రాజ్పుష్ప ఫామ్స్, 3.33 కిలోల బంగారం, 2 కిలోల వెండి ఆభరణాలు ఉన్నాయి.
Sorry, no posts matched your criteria.