Medak

News November 27, 2024

రైతులను దగా చేసినందుకు పండుగ చేస్తున్నావా రేవంత్‌ రెడ్డి: హరీశ్ రావు

image

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి చేపట్టిన విజయోత్సవాలపై బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలనలో రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండుగ అంటూ మూడు రోజుల విజయోత్సవాలు చేస్తున్నావా అని ప్రశ్నించారు. గొప్పగా చెప్పిన వరంగల్ రైతు డిక్లరేషన్‌లోని 9 హామీల్లో ఒక్కటీ అమలు చేయనందుకు పండుగ చేస్తున్నావా అని మండిపడ్డారు.

News November 27, 2024

అల్లాదుర్గంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

అల్లాదుర్గం వద్ద హైవే- 161పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. బోధన్‌కు చెందిన దేశ్ ముక్ రాజశేఖర్, తండ్రి శివరాజ్, తల్లి లక్ష్మీబాయి, తమ్ముడి భార్య అరుణ, కూతురు అనన్యతో కలిసి కారులో HYD నుంచి బోధన్‌కు వెళ్తున్నారు. అల్లాదుర్గం వద్ద కారు అదుపుతప్పి బ్రిడ్జిని ఢీ కొట్టడంతో కారు నడుపుతున్న రాజశేఖర్, తండ్రి శివరాజ్ మృతి చెందారు.

News November 27, 2024

సిద్దిపేట: CPR చేసి యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్

image

కానిస్టేబుల్ సీపీఆర్ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు. స్థానికుల సమాచారం.. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మండల కేంద్రానికి చెందిన సందీప్ రెడ్డి ఆర్థిక ఇబ్బందులతో ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న కానిస్టేబుల్ లింగం వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి తలుపులు పగలగొట్టి సందీప్ రెడ్డి కిందకు దింపాడు. అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో CPR చేసి ప్రాణాలు కాపాడారు.

News November 27, 2024

మెదక్: RTCలో ఉద్యోగాలు

image

మాజీ సైనికులను ఆర్టీసీ డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. మెదక్‌ రీజియన్‌లో 81 పోస్టులను కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. అర్హులైనవారు ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
SHARE IT

News November 26, 2024

నమ్మకంతో ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలి: కలెక్టర్ రాహుల్ రాజ్

image

ఓటర్లందరూ ఎన్నికల ప్రక్రియ, భారత ఎన్నికల సంఘంపై నమ్మకం కలిగి, ప్రజాస్వామ్య ప్రాతిపదికగా నిర్వహించే ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ కోరారు. ఈవీఎంలపై ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టి వేసిందన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రమే ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించడం తగదన్నారు.

News November 26, 2024

శైలజ మృతి ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే: హరీశ్ రావు

image

ఫుడ్ పాయిజన్తో చనిపోయిన వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న నేతలను అడ్డుకోవడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని అన్నారు. ప్రభుత్వం తమ తప్పేం లేదన్నట్లు వ్యవహరించినంత మాత్రాన విద్యార్థిని ప్రాణం తీసిన పాపం ఊరికే పోదన్నారు.

News November 26, 2024

గజ్వేల్: ఆవాలతో అంబేద్కర్ చిత్రం అదుర్స్

image

రాజ్యాంగం అమోదించి 75సంవత్సరాలు పూర్తైన సందర్భంగా రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ చిత్రాన్ని గజ్వేల్ కు చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు సేవ రత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆవాలతో చిత్రించి అంబేద్కర్‌పై ఉన్న గౌరవాన్ని చాటాడు. రామకోటి రామరాజు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణం అన్నారు. అంబేద్కర్ చిత్రాన్ని ఆవాలతో ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు.

News November 26, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో చికెన్ ధరలు పెరిగాయి. కార్తీకమాస చివరి సోమవారం ముగియడంతో‌ KGపైన రూ. 10 నుంచి రూ. 20 వరకు పెంచారు. గతవారం కిలో స్కిన్‌లెస్‌ రూ. 185 నుంచి రూ. 200 మధ్య అమ్మారు. మంగళవారం స్కిన్‌లెస్ రూ. 213 నుంచి రూ. 230 వరకు విక్రయిస్తున్నారు. విత్ స్కిన్ రూ. 187 నుంచి రూ. 200గా వ్యాపారులు ధరలు నిర్ణయించారు. మరి మీ ఏరియాలో ధరలు ఏ విధంగా ఉన్నాయి. కామెంట్ చేయండి.

News November 25, 2024

దొమ్మాట మాజీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మృతి

image

కొండపాక వాస్తవ్యులు దొమ్మాట (ప్రస్తుతం దుబ్బాక) నియోజకవర్గం మాజీఎమ్మెల్యే రామచంద్రారెడ్డి మృతిచెందారు. అనారోగ్యంతో హైదరాబాద్‌ని ఓ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు. కేసీఆర్‌కు రాజకీయ సమకాలికులు. ఆయన మృతిపట్ల మాజీ మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తంచేశారు. 1983-88లో అప్పటి దొమ్మాట ఎమ్మెల్యేగా ఎంతో నిబద్ధతతో ప్రజా సేవలో ఉన్న ఆయన సేవలు నేటితరం వారికి స్ఫూర్తి అని కొనియాడారు.

News November 25, 2024

మెదక్: నేడు ప్రజావాణి కార్యక్రమం

image

సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం తెలిపారు. ఇందులో భాగంగా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరిస్తారని చెప్పారు. సమస్యలను అక్కడికి అక్కడే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.