India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా మహిపాల్ రెడ్డిని ఎన్నుకున్నట్లు జిల్లా పీఆర్టీయు అధ్యక్షుడు మానయ్య తెలిపారు. మహిపాల్ రెడ్డి సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు రాష్ట్రస్థాయిలో అవకాశం కల్పించినందుకు రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 937 మందితో DSC తుది జాబితాను విద్యాధికారులు ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులు నేడు LBస్టేడియంలో CM రేవంత్రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు. సంగారెడ్డి జిల్లాలో 397, మెదక్- 281, సిద్దిపేట- 259 మంది ఎంపికయ్యారు. వారిని సీఎం సభకు తరలించేందుకు జిల్లాల వారీగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. దసరా సెలవుల్లోగా పాఠశాలలను కేటాయించనున్నట్లు సమాచారం.
రాష్ట్ర మంత్రి సీతక్కను జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలు విన్నవించారు. ఈరోజు జ్యోతిబాపూలే ప్రజాభవన్లో మంత్రి సీతక్కను జహీరాబాద్ ఎంపీ కలిసి పార్లమెంటు పరిధిలో నెలకొన్న సమస్యలను వివరించారు. ఎంపీ విన్నవించిన సమస్యలకు మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ సురేష్ షెత్కార్ వివరించారు. సిర్గాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మనీష్ పాటిల్ పాల్గొన్నారు.
న్యాల్కల్ మండలంలో నిన్న జరిగిన <<14298722>>యాక్సిడెంట్<<>>లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. గణేశ్పూర్కు చెందిన సిద్రామ్(70).. కూతురు రేణుక, అల్లుడు జగన్నాథ్(40), మనవడు వినయ్(14)తో కలిసి బైక్పై పొలానికి వెళ్లి వస్తున్నారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనేలోగా ప్రమాదం జరిగింది. జగన్నాథ్ ఇల్లరికం అల్లుడు. ప్రమాదంలో అమ్మానాన్న, తమ్ముడు, తాతను కొల్పోయిన రేణుక ఇద్దరు కూతుళ్ల కన్నీరుమున్నీరయ్యారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి, BRS నేత హరీశ్రావు ఫైర్ అయ్యారు. హైడ్రా పేరుతో పేద ప్రజలు ఆవేదనకు గురిచేస్తోందని మండిపడ్డారు. అవకాశాలు వస్తే పేదలకు మంచి చేయాలని అంతే గానీ వారికి కన్నీరు పెట్టించడం సరికాదన్నారు. మల్కాజిగిరి పరిధిలో నిర్వహించిన దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అమ్మవారు సద్బుద్ధిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు హరీశ్ చెప్పారు.
ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. సోమవారం మెదక్ పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలువురు దరఖాస్తు దారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈకార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, దరఖాస్తు దారులు, తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లాలోని ఓపెన్ స్కూల్లో పది, ఇంటర్లో ప్రవేశం పొందేందుకు ఈనెల 31 వరకు గడువు పొడగించినట్లు జిల్లా విద్యాధికారి రాధాకిషన్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యలో చదువు ఆపేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాల కోసం స్థానికంగా ఉండే ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో సంప్రదించాలన్నారు.
గజ్వేల్ ఎమ్మెల్యే ఆఫీసును కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించారు. నియోజకవర్గంలో చాలా రోజులుగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఏఎంసీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి అన్నారు. చెక్కుల పంపిణీ చేయాలని సహకారం ఇవ్వాలని కోరుతూ.. కేసీఆర్ చిత్రపటానికి వినతిపత్రం ఇచ్చారు. వైస్ ఛైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ భాస్కర్ తదితరులు ఉన్నారు.
మెదక్ మండలం పాతూర్కు చెందిన ఆకుల రాజు(48) కుమార్తె కొడుకు HYDలోని ఓ ఆస్పత్రిలో చేరాడు. శనివారం రాత్రి మనవడిని పరామర్శించి బైక్పై తిరిగి ఇంటికి వెళ్తుండగా హైవే-765Dపై కౌడిపల్లి శివారులో ట్రాక్టర్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ రాజును చికిత్స కోసం హైదరాబాద్కు తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదైనట్లు SI రంజిత్ రెడ్డి తెలిపారు.
సంపూర్ణ రుణమాఫీ చేశారని ప్రధాని మోడీకి సీఎం రేవంత్ రెడ్డి రాసిన లేఖను మాజీ మంత్రి హరీష్ రావు తప్పుబట్టారు. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేసిందని చెప్తూ రేవంత్ రెడ్డి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడన్నారు. ఎస్బీఐ బ్యాంకులోనే 5,06,494 మంది అంటే దాదాపు 50% మంది రైతులకు రుణమాఫీ అవ్వలేదని ఆధారాలతో బయటపెట్టారు.
Sorry, no posts matched your criteria.