India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంకలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి పర్యటించారు. స్వాగతం పలికిన మహిళలతో హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మహిళలకు ఇస్తానన్న రూ.2500, తులం బంగారం అందుతున్నాయా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాటలు నీటి మీద రాతలన్నారు.

మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు నమ్మలేదని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారని, ఇక్కడ మహిళలకు రూ.2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్రలో రూ.3,000 ఇస్తామనడం.. రైతు భరోసా ఎగ్గొట్టడం.. ఆసరా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్రలో ప్రభావం చూపాయన్నారు.

ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఈరోజు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్లోని ఓ దవాఖానలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి పిల్లలు చనిపోయిన ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు బాధాకరం అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

మెదక్ మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల కూడా మంజూరైంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఇప్పటికే ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా 13 ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల స్థాపనకు వైద్య శాఖ పరిపాలన మంజూరు చేసింది. సివిల్ వర్క్స్ నిర్మాణం, పరికరాలు, ఫర్నిచర్ సేకరణకు ఒక్కో కళాశాలకు రూ.26 కోట్లు మంజూరు చేస్తూ TOMSIDCకి అప్పగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ సెక్రటరీ చోంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు.

సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్ నుంచి సమగ్ర కుటుంబ సర్వే డేటా ఎంట్రీపై సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 91.31% సర్వే పూర్తయిందని తెలిపారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

HYD OU పరిధిలోని ఎంఈ, ఎంటెక్ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరిస్తున్నట్లు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ప్రొఫెసర్ కే.శశికాంత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల రెండో సెమిస్టర్ మెయిన్, మొదటి, మూడో సెమిస్టర్ మేకప్ పరీక్షా ఫీజును సంబంధిత కళాశాలల్లో ఈ నెల 25వ తేదీ లోపు చెల్లించాలని అన్నారు. అపరాధ రుసుము రూ.500తో 28వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

తెలంగాణ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో నేడు జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ తెలిపారు. అండర్-8, 10, 12 విభాగాల్లో బాలబాలికలకు పరుగు పందెం, త్రో, జంప్స్ పోటీలు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 9:00లోపు హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు 99630 05540 నంబరుకు సంప్రదించాలన్నారు.

ఐలాపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శిగా గతంలో పనిచేసిన సచిన్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మల్లేష్ అనే వ్యక్తికి ఇంటి నంబర్ ఇచ్చేందుకు రూ.30వేలు డిమాండ్ చేసి, రూ.25 వేలకు ఒప్పందం చేసుకున్నాడు. 10వేలు తీసుకుంటుండగా వీడియో తీసిన మల్లేష్ సెప్టెంబర్ నెలలో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ విచారణలో లంచం తీసుకున్నట్లు తేలడంతో అదుపులోకి తీసుకున్నారు.

మెదక్ జిల్లాలో సమగ్ర సర్వే నిన్నటి వరకు 86 శాతం పూర్తయిందని అడిషనల్ కలెక్టర్ మెంచు నగేశ్ తెలిపారు. డేటా ఎంట్రీకోసం 516 మందిఆపరేటర్లను నియమించినట్లు పేర్కొన్నారు. 20 మంది ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు 04, ఎంపీ ఎస్వోలు-19లు ఈ డేటా ఎంట్రీలో పాల్గొంటారన్నారు. సామాజిక ఆర్థిక, విద్య, రాజకీయ కుల సర్వే కంప్యూటర్ ఆపరేటర్లు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్షల్లో ఎంపికై విధుల్లో చేరబోతున్న 8,047 కానిస్టేబుళ్లకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సోషల్ మీడియా వేదికగా ఈరోజు అభినందనలు తెలిపారు. నీతి, నిజాయతీతో వ్యవహరిస్తూ శాంతి భద్రతలు కాపాడాలని సూచించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఈ పోస్టులను భర్తీ చేశారని, వీటిని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదం అని అన్నారు.
Sorry, no posts matched your criteria.