Medak

News April 25, 2024

మెదక్: పెరుగుతున్న ప్రచార వేడి

image

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు తుది గడువు ఇంకా రెండు రోజులే ఉంది. ఇప్పటికే భాజాపా అభ్యర్థి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ అభ్యర్థి తరపున మెదక్ ఎమ్మెల్యే నామపత్రాలు దాఖలు చేశారు. బుధవారం నుంచి మిగతా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఓవైపు అన్ని పార్టీల ముఖ్య నేతలు ప్రచారం చేస్తూ, మరోవైపు నియోజకవర్గం, మండలాలు, పట్టణాల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు.

News April 25, 2024

ఇంటర్ సెకండియర్.. మెదక్‌కు 33వ స్థానం

image

ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా 65.57 శాతంతో రాష్ట్రంలో 15వ స్థానంలో నిలిచింది. 15,273 మందికి గానూ 10014 మంది పాసయ్యారు. సిద్దిపేట జిల్లా 61.08 శాతంతో 28వ స్థానంలో నిలిచింది. 7361 మందికి 4496 మంది పాసయ్యారు.
మెదక్ జిల్లా 57.49 శాతంతో 33వ స్థానంలో నిలిచింది. 5295 మందికి 3044 మంది ఉత్తీర్ణ సాధించారు.

News April 25, 2024

ఫస్టియర్‌లో సంగారెడ్డికి 18, సిద్దిపేటకు 29వ స్థానం

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో సంగారెడ్డి జిల్లా 55.29 శాతం ఉత్తీర్ణతో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది. 15,989 మందికి గానూ 8840 మంది పాసయ్యారు. సిద్దిపేట జిల్లా 48.77 శాతంతో 29వ స్థానంలో నిలిచింది. 7541 మందికి 3678 మంది పాసయ్యారు. మెదక్ జిల్లా 47.18 శాతంతో 30వ స్థానంలో నిలిచింది. 5905 మందికి 2786 మంది ఉత్తీర్ణత సాధించారు.

News April 25, 2024

సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీలోకి కేసీఆర్ సన్నిహితుడు…?

image

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ సన్నిహితుడు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ మడుపు భూంరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా పార్టీపై అలకగా ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు తెలుస్తుంది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలానికి చెందిన భూంరెడ్డి గతంలో హౌజింగ్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. నేడో, రేపో చేరే అవకాశం ఉందని టాక్.

News April 25, 2024

GREAT.. మన సంగారెడ్డి యువకుడు సైంటిస్ట్ అయ్యాడు

image

ఝరాసంగం మండలం కమాల్‌పల్లికి చెందిన శ్రీశైలం వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. సామాన్య కుటుంబంలో పుట్టి సాగుపై మక్కువతో చదివిన శ్రీశైలం.. ISRB నిర్వహించిన జాతీయ స్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక పరీక్షల ఫలితాల్లో సత్తా చాటారు. అరుణాచల్‌ప్రదేశ్ కేడర్ వ్యవసాయ శాస్త్రవేత్త(ఏఎస్‌ఆర్‌బీ)గా ఉద్యోగం సాధించారు. శ్రీశైలం విద్యాభ్యాసం 10వ తరగతి వరకు ఝరాసంగం పాఠశాలలో జరిగింది. -CONGRATS

News April 25, 2024

మెదక్: ఎండలతో ప్రచారం కష్టమే..

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారం క్రమంగా ఊపందుకుంటోంది. నామినేషన్ల సమర్పణకు ఈనెల 25 వరకు గడువు ఉంది. 29న ఉపసంహరణ ఘట్టం ముగియగానే ప్రచార పర్వం మరింత పుంజుకుంటుంది. ఇప్పటికైతే ప్రచారానికి కేవలం 19 రోజులు మాత్రమే మిగిలింది. మే 13న పోలింగ్‌ జరుగుతున్న దృష్ట్యా ఒకరోజు ముందుగా అంటే మే 11న ప్రచార కార్యక్రమాలు ముగించాలి. ఈ కాస్త సమయంలో గ్రామగ్రామాన పర్యటించడం, ఎండలు మండిపోతుండడంతో అభ్యర్థులకు సవాల్‌గా మారింది.

News April 25, 2024

MDK: వివాహేతర సంబంధంతో ప్రభుత్వ టీచర్ హత్య

image

వివాహేతర సంబంధం నెపంతో ప్రభుత్వ <<13110756>>టీచర్ హత్య<<>>కు గురయ్యాడు. చేగుంటలో అద్దెకు ఉంటున్న టీచర్ నాగరాజుకు పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం ఉందని ఆమె భర్త సత్యనారాయణ అనుమానించాడు. దీంతో నాగరాజును చంపేయాలనుకున్న అతను మరో ఇద్దరితో కలిసి గతనెల 28న అద్దె ఇంట్లోనే చంపేశారు. మరుసటిరోజు వచ్చి కారులో మృతదేహాన్ని తీసుకెళ్లి HYD శివారులో పడేశారు. కాగా సత్యనారాయణ భార్య ఆదివారం ఇంట్లో ఉరేసుకుంది.

News April 25, 2024

మెదక్ జిల్లాకు మరోసారి ప్రధాని మోదీ

image

మెదక్ జిల్లాకు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తూప్రాన్ వద్ద గత ఏడాది నవంబర్ 26న నిర్వహించిన సకలజనుల విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈనెల 30న అల్లాదుర్గంలో జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి సభను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి మోదీ మరోసారి హాజరుకానున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నారు.

News April 25, 2024

సిద్దిపేట కోర్టులో తొలిసారి హిజ్రాకు జాబ్              

image

సిద్దిపేటలోని ఇందిరానగర్‌కు చెందిన హిజ్రా ప్రశాంతికి పొరుగు సేవ కింద జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం వచ్చింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి రఘురాం, న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి స్వాతిరెడ్డి నియామకపత్రం అందజేశారు. హిజ్రాలకు సమాన హక్కు కల్పించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో తొలిసారి ఉద్యోగ అవకాశం కల్పించామని, వారు ఆత్మన్యూనతా భావానికి లోనవకుండా అన్ని రంగాల్లో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

News April 25, 2024

మెదక్: బీఫారం అందుకున్న నీలం మధు

image

మెదక్ పార్లమెంట్ అభ్యర్థి బీఫారాన్ని ఎఐసిసి కార్యదర్శి రోహిత్ చౌదరి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి చేతుల మీదుగా నీలం మధు అందుకున్నారు. ఎంపిగా గెలిచి రావాలని ఈ సందర్బంగా వారు ఆయనకు సూచించారు. వారితో ఈ కార్యక్రమంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు, మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ప్రధాన సలహాదారులు హరగోపాల్ ఉన్నారు.