Medak

News April 25, 2024

టేక్మాల్: గాలి అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం

image

ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండలం బోడ్మట్ పల్లి గ్రామంలో జహీరాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌తో కలిసి గాలి అనిల్ కుమార్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా కోరారు.

News April 25, 2024

వైభవంగా ఏడుపాయల వనదుర్గమ్మ పల్లకీసేవ

image

పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం ఏడుపాయల వనదుర్గ క్షేత్రంలో వైభవంగా పల్లకీసేవ నిర్వహించారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో రాజగోపురం నుండి శివాలయం మీదుగా భక్తి శ్రద్దలతో ఊరేగించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈసందర్బంగా.. పాలక మండలి చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్, ధర్మకర్తలు వెంకటేశం, చక్రపాణి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News April 24, 2024

మెదక్: 24మంది అభ్యర్థులు, 35 సెట్ల నామినేషన్లు

image

మెదక్ లోక్‌సభ స్థానానికి ఇప్పటి వరకు 24 మంది అభ్యర్థులు 35 సెట్ల నామినేషన్లు వేశారు. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు తరపున స్థానిక ఎమ్మెల్యే రోహిత్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్ రాంరెడ్డి పేరు ఖరారు చేసినా ఇంకా నామినేషన్ వేయలేదు. ఈనెల 24న వేస్తారని సమాచారం. ఇతర పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారు.

News April 24, 2024

మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేద్దాం: నీలం మధు

image

ప్రతిష్టాత్మకమైన మెదక్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేద్దామని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఇందుకు పార్టీ నేతలు, ముఖ్యులు, కార్యకర్తలు అందరూ శ్రమించాలని కోరారు. నర్సాపూర్ నియోజకవర్గం కుల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ గుడి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, జాతర ఉత్సవాలకు ఎంపీ అభ్యర్థి నీలం మధు హాజరయ్యారు.

News April 24, 2024

REWIND: మెదక్ ఎంపీగా ఇందిరాగాంధీ ప్రధాని

image

1980 ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలిచిన ఇందిరాగాంధీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరింది. ఇక్కడ మొత్తం 4,45,289 ఓట్లు పోల్ కాగా 3,15,077 (67.9) శాతం ఇందిరాకే రావడం విశేషం. ఆమెకు జిల్లాలో విడదీయలేని బంధ ఉంది. ప్రధాని హోదాలో పలుమార్లు జిల్లాకు వచ్చారు. సంగారెడ్డిలో జడ్పీ సమావేశంలో, 1984 జులై 19న మెదక్‌లో జరిగిన సర్పంచుల సదస్సులో పాల్గొన్నారు. 1984 అక్టోబరు 31న హత్యకు గురైనప్పుడు మెదక్‌ ఎంపీగానే ఉన్నారు. 

News April 24, 2024

అంతుచిక్కని మెదక్ ఓటరు నాడి.. !

image

మెదక్ పార్లమెంట్ ఎన్నికల ఫలితంపై అన్ని ప్రధాన పార్టీలలో ఆందోళన మొదలైంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థులకు ఓటర్ నాడీ అంతు చిక్కక ఆందోళన చెందుతున్నారు. మరోపక్క రోజురోజుకు రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఏ పార్టీ నాయకులు ఏ పార్టీలోకి పోతారో తెలియని పరిస్థితి నెలకొనడంతో కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు మెదక్ పార్లమెంటు స్థానం సవాల్‌గా మారింది.

News April 24, 2024

మదన్ రెడ్డి పోయినా BRSకి ఎలాంటి నష్టం లేదు: హరీశ్ రావు

image

మదన్ రెడ్డి BRSకు నమ్మకద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేశారని.. ఆయన పార్టీ మారినంత మాత్రమే BRSకు వచ్చిన నష్టమేమని లేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. నర్సాపూర్‌లో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. మదన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోయినా తన మిత్రుడు అని కేసీఆర్ రెండుసార్లు టికెట్ ఇస్తే నియోజకవర్గ ప్రజలు ఆయన్ను గెలిపించారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఎందుకు చేరానని మదన్ రెడ్డి బాధపడుతున్నారని అన్నారు.

News April 24, 2024

మెదక్: అత్తను దారుణంగా కొట్టి చంపిన అల్లుడు

image

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శెట్‌పల్లి కలాన్ గ్రామానికి చెందిన సూది కౌసవ్వ(50) హత్యకు గురైంది. ఆమె కూతురు శోభకు మెదక్ పట్టణానికి చెందిన మురాటి దశరథ(35)తో పెళ్లైంది. దంపతుల మధ్య గొడవలతో శోభ HYDలో అన్నావదిన వద్ద ఉంటోంది. కాగా భార్య కాపురానికి రాకపోవడానికి అత్త కౌసవ్వ కారణమని భావించిన దశరథ.. సోమవారం రాత్రి శెట్ పల్లికలాన్ వచ్చి అత్తను కొట్టి హత్య చేసి పోలీసులకు లొంగిపోయాడు. ఘటనపై కేసు నమోదు చేశారు.

News April 24, 2024

 కోహిర్‌‌లో హత్య కేసు UPDATE..

image

సంగారెడ్డి జిల్లా <<13106901>>కోహిర్‌‌లో హత్య<<>>కు కారకులైన నిందితులను పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాలు.. HYD జగద్గిరిగుట్టకు చెందిన అన్వర్ ఆలీని గురుజవాడకు చెందిన మహమ్మద్ కైఫ్, రాజనెల్లికి చెందిన ముస్తకిం కలిసి కత్తితో దాడి చేసి చంపేశారు. ముగ్గురు కలిసి తరచూ దొంగతనాలు చేసేవారు. అయితే సోమవారం రాత్రి మద్యం తాగి గొడవ దిగారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి అన్వర్‌ను హత్య చేశారని జహీరాబాద్ పట్టణ సీఐ రవి తెలిపారు.

News April 24, 2024

మెదక్ జిల్లాకు అథిరధులు వస్తున్నారు..

image

మెతుకు సీమకు వివిధ పార్టీల అతిరథులు వస్తున్నారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో వరుస పర్యటనలతో రాజకీయ వేడి పెంచబోతున్నారు. ఈనెల 25వరకు స్వీకరించనుండగా BJP అభ్యర్థి రఘునందన్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు నామినేషన్లు వేశారు. ఈనెల 24న BRS‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి నామినేషన్ వేయనున్నారు. 25న అమిత్ షా సిద్దిపేటకు రానుండగా, మే 7, 8, 10తేదీల్లో కేసీఆర్ రానున్నారు. ప్రియాంక గాంధీని వచ్చే అవకాశాలున్నాయి.