Medak

News April 21, 2024

సిర్గాపూర్: హత్య కేసులో 9 మంది పై కేసు

image

సిర్గాపూర్ మండలం సింగర్ బోగుడ తండాలో జరిగిన <<13093035>>హత్య ఘటన<<>>లో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు సిర్గాపూర్ ఎస్సై మహిపాల్ రెడ్డి ఆదివారం తెలిపారు. సింగర్ బోగుడ తండాలో శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన శ్రీను నాయక్ పై కట్టెలు, రాళ్లతో దాడి చేయగా, పరిస్థితి విషమించి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు చెప్పారు. అయితే నిందితులు పరారీలో ఉన్నారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

News April 21, 2024

నిజాంపేట: కొత్త పాస్ బుక్ ఇప్పిస్తానంటూ.. భూమి రిజిస్ట్రేషన్

image

నిజాంపేట‌లో తన భూమికి కొత్త పాస్ పుస్తకం ఇప్పిస్తానంటూ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు కుమ్మరి లచ్చవ్వ తహశీల్దార్‌కు ఫిర్యాదు చేసింది. నిజాంపేట మండల కేంద్రంలో లచ్చవ్వకు సర్వే నంబర్ 485లో 1.23 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వదిన కొడుకు కుమ్మరి పోశెట్టి కొత్త పాస్ పుస్తకం ఇప్పిస్తానంటూ తీసుకెళ్లి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఆ భూమిని ఇతరులకు రిజిస్ట్రేషన్ చేయవద్దంటూ కోరింది.

News April 21, 2024

సంగారెడ్డి: పిడుగుపాటుకు రెండు పశువులు మృతి

image

పిడుగుపాటుకు పశువులు మృతి చెందిన సంఘటన దౌల్తాబాద్ మండలంలో చోటుచేసుకుంది. దొమ్మాటకు చెందిన సందీప్ రెడ్డి ఆవు పిడుగు పాటుకు మృతిచెందగా రూ.95 వేల నష్టం వాటిల్లిందని రైతు తెలిపారు. గాజులపల్లికి చెందిన దాసరి నర్సింలు ఎద్దు పిడుగు పాటుకు మృతి చెందగా రూ.65 వేల వరకు నష్టం వాటిల్లిందని రైతు నర్సింలు వాపోయారు. వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని అంటున్నారు.

News April 21, 2024

సీఎం పర్యటనతో మెదక్ పార్లమెంట్ పరిధిలో జోష్

image

సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటనతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ వచ్చింది. ఇప్పటి వరకు నామమాత్రంగా కనిపించిన కాంగ్రెస్ పార్టీ సీఎం, మంత్రుల పర్యటనతో పరిస్థితులు పూర్తిగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తేజపరచిన ప్రసంగంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్‌తో పాటు పట్టుదల పెరిగింది. మెదక్ ఎంపీ పరిధిలోని 7 అసెంబ్లీల సమస్యలు, నాయకుల గూర్చి సంభాషించడం శ్రేణుల్లో ఎక్కడాలేని జోష్ కనిపిస్తుంది.

News April 21, 2024

ఎన్నికల తర్వాత BRS దుకాణం బంద్: సీఎం రేవంత్ రెడ్డి

image

రాష్ట్రానికి ఇంకా తానే సీఎంనని కేసీఆర్ అనుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మెదక్‌లో నీలం మధు నామినేషన్ సందర్భంగా మెదక్ వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు అయ్యాక BRS దుకాణం బంద్ అవుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం కావాలంటే మెదక్‌లో నీలం మధు‌ను గెలిపించాలన్నారు. ఇచ్చిన హామీలన్నీ ఎన్నికల తర్వాత అమలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

News April 21, 2024

మెదక్: ఎంపీ ఎన్నికల్లో పటాన్‌చెరు సెగ్మెంట్ ఓటర్లే కీలకం

image

మెదక్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల గెలుపోటములపై పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్ ప్రభావం చూపనుంది. జనవరిలో విడుదల చేసిన ఓటర్ జాబితా ప్రకారం పటాన్‌చెరు సెగ్మెంట్‌లో 4,10,170 ఓటర్లు ఉన్నారు. మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే ఇక్కడ ఓటర్లే అధికం అభ్యర్థి గెలుపోటములు ఈ సెగ్మెంట్ కీలకం కానుంది. ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో వలస కార్మికులు అధికంగా నివసిస్తుంటారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇక్కడ ఫోకస్ పెట్టారు.

News April 20, 2024

మెదక్: 9 మంది స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు

image

మెదక్ పార్లమెంటు స్థానానికి మూడో రోజు 9 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గౌటి మల్లేష్, దుబాల శ్రీశైలం, సత్యనారాయణ గౌడ్, చిక్కులపల్లి నవీన్, నాగమణి (రెండు సెట్లు), కొట్కూరు ప్రతాప్, గొంది భుజంగం, ఏ. లక్ష్మణ్, బండపల్లి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేసినట్లు వివరించారు.

News April 20, 2024

సీఎం రేవంత్ రెడ్డికి రఘునందన్ రావు సవాల్

image

దుబ్బాకలో ఓడితే మెదక్‌లో పోటీ చేయకూడదా? అని రఘునందన్ రావు అన్నారు. మెదక్‌ రో‌డ్‌ షోలో సీఎం వ్యాఖ్యాలపై ఆయన ఫైర్ అయ్యారు. ‘కొడంగల్‌లో ఓడిన రేవంత్ రెడ్డి మల్కాజిగిరిలో గెలవలేదా?. కేసీఆర్ దోచుకున్న సొమ్మును పేదలకు పంచుతానన్న రేవంత్.. ఆ దోపిడీ సొమ్మును ఎంతమందికి పంచారో చెప్పాలి. మోదీ పదేళ్ల అభివృద్దిపై చర్చకు నేను సిద్దం, రేవంత్ రెడ్డి సిద్దమా?’ అంటూ రఘునందర్‌ రావు సవాల్ విసిరారు.

News April 20, 2024

మెదక్‌‌కు గొప్ప చరిత్ర ఉంది: రేవంత్ రెడ్డి

image

మెదక్‌‌కు గొప్ప చరిత్ర ఉందని CM రేవంత్ రెడ్డి అన్నారు. 1980లో కాంగ్రెస్‌ తరఫున ఇందిరా గాంధీ నిలబడితే గెలిపించుకొని PMను చేశారన్నారు. BHEL, ఇక్రిశాట్‌ వంటి సంస్థలను కాంగ్రెస్‌ తీసుకొచ్చిందన్నారు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ‌ చేసిందేమీ‌ లేదన్నారు. ఏళ్లుగా మెదక్‌ జిల్లాను పట్టి పీడిస్తున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.

News April 20, 2024

మెదక్: పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి నీలం మధు: సీఎం రేవంత్ రెడ్డి

image

పేదల కష్టాలు తెలిసిన, బడుగు బలహీన వర్గాలకు చెందిన నీలం మధునే మెదక్ ఎంపీగా గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మల్లన్నసాగర్ భూముల కోసం మహిళలను పోలీసులతో కొట్టించిన దుర్మార్గుడని అన్నారు. 10ఏళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ.. మెదక్‌కు చేసిందేమీ లేదని, ఇప్పుడు గెలిపించినా ఏం చేయబోరన్నారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.