Medak

News September 23, 2024

ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్: ఎస్పీ

image

జాతీయ లోక్ అదాలత్ లో కేసులు పరిష్కరించుకోవాలని ఎస్పీ ఉదయ్ కుమార్ అన్నారు. ఈ నెల 28న జిల్లా కోర్టులో నిర్వహించనున్నారని, జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా కేసులు ఉన్నవారు సామరస్య ధోరణితో రాజీ పడదగిన ఆయా కేసులపై న్యాయ స్థానాల చుట్టూ తిరగకుండా కేసుల పరిష్కారం చేసుకోవాలని సూచించారు. అలాగే జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడే అవకాశం ఉన్న కేసులను లిస్ట్ అవుట్ చేసుకోవాలని సిబ్బందికి తెలిపారు.

News September 23, 2024

సంగారెడ్డి: క్రికెట్ ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక

image

ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అండర్- 19 జట్టును సంగారెడ్డిలోని జూబ్లీ క్లబ్‌లో సోమవారం ఎంపిక చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 105 మంది క్రీడాకారులు ఎంపికలో పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ చూపిన 16 మందిని ఉమ్మడి జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్లు క్రికెట్ అసోసియేషన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాజేందర్ రెడ్డి తెలిపారు.

News September 23, 2024

దాడుల‌తో MLA సునీత మ‌నో ధైర్యాన్ని దెబ్బ‌తీయ‌లేరు: కేటీఆర్

image

శివంపేట మండ‌లం గోమారంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతాల‌క్ష్మారెడ్డి ఇంటిపై నిన్న రాత్రి దాడి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా సునీతా ల‌క్ష్మారెడ్డితో కేటీఆర్ మాట్లాడారు. నిన్న రాత్రి గోమారంలో ఆమె ఇంటిపై జ‌రిగిన దాడి వివ‌రాల‌ను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. దాడుల‌తో MLA సునీత మ‌నో ధైర్యాన్ని దెబ్బ‌తీయ‌లేరు అన్న కేటీఆర్ ఆమెకు అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు.

News September 23, 2024

ఖేడ్‌: ఆ మెడికల్ షాపులపై చర్యలు తీసుకోవాలి: KVPS

image

నారాయణఖేడ్‌లో అధిక ధరలకు టాబ్లెట్లు అమ్ముతున్న మెడికల్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం ఆయన స్థానిక కేవీపీఎస్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రజలకు అధిక ధరలకు మెడికల్ యజమానులు మందులు అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని.. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News September 22, 2024

కొమురవెల్లి మల్లన్న స్వామి ఆలయంలో భక్తుల సందడి

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు కావడంతో ఆలయ పరిసరాలు మల్లన్న భక్తులతో నిండిపోయాయి. ఉదయం నుంచే స్వామి వారి దర్శనం కోసం మండపంలో బారులు తీరారు. అర్చన, అభిషేకం నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మరికొంతమంది బోనాలు సమర్పించి గంగిరేగు చెట్లు వద్ద పట్నాలు వేశారు.

News September 22, 2024

సిద్దిపేట: రైతులకు అండగా ఉంటాం: హరీశ్ రావు

image

రైతు సమస్యలపై పోరాటానికి నంగునూరు వేదికగా మారనుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. రుణమాఫీ, రైతుబంధు, పంటలకు బోనస్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఈనెల 27న నంగునూరులో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. సన్నాహక ఏర్పాట్లలో భాగంగా రైతులు, బీఆర్ఎస్ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు.

News September 22, 2024

తొగుట: నిండుకుండలా మల్లన్నసాగర్‌

image

సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌లో 21.12 టీఎంసీల నీటిని నిల్వచేసి 2024-25 సీజన్‌ పంపింగ్‌ ముగించామని ప్రాజెక్టు డీఈఈ శ్రీనివాస్‌ తెలిపారు. ఇప్పటి వరకు 18.50 టీఎంసీల గోదావరి జలాలను మల్లన్నసాగర్‌లోకి పంపింగ్‌ చేశామని, దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారిందని ఆయన తెలిపారు. మల్లన్నసాగర్‌ నుంచి 5.5 టీఎంసీల నీటిని కొండపోచమ్మ సాగర్‌కు తరలించినట్లు తెలిపారు.

News September 22, 2024

కంది: సెంట్రల్ జైలును తనిఖీ చేసిన జడ్జి

image

కందిలోని సెంట్రల్ జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ శనివారం అకస్మికంగా తనికి చేశారు. జైలులోని వంటగదిని పరిశీలించి నాణ్యతను చూశారు. జైల్లో ఉన్న ఖైదీలతో ప్రత్యేకంగా మాట్లాడారు. న్యాయవాది లేనివారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. జైలులో ఉన్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

News September 21, 2024

MDK: సీఎం రేవంత్‌ రెడ్డికి హరీశ్‌రావు లేఖ

image

వరద బాధితులకు సాయం అందించడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, హరీశ్‌రావు అన్నారు. ఇది కోతల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని తేలిపోయిందని విమర్శించారు. అందుకే వరద బాధితుల్లో ఎవర్ని పలకరించినా మీ ప్రభుత్వంపై ఆక్రోశం, ఆగ్రహం కనిపిస్తున్నాయని అన్నారు. వరద ప్రభావం తగ్గి 20 రోజులు గడిచినా ప్రభుత్వం ఇస్తానన్న పరిహారం అందక బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

News September 21, 2024

కొండా ల‌క్ష్మ‌ణ్ సామాజిక చైత‌న్యానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం: హ‌రీశ్

image

స్వాతంత్ర్య సమరయోధుడు, స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది, నిబద్ధత కలిగిన రాజకీయ వేత్త, తెలంగాణ సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనం కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. బాపూజీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా హ‌రీశ్‌రావు నివాళుల‌ర్పించారు.