Medak

News April 17, 2024

సిద్దిపేట: హోటల్ భోజనంలో గాజు ముక్క

image

సిద్దిపేట శివారు నాగులబండ వద్ద ఓ హోటల్ వినియోగదారుడు భోజనం చేస్తుండగా అన్నంలో గాజు ముక్క వచ్చింది. ఈ విషయం నిర్వాహకులకు చెప్పగా వాళ్ళు బుకాయించే ప్రయత్నం చేశారు. దీంతో ఆహార భద్రత అధికారులకు వినియోగదారుడు సమాచారం ఇచ్చారు. అధికారులు వచ్చి తనిఖీ చేశారు. గాజు ముక్క, బియ్యం నమూనాలను స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆహార భద్రత అధికారి అనూష వెల్లడించారు.

News April 17, 2024

మెదక్: సివిల్ సర్వీస్ ఫలితాల్లో నర్సంపల్లి వాసి

image

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన కె. అర్పిత నిన్న విడుదలైన సివిల్ సర్వీస్ ఫలితాల్లో 639 ర్యాంకు సాధించారు. తండ్రి అమర్ సింగ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ లో సీనియర్ మేనేజర్ గా పని చేస్తుండగా.. తల్లి రేణుక సదాశివపేట రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ర్యాంకు సాధించడం పట్ల నర్సంపల్లి వాసులు హర్షం వ్యక్తం చేశారు.

News April 16, 2024

ఎన్ని జన్మలెత్తినా మెదక్ ప్రజల రుణం తీర్చుకోలేను: KCR

image

మెదక్ ప్రజలు ఇచ్చిన ధైర్యంతోనే పోరాడి తెలంగాణను సాధించానని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. ఎన్ని జన్మలెత్తినా మెదక్ ప్రజల రుణం తీర్చుకోలేనన్నారు. ఈ గడ్డలో పుట్టిన తాను మెదక్ ప్రజల ఆశీర్వాదం వల్ల కేంద్రమంత్రి, రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి అయ్యాయని గుర్తు చేసుకున్నారు.

News April 16, 2024

మెదక్: నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ కో-ఆర్డినేటర్ల నియామకం

image

ఎంపీ ఎన్నికల సందర్భంగా మెదక్ సెగ్మెంట్ కు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. ఎర్రోళ్ల శ్రీనివాస్(సంగారెడ్డి), మాజీ ఎమ్మెల్సీ వి.భూపాల్ రెడ్డి(పటాన్చెరు), MLC-యాదవరెడ్డి(నర్సాపూర్), డీసీసీబీ చైర్మన్
చిట్టి దేవేందర్ రెడ్డి(మెదక్), మనోహార్ రావు(దుబ్బాక), జడ్పీ చైర్మన్ రోజాశర్మ(గజ్వేల్), ఫారుఖ్ హుస్సేన్(సిద్దిపేట)కు నియమించారు.

News April 16, 2024

ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి: హరీష్ రావు

image

వద్దురా నాయన కాంగ్రెస్ పాలన అని ప్రజలు అంటున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. చౌటకూరు మండలం సుల్తాన్ పూర్ మంగళవారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. 100 రోజుల్లో 6గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు. ప్రచారానికి కాంగ్రెస్ నాయకులు వస్తే చెప్పు, చీపుర్లు పట్టాలని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని కోరారు.

News April 16, 2024

జహీరాబాద్: కాంగ్రెస్‌తోనే రాష్ట్రం అభివృద్ధి: మంత్రి

image

జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట అని చెప్పారు. కాంగ్రెస్ విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. సమావేశంలో అభ్యర్థి సురేష్ షెట్కార్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

News April 16, 2024

మెదక్: ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయం: ఎమ్మెల్యే

image

దుబ్బాక ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేసిన రఘునందన్ రావు ఎంపీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడం ఖాయమని, మెదక్ గడ్డ మీద గులాబీ జెండా రెపరెపలాడటం ఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. చేగుంట మండలం వడియారంలో చేగుంట, నార్సింగి మండలాల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి‌తో కలిసి మాట్లాడారు.

News April 16, 2024

సివిల్స్‌లో మెరిసిన సిద్దిపేట జిల్లా యువకుడు

image

సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రానికి చెందిన బుద్ది అఖిల్ యాదవ్ UPSC-2023 ఫలితాల్లో సత్తా చాటారు. ఆలిండియా స్థాయిలో 321 ర్యాంకుతో విజయ ఢంకా మోగించారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అఖిల్.. ఇప్పటికే ఆలిండియా సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై IPSగా ఢిల్లీలో పనిచేస్తున్నారు. అఖిల్ తాజాగా IASగా ఎంపికయ్యారు. -CONGRATS

News April 16, 2024

మెదక్: మంజీరా నదిలో యువకుడి మృతదేహం

image

మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతనశెట్టిపల్లి శివారులోని మంజీరా బ్రిడ్జి కింద గుర్తుతెలియని వ్యక్తి మృతిదేహం లభ్యమైంది. మంజీరాలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడు ఎవరు..? ఎలా చనిపోయాడు అనేది తెలియాల్సి ఉంది.

News April 16, 2024

మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ సేవాదళ్ ఇన్‌ఛార్జీల నియామకం

image

పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలను చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ ఇన్‌ఛార్జీలను ప్రకటించింది. మెదక్ లోక్ సభ ఇన్‌ఛార్జీగా గుర్రం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ ఇన్‌ఛార్జీగా మదిలాల్ విలాస్ రావులను నియమిస్తూ టీపీసీసీ సేవాదళ్ ప్రెసిడెంట్ మద్దెల జితేందర్ నేడు ఉత్తర్వులు విడుదల చేశారు.