Medak

News September 20, 2024

మెదక్ జిల్లాలో సమిష్టి కృషితో నిమజ్జన ప్రక్రియ పూర్తి: ఎస్పీ

image

గణేశ్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. విద్యుత్, మున్సిపల్, రెవిన్యూ శాఖలను సమన్వయం చేసుకుంటూ సమిష్టి కృషితో నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. గడిచిన 12 రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు, క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బంది కృషి వల్ల గణేష్ ఉత్సవాలను విజయవంతంగా ముగిసాయన్నారు.

News September 19, 2024

సంగారెడ్డి: క్రీడా పాలసీకి దరఖాస్తుల ఆహ్వానం

image

క్రీడా పాలసీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడా అధికారి ఖాసిం బేగ్ తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఎండి ఆదేశాల మేరకు క్రీడా పాలసీ రూపొందించిందని పేర్కొన్నారు. 2019 నుంచి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులు తమ వివరాలను కలెక్టరేట్లోని జిల్లా యువజన,క్రీడా కార్యాలయంలో ఈనెల 24వ తేదీలోగా సమర్పించాలని తెలిపారు.

News September 19, 2024

MDK: వచ్చే నెల 3 నుంచి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓపెన్ స్కూల్ విధానంలో వచ్చే నెల 3 నుంచి 9 వరకు ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. అక్టోబరు 16 నుంచి 23 వ తేదీ వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఆయా విద్యాసంస్థల్లో సంప్రదించాలని ఆయన కోరారు.

News September 19, 2024

సిద్దిపేట: అథ్లెటిక్ పోటీల్లో సత్తాచాటిన చింతమడక విద్యార్థినిలు

image

సిద్దిపేట డిగ్రీ కళాశాలలో జరిగిన జిల్లా అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో చింతమడక జడ్పీ పాఠశాలలో విద్యార్థినులు సత్తా చాటారు. 8వ తరగతి చదువుతున్న దుంపటి రుక్మిత అండర్-1480 మీటర్ల, జెళ్ల అవంతిక 3000 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ ఇద్దరూ ఈనెల 19 నుంచి 29 వరకు ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారని HM కొత్త రాజిరెడ్డి తెలిపారు.
-CONGRATS

News September 18, 2024

దుబ్బాక వస్త్రాలంకరణలో అయోధ్య బాల రాముడు

image

అయోధ్య బాలరాముడిని సిద్దిపేట చేనేత వస్త్రాలతో మనోహరంగా అలంకరించారు. దుబ్బాకలోని హ్యాండ్లూమ్‌ అండ్‌ హ్యాండీక్రాఫ్ట్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ తయారు చేసిన చేనేత వస్ర్తాలతో నిన్న బాల రాముడు మెరిసిపోయారు. చేనేత మగ్గాలపై 80/100 లియా లెనిని ఫ్యాబ్రిక్‌తో గల 16 మీటర్ల తెలుపు రంగు వస్ర్తాన్ని తయారు చేసి అందజేసినట్టు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు బోడ శ్రీనివాస్‌ తెలిపారు.

News September 18, 2024

సంగారెడ్డి: టీవీ చూద్దామని పిలిచి.. చిన్నారిపై అత్యాచారం

image

చిన్నారిపై అత్యాచారం జరిగిన ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారి(7)ని టీవీ చూద్దామని ఇంటి పక్కన ఉన్న యువకుడు (18) ఇంట్లోకి తీసుకెళ్లి.. అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లి ఇంటికి వచ్చే సరికి చిన్నారి తీవ్ర రక్తస్రావమై పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు ఫైల్ చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.

News September 18, 2024

సంగారెడ్డి: నవోదయలో ప్రవేశాలు.. ఈనెల 23 వరకు ఛాన్స్

image

వర్గల్ నవోదయ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడవు ఈనెల 23 వరకు పెంచినట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థుల చేత దరఖాస్తు చేయించాలని కోరారు.

News September 18, 2024

అబద్దాల పునాదులపై ఏర్పడిందే కాంగ్రెస్‌ సర్కార్: హరీష్ రావు

image

అబ్దాల పునాదులపై ఏర్పడిందే కాంగ్రెస్‌ సర్కార్ అని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైందని సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 16వ ఆర్థిక సంఘం ముందు మళ్లీ అవే అబద్దాలను వల్లెవేయడం సిగ్గు చేటన్నారు. రాష్ట్ర ప్రతిష్టను, పరపతిని దిగజార్చేలా వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. మెదక్‌లో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.

News September 17, 2024

టేక్మాల్: మోడీ చిత్రపటానికి శాలువా కప్పి విషెష్

image

టేక్మాల్ మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు డాకప్పగారి నవీన్ గుప్తా, బీజేపీ జిల్లా మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల మల్లికా అశోక్ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి శాలువా కప్పి సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నేతలు అశోక్, కొయిలకొండ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

News September 17, 2024

MDK: ముగ్గురు వైద్య సిబ్బంది సస్పెండ్

image

కౌడిపల్లి ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు వైద్య సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. కౌడిపల్లి ఆస్పత్రిని నేడు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు. సిబ్బంది రమేష్, రాధాకృష్ణ, అహ్మద్ షకీల్ హాజరు పట్టికలో సంతకం చేసి విధుల్లో లేకపోవడంతో ఆ ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్ఓ డా. శ్రీరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.