Medak

News April 16, 2024

సిద్దిపేట: మంచి ఫలితం రాకపోతే ఆందోళన వద్దు !

image

త్వరలో టెన్త్, ఇంటర్ వార్షిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విద్యార్థులకు తల్లిదండ్రులు, సమాజం అండగా నిలవారని నిపుణులు అంటున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని, ఫెయిల్ అయ్యారని కారణంతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా వారిని ఓ కంట కనిపెట్టాలన్నారు. వారిలో ఆత్మస్థైర్యం పెంపొందించాలని ఒకవేళ ఫెయిల్ అయితే వృత్తి నైపుణ్య కోర్సుల వైపు ప్రోత్సహిస్తూ.. సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేస్తూ భరోసా కల్పించాలన్నారు.

News April 16, 2024

మెదక్: ఈనెల 18న నీలం మధు నామినేషన్

image

మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ఈనెల 18న నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ సందర్భంగా మెదక్ పట్టణంలో సుమారు 50 వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం సన్నాహాలు చేస్తుంది. మెదక్ పట్టణంలో ఈ ర్యాలీ కోసం ఇప్పటికే ఏఆర్ఓకు దరఖాస్తు చేసినట్లు సమాచారం. నామినేషన్ సందర్భంగా పార్టీ బలం నిరూపించేలా పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమానికి మంత్రులు హాజరు కానున్నారు.

News April 16, 2024

సదాశివపేట: మనస్తాపంతో బాలిక ఆత్మహత్య

image

సదాశివపేటలో మనస్తాపంతో బాలిక ఆత్మహత్య చేసుకుంది. CI మహేష్‌గౌడ్‌ తెలిపిన వివరాలు.. మండల కేంద్రానికి చెందిన బాలిక(17) బీఫార్మసీ చదువుతోంది. ఆమె పలు కారణాలతో 2 నెలలుగా మానసిక వేదనతో ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలో సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఊరేసుకుంది. ‘నా చావుకు ఎవరు కారణం కాదు’ అని లేఖలో పేర్కొన్నట్లు సీఐ చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

News April 16, 2024

మెదక్: రోడ్డుపై వరి ధాన్యం.. బొలేరో వాహనం బోల్తా

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామరచెరువు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై దాన్యం అరబోయడంతో కోళ్ల లోడుతో వెళ్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న కోళ్లు మృత్యువాత పడగా డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దని అధికారులు అవగాహన కల్పించినప్పటికీ రైతులు ధాన్యం ఆరబోయడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News April 16, 2024

సిద్దిపేట: అరచేతిలో ఓటరు సమాచారం !

image

లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మరోవైపు సోమవారం వరకు కొత్త ఓటర్ నమోదుకు అవకాశం కల్పించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో వందలాది మంది యువత ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే ఓటర్ జాబితాను విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో ఓటర్లకు ఎలాంటి సందేహం ఉన్నా నివృత్తి చేసుకునేలా ఓటర్ హెల్ప్ లైన్ యాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు.

News April 16, 2024

సిద్దిపేట: వరి పంటపై జాగ్రత్తలు తప్పనిసరి !

image

ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట చేతికొచ్చే సమయంలో రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సకాలంలో పంటను కోసి సరైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తే విపణిలో మంచి ధర పలుకుతుందని సిద్దిపేట తోర్నాల వ్యవసాయ పరిశోధన కేంద్రం కోఆర్డినేటర్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జక్కుల విజయ్ సూచిస్తున్నారు. ప్రస్తుతం కూలీల కొరత వేధిస్తున్న నేపథ్యంలో యంత్రాలు వినియోగిస్తే తక్కువ సమయంలో కోత చేసుకోవచ్చని అన్నారు.

News April 16, 2024

మెదక్: గన్నిసంచులకు నిప్పు పెట్టిన దుండగులు

image

మెదక్ జిల్లా నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని సంచులకు గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. సోమవారం మధ్యాహ్నం దాన్యం కొనుగోలు కేంద్రాలు వద్ద గన్ని సంచులను నిల్వ చేశారు. మధ్యాహ్న సమయంలో గుర్తు తెలియని దుండగులు గన్ని బ్యాగులకు నిప్పు పెట్టడంతో దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న సొసైటీ చైర్మన్ బాదే చంద్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News April 15, 2024

HYDలో మెదక్ వాసి సూసైడ్

image

HYD కూకట్‌పల్లి PS పరిధి ప్రకాశ్‌నగర్‌లో మెదక్‌ వాసి సూసైడ్ చేసుకొన్నాడు. సోమవారం రమేశ్(20) అనే డెలివరీ బాయ్ ఆత్మహత్య చేసుకొన్నాడు. SI రామకృష్ణ వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా సీతారాంనగర్‌కి చెందిన రమేశ్ ప్రకాశ్‌నగర్‌లో నివాసం ఉంటూ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇంట్లో పరిస్థితులు, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News April 15, 2024

MDK: గుండెపోటుతో ఆర్టీసీ కంట్రోలర్ మృతి

image

గుండెపోటుతో ఆర్టీసీ కంట్రోలర్ మరణించిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. మెదక్ డిపోలో కంట్రోలర్‌గా పనిచేస్తున్న ఎండి. ఆరిఫ్ (55)కు ఆదివారం గుండెపోటు రాగా తార్నాక ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్టంట్ వేశాక చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య సుల్తానా, ముగ్గురు కుమారులున్నారు. ఆరిఫ్ స్వగ్రామం పాపన్నపేట మండలం కుర్తివాడ. ప్రస్తుతం మెదక్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు.

News April 15, 2024

MDK: మాజీ MLA కారులో డబ్బులు పట్టివేత

image

ఎన్నికల కోడ్‌ వేళ మాజీ MLA కారులో డబ్బులు పట్టుబడ్డాయి. హవేలీ ఘనపూర్ మండల శివారులో సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ వాహనంలో రూ. 1,80,000 పట్టుబడినట్లు SI ఆనంద్ గౌడ్ తెలిపారు. ఎటువంటి ఆధారాలు చూపనందున సీజ్ చేసి కలెక్టర్ కార్యాలయంలో డిపాజిట్ చేసినట్లు పేర్కొన్నారు. కారులో ఉన్న నితిన్ రెడ్డి, మనోజ్‌లను అదుపులోకి తీసుకున్నామన్నారు.