Medak

News November 2, 2024

సంగారెడ్డి: వీఆర్‌లో ఉన్న ఎస్సై వినయ్ కుమార్ సస్పెండ్

image

సంగారెడ్డి వీఆర్ ఉన్న ఎస్సై వినయ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. సంగారెడ్డి రూరల్ ఎస్సైగా వినయ్ కుమార్ పనిచేస్తున్న సమయంలో అక్రమ ఇసుక రవాణా అరికట్టడంలో సక్రమంగా విధులు నిర్వహించ లేదని వీఆర్‌కు బదిలీ చేశారు. కాగా, ఈరోజు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

News November 1, 2024

గంజాయి స్మగ్లర్లకు సహకారం.. ఎస్సై, హెడ్, కానిస్టేబుల్ సస్పెండ్

image

గంజాయి స్మగ్లర్లకు సహకరించిన పటాన్‌చెరు ఎస్సై అంబరియా, సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ మారుతి నాయక్, ఏఆర్ కానిస్టేబుల్ మధును సస్పెండ్ చేస్తూ ఐజీ సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. మనూరు ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో సనాత్పూర్, నిజామాబాద్ జిల్లా వర్ని వద్ద గంజాయి పట్టుకొని నిందితులను వదిలిపెట్టారు. నిందితులు మరోసారి పట్టు పడడంతో విషయం బయటపడింది. ఎన్డీపీఎస్ యాక్ట్ నమోదుకు పరిశీలిస్తున్నట్లు వివరించారు.

News November 1, 2024

బెజ్జంకి: డీఎస్సీలో ఎంపిక కాలేదని నిరుద్యోగి ఆత్మహత్య

image

డీఎస్సీలో ఎంపిక కాలేదని నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SI కృష్ణారెడ్డి వివరాలు.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గుగ్గిళ్ల గ్రామానికి చెందిన సోము శంకర్(33) పీజీ వరకు చదువుకున్నాడు. ఇటీవల DSC రాయగా ఎంపిక కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News November 1, 2024

కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో దీపావళి వేడుకలు

image

దీపావళి పురస్కరించుకొని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ కుమార్తెలు రంగురంగుల పూలతో అలంకరించిన దీప కాంతులు వెలిగించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జిల్లా ప్రజలకు ఆనందం, శాంతి, విజయాలతో నిండిన సంతోషకరమైన సమయాన్ని గడపాలని ఆకాంక్షించారు.

News October 31, 2024

నవంబర్ 2 నుంచి ఏడుపాయలలో ప్రతి రోజు కార్తీక దీపోత్సవం: ఈఓ

image

కార్తీక మాసం సందర్భంగా నవంబర్ 2 నుంచి ఏడుపాయలలో వనదుర్గమాత ఆలయం వద్ద ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి సామూహిక దీపోత్సవం జరుగుతుందని ఈఓ చంద్రశేఖర్ రావు తెలిపారు. మట్టి ప్రమిదలు దేవస్థానం నుంచి ఉచితంగా ఇవ్వబడుతుందన్నారు. ఈ నెల 15న సాయంత్రం 6 గంటలకు దీపోత్సవం, పల్లకి సేవ ఉంటుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నెల రోజుల పాటు సాయంత్రం దీపాలు వెలిగించడం జరుగుతుందన్నారు.

News October 31, 2024

జహీరాబాద్: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడి అరెస్ట్

image

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు జహీరాబాద్ రూరల్ సీఐ హనుమంతు తెలిపారు. వికారాబాద్ జిల్లా జీవంగి గ్రామానికి చెందిన వినీల్ 7 నెలల క్రితం ఇన్‌స్టా‌లో న్యాల్కల్ మండలం రాఘవపూర్ ‌ చెందిన ఓ బాలిక(15)తో పరిచయం ఏర్పడింది. బాలిక గ్రామానికి వచ్చి, ఊరి శివారులో తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తండ్రి ఫిర్యాదుతో యువకుడిని అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదయిందన్నారు.

News October 31, 2024

జిన్నారం: నవంబర్ 2న ఉమ్మడి జిల్లా క్రికెట్ ఎంపికలు

image

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 2న ఉమ్మడి జిల్లా క్రికెట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ అమూల్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిన్నారం టీటీడబ్ల్ఆర్ఎస్ పాఠశాలలో అండర్ 17 బాలుల క్రికెట్ ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఉ.9 గంటలకు హాజరు కావాలని సూచించారు. ఇతర వివరాలకు 6281440401,9505796688 నంబర్లను సంప్రదించాలని కోరారు.

News October 31, 2024

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

image

తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మనిషి తనలోని మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞాన దీపాలను వెలిగించుకోవాలనే తాత్వికతను దీపావళి పండుగ మనకు అందిస్తుందని కేసీఆర్ తెలిపారు. దీపావళి పర్వదినానికి హిందూ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దీపావళి సందర్భంగా కేసీఆర్ ప్రార్థించారు.

News October 30, 2024

సంగారెడ్డి: టెన్త్ ప్రత్యేక తరగతుల సమయంలో మార్పులు

image

పదో తరగతి ప్రత్యేక తరగతుల సమయంలో మార్పులు చేస్తూ సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ.. సాయంత్రం 4.15 నుంచి 5.15 గంటల వరకు అన్ని ప్రభుత్వ, కేజీబీవీ పాఠశాలలు పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు.

News October 30, 2024

మెదక్: మోత మోగుతున్న ‘టపాసుల’ ధరలు !

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో టపాసుల ధరలు మోత మోగుతున్నాయి. షాపుల అనుమతి, ఇతరత్రాకు సంబంధించి మామూళ్లు చెల్లించిన వ్యాపారులు ఆ భారమంతా వినియోగదారులపై మోపుతున్నారు. భారీగా పెరిగిన టపాసుల ధరలతో ఈ ఏడాది సాధారణ, మధ్యతరగతి వారు టపాసులు కొనాలంటేనే జంకుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కాకర పుల్ల నుంచి 1000 వాలా వరకు టపాసుల ధరలు 30% పెరిగాయి. వ్యాపారులు వారి నోటికి ఎంత వస్తే అంతే చెప్పి ధరలు పిండుకుంటున్నారు.