Medak

News April 15, 2024

HYD: వివాహేతర సంబంధం.. DSP ఇంటి ముందు ఆందోళన

image

ఆదిభట్ల PS పరిధి తుర్కయంజాల్ శ్రీ సాయిపంచవతి హోమ్స్‌‌లోని DSP రంగా నాయక్ ఇంటి ముందు ఆయన భార్య ఆందోళనకు దిగారు. వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను పట్టించుకోవడం లేదని జ్యోతి ఆరోపిస్తున్నారు. తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారని.. న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్నారు. కాగా, రంగా నాయక్ ప్రస్తుతం మెదక్ ఏఆర్ డీఎస్పీగా పని చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

News April 15, 2024

కత్తిమీద సాములా మెదక్ ఎంపీ ఎన్నికలు

image

లోక్‌సభ ఎన్నికలు ప్రధాన పార్టీల నేతలకు అగ్ని పరీక్షలా మారాయి. ఆయా BRS, కాంగ్రెస్, BJP అభ్యర్థుల గెలుపు బాధ్యతలు అప్పగించడంతో ప్రచారంలో తలమునకలై ఉన్నారు. మెదక్‌ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో BRS-6 చోట్ల, కాంగ్రెస్‌ ఒక చోట గెలుపొందాయి. మెదక్ ఎంపీ స్థానాన్ని ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయాలు రంజుగా మారాయి. దీంతో ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కత్తి మీద సాములా మారాయి.

News April 15, 2024

MDK: కూరుతు కళ్లేదుటే తండ్రి దుర్మరణం

image

రోడ్డు ప్రమాదంలో కూరుతు కళ్లేదుటే తండ్రి మృతిచెందాడు. మేడ్చల్ పోలీసుల సమాచారం.. మెదక్‌ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌కు చెందిన రామ్ మురాట్ తన కుమార్తె(6)తో కలిసి ఆదివారం రాత్రి బైక్‌పై మేడ్చల్ నుంచి వస్తుండగా హైవేపై ఐసీఐసీఐ బ్యాంక్ సమీపంలో లారీ తగిలింది. దీంతో కిందపడ్డ రామ్ పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. చిన్నారి స్వల్పగాయాలతో బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేశారు.

News April 15, 2024

మెదక్ జిల్లాలో వార్షిక పరీక్షలు ప్రారంభం

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు నేటి నుండి వార్షిక పరీక్షలు ప్రారంభమాయ్యాయి. పరీక్షలు బాగా రాసేలా విద్యార్థులను ఉపాధ్యాయులు సన్నద్ధం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక, ప్రాథమికొన్నత, ఉన్నత పాఠశాలల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా విద్యాధికారి ప్రొ. రాధాకిషన్ ఆధ్వర్యంలో ఎండలు మండుతున్నందున అన్ని ఏర్పాట్లు చేశారు.

News April 15, 2024

MDK: ఓటరు నమోదుకు నేడే చివరి తేదీ..

image

అర్హులైన యువతీ, యువకులు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకునేందుకు నేడే చివరి అవకాశం. ఈనెల 16న పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి కొనసాగుతున్న నూతన ఓటరు నమోదు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈనెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి ఉండి ఇంకా ఓటరు జాబితాలో పేరు లేని వారు ఓటు నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

News April 15, 2024

మెదక్: పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కొండా సురేఖ

image

కాంగ్రెస్ లోకసభ అభ్యర్థులు, ఇంఛార్జీలతో నోవాటెల్ హోటల్ లో జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటిలో మెదక్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండా సురేఖ హజరయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన అంశాలపై చర్చించారు. ఈ చర్చలో మెదక్, జహీరాబాద్ లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నీలం మధు, సురేశ్ షేట్కార్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హజరయ్యారు.

News April 15, 2024

సిద్దిపేట: 20 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, ఉమ్మడి మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ సంయుక్తాధ్వర్యంలో సిద్దిపేటలో ఈనెల 20 నుంచి సిద్దిపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ క్రీడా మైదానంలో నెల రోజులపాటు ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి కలకుంట్ల మల్లికార్జున్ తెలిపారు.

News April 15, 2024

మెదక్ జిల్లాలో పెరుగుతన్న కిడ్నీ వ్యాధిగ్రస్థులు..!

image

మెదక్ జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో గతేడాది 73 మంది ఉండగా.. తాజాగా ఆ సంఖ్య 120కి చేరింది. అయితే ఒక్క చేగుంట మండలంలోనే అత్యధిక బాధితులు ఉన్నారని, 18- 20 మంది మెదక్ ఆస్పత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. కాగా కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్న మండలాల్లో తాగునీటిని ల్యాబ్‌కు పంపి చర్యలు తీసుకుంటామని వైద్యాధికారి తెలిపారు.

News April 15, 2024

MDK: బీజేపీతో రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యాడు: హరీశ్ రావు

image

CM రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకు బీజేపీ‌తో ములాఖత్ అయ్యాడని సిద్దిపేట MLA హరీశ్ రావు స్పష్టం చేశారు. జహీరాబాద్‌లో జరిగిన కార్యకర్తల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బీజేపీని గెలిపించేందుకు కొన్ని స్థానాల్లో డమ్మీ క్యాండిడేట్లను నిలబెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీజేపీకి ఓటు వేసినట్టే అని ఆయన అన్నారు. ఇందులో MLA మాణిక్ రావు, BRS పార్టీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ తదితరులు ఉన్నారు.

News April 14, 2024

సంగారెడ్డి: BRS హయాంలో నిర్బంధాలకు గురయ్యాం: మంత్రి కొండా సురేఖ

image

తాను ఎవ్వరికీ భయపడేది లేదని, భయపడితే రాజకీయం చేయలేమని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణంలో అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ జగ్గారెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అక్రమ కేసులు నమోదై జైలుకు వెళ్లామన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్బంధాలకు గురయ్యామని అన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు.