India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కలెక్టర్గా ఇక్కడికి 100 సార్లు వచ్చానని, నేడు ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న నన్ను ఆశీర్వదించాలని ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి కోరారు. జగదేవపూర్లో జరిగిన జగదేవపూర్, మర్కుక్ మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవ రెడ్డి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి మాట్లాడారు. వచ్చే 30 రోజుకు నా కోసం కష్టపడాలని కార్యకర్తలను కోరారు.
యాభై కుటుంబాలతో చూడటానికి చిన్న గ్రామమైనా.. ఆదర్శంలో మాత్రం పెద్దది. దేశ సేవకోసం మేము సైతం అంటూ ఆ గ్రామ యువత కదిలారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 25మందికిపైగా సైన్యంలో చేరి దేశ రక్షణలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. మర్కూక్ మండలం గంగాపూర్కు రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల నుంచి ఎన్నో ఏళ్ల కిందట వచ్చిన ‘రాజ్పుత్’లతో గంగాపూర్గా ఆవిర్భవించింది. చాలా ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు.
యాభై కుటుంబాలతో చూడటానికి చిన్న గ్రామమైనా.. ఆదర్శంలో మాత్రం పెద్దది. దేశ సేవకోసం మేము సైతం అంటూ ఆ గ్రామ యువత కదిలారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు ఏకంగా 25మందికిపైగా సైన్యంలో చేరి దేశ రక్షణలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. మర్కూక్ మండలం గంగాపూర్కు రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల నుంచి ఎన్నో ఏళ్ల కిందట వచ్చిన ‘రాజ్పుత్’లతో గంగాపూర్గా ఆవిర్భవించింది. చాలా ఏళ్ల కిందట ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు.
నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి ఈనెల 15న కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ టికెట్ను వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ కేటాయించారు. దీంతో కాంగ్రెస్లో చేరేందుకు ఇటీవల మాజీ ఎమ్మెల్యే మైనంపల్లితో వెళ్లి రేవంత్రెడ్డిని కలిసి చర్చించారు. సీఎం నుంచి క్లారిటీ రావడంతో కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమైనట్లు టాక్. అయితే చేరికపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఓటు నమోదుకు మరో రెండు రోజులే గడువు ఉంది. ఉమ్మడి జిల్లాకు చెందిన అర్హులందరూ ఈనెల 15లోగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని, మే 13న జరిగే లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కను వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఫిబ్రవరి 8న లోక్సభ ఎన్నికల ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. సిద్దిపేట జిల్లాలో 9,61,361 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటికే జిల్లాలో 5 వేలకు పైగా ఫాం-6 దరఖాస్తులు వచ్చినట్లు అదికారులు తెలిపారు.
ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద ఘటన దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మంటల వ్యాప్తితో జరిగిన అగ్ని ప్రమాదం కాదని, పేలుడు వల్ల జరిగిన విస్ఫోటనం అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ పరిశ్రమలో పేలుడు పదార్థాల(ఎక్స్ప్లోసివ్)కు సంబంధించిన ఉత్పత్తుల కార్యకలాపాలు జరిగినట్లు భావిస్తున్నారు. 40చోట్ల రసాయన అవశేషాల శాంపిల్స్ను ఫోరెన్సిక్ విభాగం సేకరించింది.
“నన్ను రాజకీయంగా ఎదుర్కునే సత్తా లేక మీడియాకు లీకులిచ్చి, తప్పుడు వార్తలు రాయించి లబ్ది పొందాలని బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నిస్తున్న తీరు సిగ్గుచేటు” అని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డి ఫైరయ్యారు. గత ఎన్నికల్లో పోటీ కూడా చేయని తనను.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టు కథలు అల్లి ప్రచారం చేయడం బట్ట కాల్చి మీద వేయడమేనని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమా అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. సంగారెడ్డిలోని గార్డెన్లో నియోజకవర్గ టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 10 సంవత్సరాల్లో బీజేపీ రాష్ట్రానికి చేసింది ఏం లేదని విమర్శించారు. ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.
చింతమడకలో ఈ నెల 17న శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తున్నారు. సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకకు హాజరుకావాలని బీఆర్ఎస్ సీనియర్ నేత కల్వకుంట్ల వంశీధర్ రావు మాజీ సీఎం కేసీఆర్ దంపతులను ఆహ్వానించారు. శనివారం ఆహ్వాన పత్రాన్ని కేసీఆర్కు అందించారు. ఈ కార్యక్రమంలో చింతమడక గ్రామ పెద్దలు రామాగౌడ్, హంస కేతన్రెడ్డి, పోశయ్య, సత్యనారాయణ గౌడ్, శేఖర్, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.
ఎన్నికల వేళ బీజేపీకి మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో షాక్ తగిలింది. ఆ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ ఛార్జీ, సదాశివపేట మున్సిపల్ కౌన్సిలర్ పులి మామిడి రాజు హస్తం గూటికి చేరారు. నేడు హైదరాబాద్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలోకాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, జగ్గారెడ్డి, ఎంపీ అభ్యర్థి నీలం మధు పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.