Medak

News October 27, 2024

మెదక్: ‘టపాసుల దుకాణాలకు అనుమతి తప్పనిసరి’

image

దీపావళి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసే టపాసుల దుకాణాలకు దుకాణదారులు సంబంధిత డివిజనల్ స్థాయి పోలీసు అధికారి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా దుకాణాలు నెలకొల్పితే వారిపై ఎక్స్ ప్లోజివ్ యాక్ట్ 1884, రూల్స్ 1993 సవరణ 2008 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News October 26, 2024

కమ్యూనిస్టులు లేకుండా దేశం లేదు: తమ్మినేని

image

కమ్యూనిస్టులు లేకుండా దేశం లేదని, కష్టాలు, కన్నీళ్లు ఉన్నంత కాలం ఎర్రజెండా ఎక్కడికీ పోదని CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర అన్నారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన CPM రాష్ట్ర మహాసభల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందే అని తమ్మినేని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

News October 26, 2024

హుస్నాబాద్‌లో మెగా విదేశీ జాబ్ మేళా: మంత్రి పొన్నం

image

హుస్నాబాద్‌లో వచ్చే నెల 2వ వారంలో నిరుద్యోగ యువత కోసం మెగా విదేశీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ఉద్యోగ మేళాలో పాల్గొనే యువత ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. తన ఛాంబర్‌లో మంత్రి టాంకాం ప్రతినిధులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి ఉద్యోగ మేళా విషయమై మాట్లాడారు.

News October 26, 2024

MDK: పెళ్లిళ్ల సీజన్.. ఇదీ పరిస్థితి.!

image

పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని బట్టల షాప్‌లు, పండ్ల, పూల షాప్‌లు, పెండ్లి పత్రికలతో పాటు మటన్, చికెన్ ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు బంగారం ధర తులం రూ.81 వేలు పలుకుతోంది. చికెన్ కిలో రూ.250, మటన్ కిలో రూ.900 ఉండగా మధ్య తరగతి అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేయాలంటే జంకుతున్నారు.

News October 26, 2024

ఓయూ దూర విద్యలో దరఖాస్తులకు ఆహ్వానం

image

దూర విద్య ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 5వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుంతో 8వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష నవంబర్‌ 9న జరగనుందని తెలిపారు. వెబ్‌సైట్‌: www.ouadmissions.com

News October 25, 2024

జీవన్ రెడ్డి సమస్యను పరిష్కరించాలి: జగ్గారెడ్డి

image

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమస్యను సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ త్వరగా పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శుక్రవారం కోరారు. జీవన్ రెడ్డికి తాను అండగా ఉంటానని చెప్పారు. తామిద్దరం నియోజకవర్గాలను అభివృద్ధి చేసినా ఈ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి ఆవేదనను పార్టీ నాయకులు అర్థం చేసుకుంటారని వివరించారు.

News October 25, 2024

సంచలనాల కోసం వార్తలు రాయకూడదు: ఎంపీ రఘునందన్ రావు

image

PIBHyderabad ఆధ్వర్యంలో నేడు మెదక్ పట్టణంలో వార్తలాప్- మీడియా వర్క్‌షాప్ జరిగింది. అతిథిగా మెదక్ ఎంపీ ఎం. రఘునందన్ రావు, ముఖ్య అతిథిగా జిల్లా పాలనాధికారి రాహుల్ రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. విలేకరులు ప్రజా సమస్యలను, వాస్తవాలను ఎత్తి చూపాల్సిందిగా ఎంపీ రఘునందన్ రావు జర్నలిస్టులను కోరారు. సంచలనాల కోసం వార్తలు రాయకూడదని జర్నలిస్టులకు తెలిపారు.

News October 25, 2024

సమర్థవంతంగా ధాన్యం కొనుగోలు చేయాలి: మంత్రి 

image

ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం మెదక్‌లో ఇంచార్జి మంత్రి సురేఖతో కలిసి వ్యవసాయం, జిల్లా గ్రామీణ అభివృద్ధి, మార్కెటింగ్ సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. రైతులకు సకాలంలో డబ్బులు జమ చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే రోహిత్, కలెక్టర్ రాహుల్ రాజ్ ఉన్నారు.

News October 24, 2024

ఆరోగ్యం మనిషి ప్రాథమిక హక్కు: మంత్రి

image

రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. ఆరోగ్యం మనిషి ప్రాథమిక హక్కు అన్నారు. దౌల్తాబాద్‌లో రూ. 1.56 కోట్లతో నిర్మించిన పీహెచ్సీ ప్రారంభించారు. పిహెచ్సిని ముపై పడకల ఆసుపత్రిగా మార్పు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

News October 24, 2024

మెదక్‌‌లో మెడికల్ కాలేజీ ప్రారంభం

image

మెదక్ పట్టణంలో కొత్తగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జిల్లా మంత్రి కొండా సురేఖతో కలిసి గురువారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పలు మెడికల్ కాలేజీలను మంజూరు చేసిందని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందనరావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావ్, ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి ఉన్నారు.