Medak

News April 12, 2024

మెదక్‌లో వేడెక్కిన రాజకీయాలు

image

లోక్‌సభ బరిలో నిలిచే అభ్యర్థులు ప్రచార సమరానికి సమాయత్తమవుతున్నారు. మెదక్‌ సెగ్మెంట్‌లో BRS నుంచి MLC వెంకట్రామ్‌రెడ్డి, మాజీ MLA రఘునందన్‌ రావు (BJP), నీలం మధు (కాంగ్రెస్‌) బరిలో ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఇంటింటి ప్రచారం నిర్వహించి ఓట్లను రాబట్టుకునే పనిలో అభ్యర్థులు బిజీగా ఉన్నారు. ఈనెల 18 తర్వాత ప్రచారం హోరెత్తనుంది .

News April 12, 2024

MDK: పటిష్టంగా కొనుగోలు కేంద్రాలు: అదనపు కలెక్టర్

image

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలును పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా హవేలీ ఘన్పూర్ మండల్ బూరుగుపల్లి, వాడి, రాజుపేట, కొత్తపల్లి, గాజిరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించారు. ముందుగా గ్రామాల్లో తాగునీటి సమస్యపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. డిఎస్ఓ బ్రహ్మారావు, ఫ్యాక్స్ సీఈవో సాయి తదితరులున్నారు.

News April 12, 2024

కోహీర్: విద్యుత్ షాక్‌తో బాలిక మృతి

image

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై బాలిక మృతి చెందిన ఘటనా కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన చందన కోహిర్‌లో ఇంటర్ చదువుతోంది. ఇంటి వద్ద పనులు చేసుకుంటుండగా ఇంటికి ఆనుకొని ఉన్న కరెంటు తీగలు చేతికి తగలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

News April 12, 2024

కాంగ్రెస్ ఎన్నికల ప్రచార రథాన్ని ప్రారంభం

image

పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ప్రచార రథాల ప్రారంభోత్సవ కార్యక్రమం పటాన్ చెరు మండలం రుద్రారం గణేష్ గడ్డ దేవాలయం వద్ద శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, టీపీసీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉన్నారు.

News April 12, 2024

మెదక్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే: హరీశ్ రావు

image

మెదక్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురుతుందని మాజీ మంత్రి హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి రుద్రారంలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచార రథాలు ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాల పొంగు లాగా ఉందన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ ఎంత స్పీడ్ గా పెరిగిందో, అంతే వేగంగా పడిపోయిందన్నారు. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో అన్ని వర్గాలను మోసం చేసిందని విమర్శించారు.

News April 12, 2024

సిద్దిపేటలో రూ.5,70,640 నగదు సీజ్

image

సిద్దిపేట జిల్లాలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.5,79,640 సీజ్ చేసినట్లు సిద్దిపేట సీపీ డాక్టర్ బి. అనురాధ తెలిపారు. వంటిమామిడి చెక్ పోస్టు వద్ద రూ.1,50,000, గౌరారం పోలీస్ స్టేషన్ ఎదురుగా రూ.76,640, ముస్త్యాల చెక్ పోస్టు వద్ద రూ.1,60,000, రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ వద్ద రూ.1,10,000, హబ్సిపూర్ X రోడ్ వద్ద రూ. 83,000 సీజ్ చేసినట్లు చెప్పారు.

News April 12, 2024

జహీరాబాద్: పల్లెల్లో ఎన్నికల సందడి.. పార్టీలపై చర్చ..!

image

పల్లెల్లో పార్లమెంట్ ఎన్నికల సందడి మొదలైంది. రచ్చబండ వేదికగా గ్రామాల్లోని పెద్దమనుషులు పార్టీల పనితీరు బెరీజు వేస్తూ ఓట్లు ఎవరికి వేయాలో చర్చించుకునే పనిలో పడ్డారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో చాలావరకు గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. అందులో మేజర్ పంచాయతీలపై పార్టీల అభ్యర్థులు ఫోకస్ పెట్టారు. గ్రామాల్లోని ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకొని ఓట్లు రాబట్టుకునేందుకు ఇప్పటి నుంచే  మంతనాలు చేస్తున్నారు.

News April 12, 2024

ఒక్క రూపాయి అద్దెకే ఫంక్షన్ హాల్: వెంకట్రామిరెడ్డి

image

నియోజకవర్గ కేంద్రాల్లో నిరుపేదలు, మధ్య తరగతి కుటుంబాలకు ఉపయోగపడేలా ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తామని మెదక్ BRS ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. RCపురంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ కేంద్రాల్లో సామాజిక భవనాలు నిర్మించి ఒక్క రూపాయి అద్దెకు ఇస్తామన్నారు. రూ.100 కోట్ల నిధులతో ఉచిత విద్యతోపాటు, నీట్, IAS, IPS కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.

News April 12, 2024

గజ్వేల్: మరోసారి తెరపైకి RRR అలైన్మెంట్ మార్పు అంశం

image

రీజనల్ రింగ్ రోడ్డు(RRR) ఉత్తర భాగం భూసేకరణకు అధికారులు సిద్ధమవుతున్న వేళ కీలక పరిణామం జరిగింది. మర్కూక్ మండల రైతులు మంత్రి వెంకట్ రెడ్డిని కలవడంతో మరోసారి అలైన్మెంట్ మార్పు అంశం తెరపైకి వచ్చింది. HYD రింగ్ రోడ్డుకు 30KMలోపు RRR ఖరారు చేయడంతో నష్టం జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో మరోసారి మార్పులు జరిగే అవకాశం ఉంది. దీనికి ఉమ్మడి జిల్లాలోనే అత్యధికంగా గజ్వేల్‌లో 980 ఎకరాలు సేకరిస్తున్నారు.

News April 12, 2024

మెదక్: ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’

image

కాంగ్రెస్‌ పాలనతో అస్తవ్యస్తంగా మారిన దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న నరేంద్ర మోదీని మరోసారి ప్రధానిగా గెలిపించుకోవాలని, ఫిర్‌ ఏక్‌బార్‌ మోదీ సర్కార్‌ నినాదాన్ని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి ఈటల ఉద్ఘాటించారు. మెదక్‌ చిల్డ్రన్‌ పార్కులో పోలింగ్‌ బూత్‌ కేంద్రాల అధ్యక్షులు సమ్మేళనం నిర్వహించారు. ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రసంగించారు.