India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆధార్ కార్డు తరహాలోనే ఇక ముందు విద్యార్థులకు అపార్ కార్డు రానుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా డిఈఓ మాట్లాడుతూ విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు వెళ్లిన, ఉపకార వేతనాలు, ఇతర ప్రభుత్వ సదుపాయాలు రావాలన్నా ఈ అపార్ కార్డు ముఖ్యమని, అపార్ కార్డుకు సంబంధించి తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకోవాలని, ఇది ఆన్లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు.

సైబర్ బాధితుడికి రూ.12.5 లక్షలు రీఫండ్ చేసేలా పోలీసులు చర్యలు తీసుకున్నారని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. హత్నూరకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి నవీన్ రెండేళ్ల క్రితం ఆన్లైన్లో ఓ వ్యక్తికి పరిచయమయ్యాడు. అతడిని నమ్మిన నవీన్.. రూ.30 లక్షలు జమచేసి మోసపోయానని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూ. 12.5 లక్షలను పోలీసులు హోల్డ్ చేసిన ఆ మొత్తాన్ని బాధితుడి ఖాతాలో రీఫండ్ చేసినట్లు చెప్పారు.

తూప్రాన్ పట్టణ శివారులోని టోల్ ప్లాజా వద్ద గల తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఐటీసీ కంపెనీ వారు కట్టిన స్టడీ హాల్ ను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీసీ కంపెనీ వారు రూ.25 లక్షలతో స్వయంగా స్టడీ హాల్ నిర్మించడం సంతోషకరం అన్నారు. పరిశ్రమల సహాయంతో పాఠశాలలో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఓ పాఠశాల బస్సు ఢీకొని 6 ఏళ్ల చిన్నారి అశ్విని మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం మక్త లక్ష్మాపురం గ్రామంలో జరిగింది. పాఠశాల బస్సు చిన్నారిని దించి వెళ్తుండగా.. అదే బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు ఆగ్రహంతో పాఠశాల బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. యాజమాన్యం వచ్చేవరకు మృతదేహాన్ని తరలించేది లేదంటూ కుటుంబసభ్యులు ఆందోళనకు చేపట్టారు.

అయోధ్యలో శ్రీ మహానారాయణ దివ్య రుద్ర సహిత శత సహస్ర చండీ విశ్వశాంతి మహా యాగాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ సభ్యుడు, TTD మాజీ ఈఓ LV.సుబ్రమణ్యం తెలిపిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ యాగం NOV 2 నుంచి అని ప్రకటించగా తేదీలను పోస్ట్ పోన్ చేశారు. NOV 18 నుంచి JAN 1 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పాల్గొనే వారు తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు సెల్: 7780252277 సంప్రదించాలన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో నిత్యావసర వస్తువులు, కూరగాయలతోపాటు చికెన్ ధర ఆకాశాన్ని తాకుతోంది. వారం రోజులుగా మెదక్లో చికెన్ షాపుల్లో స్కిన్ లెస్ రూ. 230, విత్ స్కిన్ రూ. 205 పలుకుతుంది. ఇక గ్రామాల్లోని చికెన్ సెటర్లల్లో రూ.250 ఉంది. దీంతో మాంసం ప్రియులు వెనక్కి తగ్గుతున్నారు. 1కేజీ తీసుకోవాలనుకున్న వారు అర కేజీతో సరిపెట్టుకుంటున్నారు. కాగా, పెళ్లిళ్ల సీజన్ కావడమే ఇందుకు కారణమని షాపు యజమానులు అంటున్నారు.

మెదక్ జిల్లా హవేలిఘనపూర్ గురుకులానికి చెందిన నలుగురు విద్యార్థినులు విద్యుదాఘాతానికి గురవ్వడంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు. విద్యార్థినులు కరెంట్ షాక్ తగిలి గాయపడటం దురదృష్టకరమని అన్నారు. సిబ్బంది నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నదని.. ప్రభుత్వ పట్టింపు లేనితనం పిల్లల ప్రాణాల మీదకు తీసుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తూప్రాన్ పట్టణంలో ఏఆర్ కానిస్టేబుల్ భార్య కుటుంబ కలహాలతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ భూమేష్ భార్య కవిత (38) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా సాయంత్రం గుర్తించారు. భర్తతో కొన్నేళ్లుగా కలహాలు ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్ సీఆర్ఆర్ గ్రాంట్స్ నుంచి రూ.11.49 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కొహెడ నుంచి తంగళ్లపల్లి (వయ కురెళ్ళ) వరకు 1.10 కి.మీ రోడ్డు కోసం రూ.1.55 కోట్లు, తంగళ్లపల్లి నుంచి శ్రీరాములపల్లి PWD రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం రూ.1.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు.

HYD చందానగర్ PSపరిధిలో ఈరోజు విషాదం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పరిధి అశోక్నగర్లో AP తెనాలి వాసి ఉదయ్(23) ఉంటున్నాడు. రాత్రి ఫ్రెండ్స్తో కలిసి చందానగర్లోని VVప్రైడ్ హోటల్కు వెళ్లాడు. మూడో అంతస్తు బాల్కనీలోకి వెళ్లగానే ఓ కుక్క అతడిని తరిమింది.తప్పించుకునే క్రమంలో కిటికీలో నుంచి కిందపడి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.