Medak

News April 11, 2024

మెదక్: శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో పాల్గొన్న మంత్రి

image

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ టేక్మాల్ మండలం దన్నూరా, బర్దిపూర్, పాల్వంచ, కూసంగి, మల్కాపూర్ గ్రామాల మధ్య ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం దుబ్బగట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహిస్తున్న వెంకటేశ్వర కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

News April 11, 2024

సిద్దిపేట: బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు చేస్తాం: మైనంపల్లి

image

బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ గల్లంతు చేస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సిద్దిపేటలో గురువారం జరిగిన రంజాన్ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణతో కలిసి సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు ఆత్తు ఇమామ్, కౌన్సిలర్ రియాజుద్దిన్‌లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి భారీ మెజారిటీ వచ్చేలా నాయకులు పనిచేయాలన్నారు.

News April 11, 2024

మెదక్‌ MP స్థానంపై మైనంపల్లి ఫోకస్!

image

మెదక్‌ MP స్థానంపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. మైనంపల్లి హన్మంతరావు, MLA రోహిత్‌ కీలక నేతలను హస్తం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బుధవారం BRS కౌన్సిలర్లు రోహిత్‌ను కలవడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే రామాయంపేటలోని నలుగురు కౌన్సిలర్లు‌ కాంగ్రెస్‌లో చేరగా.. తూప్రాన్‌ మున్సిపాలిటీలోనూ హస్తం పాగా వేసింది. లోక్‌సభ అంతటా పార్టీ బలోపేతం కోసం మైనంపల్లి‌ ప్రత్యేక చొవర తీసుకొంటున్నట్లు టాక్.

News April 11, 2024

మెదక్ ఖిలాను సందర్శించిన కలెక్టర్ రాహుల్ రాజ్

image

మెదక్ ఖిల్లాను కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఖిలా చరిత్రను ప్రముఖ వ్యాఖ్యాత వైద్య శ్రీనివాస్ వివరించారు. కాకతీయ రాజుల కాలంలో నిర్మించిన మెదక్ దుర్గం ప్రాముఖ్యత తెలిపారు. ఈ ఖిలా మెదక్‌కు తలమానికం అన్నారు. కలెక్టర్ రాహుల్ రాజ్ ఖిల్లాను కుటుంబసభ్యులతో కలిసి తిరిగారు. అంతకు ముందు ఏడుపాయల వనదుర్గ మాతను కలెక్టర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

News April 11, 2024

పాపన్నపేట: అప్పుల బాధతో ఆత్మహత్య

image

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామానికి చెందిన ఉబిది యేసు(40) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు పెరిగిపోవడంతో కొంతకాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అప్పుల బాధతో మనస్థాపానికి గురైన యేసు రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పాపన్నపేట పోలీసులు కుర్తివాడకు చేరుకొని విచారణ చేస్తున్నారు.

News April 11, 2024

సదాశివపేట: క్రీడా ప్రాంగణంలో గుడిసెలు !

image

సదాశివపేట మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణ నిర్వహణ అధ్వానంగా మారింది. బోర్డులు పాతిన మున్సిపల్ అధికారులు నిర్వహణ పట్టించుకోకపోవడంతో కొందరు కబ్జా చేస్తున్నారు. పట్టణంలోని ఓ క్రీడా ప్రాంగణంలో కొందరు గుడిసెలు వేసుకొని నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణాలు కబ్జాకు గురికాకుండా చూడాలని కోరుతున్నారు.

News April 11, 2024

సిద్దిపేట: చేపల వేటకు వెళ్లి ఇద్దరు కార్మికులు మృతి

image

సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి-ముత్యంపేట గ్రామాల మధ్య కెనాల్‌లో చేపలు పట్టడానికి వెళ్లి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మృతులు ఏపీకి చెందిన తిరుపతి రావు(30), సోమయ్య(30)గా గుర్తించారు. మృతులిద్దరు స్థానిక NPS కెనాల్‌లో కూలీలుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News April 11, 2024

తూప్రాన్: రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర వాసి మృతి

image

మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ పరిధి టోల్ ప్లాజా వద్ద ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన సురేష్ గంగారం(51) మృతి చెందాడు. టోల్ ప్లాజా వద్ద పార్కు చేసిన కంటైనర్ లారీ అకస్మాత్తుగా ముందుకు వెళ్లి రోడ్డుకు అడ్డంగా డివైడర్ పైకెక్కింది. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కామారెడ్డికి చెందిన డ్రైవర్ అనిల్ తీవ్రంగా గాయపడ్డారు.

News April 11, 2024

మెదక్: ఆర్భాటంగా ప్రారంభం.. కొనుగోలు అంతంతే..!

image

అధికారులు ఆర్భాటంగా దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా కొనుగోళ్లను మాత్రం ప్రారంభించలేదు. ప్రస్తుతం వాతావరణ మార్పుల నేపథ్యంలో కల్లాల్లో ధాన్యం పోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. మెదక్ జిల్లాలో 2,60,933 ఎకరాల్లో వరి సాగవగా.. 3.66 లక్షల మెట్రిక్ టన్నుల పంట సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 200కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా పూర్తిస్థాయిలో కోనుగోళ్లు చేయట్లేదని రైతులు అంటున్నారు.

News April 11, 2024

మెదక్: ప్రవేశాలకు మరో రెండు రోజులే గడువు 

image

మహాత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 12తో దరఖాస్తు గడువు ముగుస్తుందని మెదక్ ఆర్సీఓ ప్రభాకర్ అన్నారు. అర్హులైన బాలబాలికలు mjptbcwreis.telangana.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఈ నెల 28న అర్హత పరీక్ష నిర్వహిస్తామన్నారు.